అన్వేషించండి

Pakistan Is Terroristan: పాకిస్తాన్ కాదది 'టెర్రరిస్తాన్', ఉగ్రవాదంతో అన్ని దేశాలకు ముప్పు పొంచి ఉంది- జైశంకర్

Operation Sindoor | బ్రస్సెల్స్ లో జరిగిన సమావేశంలో ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ పాటించాలన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. పాకిస్తాన్‌ను టెర్రరిస్తాన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

EAM Jaishankar |బ్రస్సెల్స్: ఉగ్రవాదంతో పాటు అణ్వస్త్రాలతో బెదిరింపులపై జీరో టోలరెన్స్ ఉండాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. యూరప్‌లో అధికారిక పర్యటనలో ఉన్న జైశంకర్.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్తాన్‌ను 'టెర్రరిస్తాన్' అని సంబోధించారు. ఉగ్రవాదులకు ఆవాసం కనుక ఆ దేశాన్ని టెర్రరిస్తాన్ అనడంలో ఏ తప్పు లేదన్నారు. ఉగ్రవాదం అనేది కేవలం భారతదేశం, పాకిస్తాన్ మధ్య కానే కాదని, ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పుగా అభివర్ణించారు. ఉగ్రదాడులకు అవకాశం లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే భారత బలగాలు పాకిస్తాన్, PoJK లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్‌ ద్వారా దాడిచేశాయన్నారు.  

బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానానికి హై రిప్రజెంటేటివ్ కజా కల్లాస్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ: “టెర్రరిజం అనేది రెండు దేశాల మధ్య వివాదం కాదు. ఇది వాస్తవానికి ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పు. కనుక మీరు దీన్ని ఇండియా-పాకిస్తాన్‌ మధ్య వివాదంలా కాకుండా ‘ఇండియా-టెర్రరిస్తాన్’ మధ్య వివాదంగా భావించాలని కోరారు. 

ఉగ్రవాదంపై అంతర్జాతీయ సహకారం కోరారు. పలు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ప్రజల్లో అవగాహనను మరింత పెంచాలని జైశంకర్ కోరారు. అణ్వస్త్ర బెదిరింపులకు ప్రపంచ సమాజం ఎప్పుడూ లొంగకూడదని, ఉగ్రవాదంపై పోరాటంలోనూ వెనకడుకు వేయకూడదని ఆయన అన్నారు.

"ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై భావవ్యక్తీకరణలోనూ ఎలాంటి సహనం అవసరం లేదని మేం గట్టిగా నమ్ముతున్నాం. పాక్ లాంటి దేశాలు చేసే అణ్వస్త్ర బెదిరింపులకు ఎప్పుడూ లొంగకూడదు. ఇది ప్రపంచ సమాజానికి పొంచి ఉన్న ముప్పు. కనుక ఉగ్రవాదం లాంటి విషయాల్లో భారత్‌కు అంతర్జాతీయ సహకారంతో పాటు ఆయా దేశాలకు అవగాహన ఉండటం చాలా అవసరం" అని జైశంకర్ అన్నారు.

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడిలో ఓ నేపాలీ సహా 26 మంది మరణించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్, పీఓకేలో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. ఆపై పాక్ సరిహద్దుల్లో భారత్ మీద డ్రోన్ దాడులు చేసింది. భారత బలగాలు పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు, ఫైటర్ జెట్లను వచ్చినవి వచ్చినట్లు గాల్లోని పేల్చేసి పాక్ కుయుక్తులను తిప్పి కొట్టాయి. 

పాకిస్తాన్ అనేది ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుంది. మేం ఉగ్రవాదాన్ని సంహించం. "వారు ఎక్కడ ఉన్నా మాకు అనవసరం. వారు పాకిస్తాన్‌లో మరింత దూరంగా ఉంటే, మేము పాకిస్తాన్‌లో అంత లోతుగా వెళ్లి ఉగ్రవాదుల్ని ఏరివేస్తాం. సంఘర్షణకు మూల కారణాలు మారలేదు. ఉగ్రవాదులకు పాక్ ఆవాసంగా మారిందని జైశంకర్ వ్యాఖ్యానించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalapathy Vijay Net Worth: రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
Amit Shah on Naxalism: గిరిజనులు వెనుకుబాటుకు కారణమేంటీ? నక్సలిజాన్ని అంతం చేశామని చెబుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన అమిత్‌ షా 
గిరిజనులు వెనుకుబాటుకు కారణమేంటీ? నక్సలిజాన్ని అంతం చేశామని చెబుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన అమిత్‌ షా 
Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
Live In Relation: సహజీవనం చేస్తున్న జంటలకు కుటుంబ హోదా- India Census పై కేంద్రం కీలక నిర్ణయం
సహజీవనం చేస్తున్న జంటలకు కుటుంబ హోదా- India Census పై కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad- Vijayawada Toll Charges: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
IPL 2026 RR VS CSK Result Update: వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Thalapathy Vijay Net Worth: రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
Mahieka Sharma News: హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
CNG Car Safety Tips: ఒకవేళ CNG కారు పికప్ అకస్మాత్తుగా తగ్గిపోతే ఇంత డేంజరా? ఈ భాగాన్ని చెక్ చేయకుంటే కారు పనికిరాకుండా పోతుంది!
ఒకవేళ CNG కారు పికప్ అకస్మాత్తుగా తగ్గిపోతే ఇంత డేంజరా? ఈ భాగాన్ని చెక్ చేయకుంటే కారు పనికిరాకుండా పోతుంది!
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
Embed widget