అన్వేషించండి

Pakistan Is Terroristan: పాకిస్తాన్ కాదది 'టెర్రరిస్తాన్', ఉగ్రవాదంతో అన్ని దేశాలకు ముప్పు పొంచి ఉంది- జైశంకర్

Operation Sindoor | బ్రస్సెల్స్ లో జరిగిన సమావేశంలో ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ పాటించాలన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. పాకిస్తాన్‌ను టెర్రరిస్తాన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

EAM Jaishankar |బ్రస్సెల్స్: ఉగ్రవాదంతో పాటు అణ్వస్త్రాలతో బెదిరింపులపై జీరో టోలరెన్స్ ఉండాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. యూరప్‌లో అధికారిక పర్యటనలో ఉన్న జైశంకర్.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్తాన్‌ను 'టెర్రరిస్తాన్' అని సంబోధించారు. ఉగ్రవాదులకు ఆవాసం కనుక ఆ దేశాన్ని టెర్రరిస్తాన్ అనడంలో ఏ తప్పు లేదన్నారు. ఉగ్రవాదం అనేది కేవలం భారతదేశం, పాకిస్తాన్ మధ్య కానే కాదని, ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పుగా అభివర్ణించారు. ఉగ్రదాడులకు అవకాశం లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే భారత బలగాలు పాకిస్తాన్, PoJK లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్‌ ద్వారా దాడిచేశాయన్నారు.  

బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానానికి హై రిప్రజెంటేటివ్ కజా కల్లాస్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ: “టెర్రరిజం అనేది రెండు దేశాల మధ్య వివాదం కాదు. ఇది వాస్తవానికి ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పు. కనుక మీరు దీన్ని ఇండియా-పాకిస్తాన్‌ మధ్య వివాదంలా కాకుండా ‘ఇండియా-టెర్రరిస్తాన్’ మధ్య వివాదంగా భావించాలని కోరారు. 

ఉగ్రవాదంపై అంతర్జాతీయ సహకారం కోరారు. పలు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ప్రజల్లో అవగాహనను మరింత పెంచాలని జైశంకర్ కోరారు. అణ్వస్త్ర బెదిరింపులకు ప్రపంచ సమాజం ఎప్పుడూ లొంగకూడదని, ఉగ్రవాదంపై పోరాటంలోనూ వెనకడుకు వేయకూడదని ఆయన అన్నారు.

"ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై భావవ్యక్తీకరణలోనూ ఎలాంటి సహనం అవసరం లేదని మేం గట్టిగా నమ్ముతున్నాం. పాక్ లాంటి దేశాలు చేసే అణ్వస్త్ర బెదిరింపులకు ఎప్పుడూ లొంగకూడదు. ఇది ప్రపంచ సమాజానికి పొంచి ఉన్న ముప్పు. కనుక ఉగ్రవాదం లాంటి విషయాల్లో భారత్‌కు అంతర్జాతీయ సహకారంతో పాటు ఆయా దేశాలకు అవగాహన ఉండటం చాలా అవసరం" అని జైశంకర్ అన్నారు.

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడిలో ఓ నేపాలీ సహా 26 మంది మరణించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్, పీఓకేలో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. ఆపై పాక్ సరిహద్దుల్లో భారత్ మీద డ్రోన్ దాడులు చేసింది. భారత బలగాలు పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు, ఫైటర్ జెట్లను వచ్చినవి వచ్చినట్లు గాల్లోని పేల్చేసి పాక్ కుయుక్తులను తిప్పి కొట్టాయి. 

పాకిస్తాన్ అనేది ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుంది. మేం ఉగ్రవాదాన్ని సంహించం. "వారు ఎక్కడ ఉన్నా మాకు అనవసరం. వారు పాకిస్తాన్‌లో మరింత దూరంగా ఉంటే, మేము పాకిస్తాన్‌లో అంత లోతుగా వెళ్లి ఉగ్రవాదుల్ని ఏరివేస్తాం. సంఘర్షణకు మూల కారణాలు మారలేదు. ఉగ్రవాదులకు పాక్ ఆవాసంగా మారిందని జైశంకర్ వ్యాఖ్యానించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget