అన్వేషించండి

డాక్టర్‌కి ఝలక్ ఇచ్చిన పేషెంట్, నకిలీ నోటుతో ఫీజు కట్టాడు - సైలెంట్‌గా వెళ్లిపోయాడు

Fake 500 Rs Note: ఓ డాక్టర్‌కి ఫీజ్‌ కింద రూ.500 నకిలీ నోటు ఇచ్చి పేషెంట్‌ సైలెంట్‌గా వెళ్లిపోయాడు.

Fake 500 Rs Note:

రూ.500 నకిలీ నోటు..

డిజిటల్ చెల్లింపులకు అందరూ అలవాడు పడిపోతున్నా కొందరు మాత్రం ఇంకా కరెన్సీ నోట్లతోనే లావాదేవీలు జరుపుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ చేసే అవకాశమున్న చోట కూడా నోట్లు ఇస్తున్నారు. కొంత మంది కావాలనే దొంగ నోట్లు ఇచ్చి మోసం చేస్తుండగా..మరికొందరు తెలియకుండానే ఫేక్‌ కరెన్సీ ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఇలాంటి అనుభవమే ఓ డాక్టర్‌కి ఎదురైంది. ఆర్థోపెడిక్ సర్జన్‌ని కన్సల్ట్ అయ్యేందుకు ఓ పేషెంట్ వచ్చాడు. డాక్టర్‌తో మాట్లాడిన తరవాత ఫీజు ఇచ్చి వెళ్లిపోయాడు. రూ.500 నోటు ఇచ్చాడు. ఆ తరవాత  హాస్పిటల్ సిబ్బంది ఇది గమనించి డాక్టర్‌కి చెప్పింది. కానీ..ఆ డాక్టర్ సీరియస్ అవ్వకుండా దీన్ని లైట్ తీసుకున్నారు. పైగా...Threads యాప్‌లో ఇదంతా పంచుకున్నారు. ఓ పేషెంట్ చేసిన పనికి తనకు నవ్వొచ్చిందని పోస్ట్ పెట్టాడు. 

"ఈ మధ్యే ఓ పేషెంట్ నన్ను కన్సల్ట్ అవ్వడానికి వచ్చాడు. వెళ్తూ వెళ్తూ రూ.500 నోటు ఫీజ్‌ కింద ఇచ్చాడు. మా రిసిప్షనిస్ట్ పెద్దగా పట్టించుకోలేదు. అయినా దొంగ నోటు ఇస్తారని ఊహించరు కదా. ఆ తరవాత గమనిస్తే అది ఫేక్ కరెన్సీ అని అర్థమైంది. ఏదేమైనా ఈ నోటు చూసి నాకు నవ్వు ఆగలేదు. ఈ నోటుని దాచుకున్నాను. ఇంకా హైలైట్ ఏంటంటే...ఈ నోట్‌పైన ఓ వైపు ఫర్ ప్రాజెక్ట్‌ స్కూల్ యూజ్ ఓన్లీ అని రాసుంది"

- డాక్టర్ 

ఈ పోస్ట్ పెట్టిన వెంటనే వందలాది లైక్స్ వచ్చాయి. కామెంట్లు వెల్లువెత్తాయి. బహుశా ఫర్జీ వెబ్‌సిరీస్ చూసి ఇన్‌స్పైర్ అయ్యారేమో అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆ వ్యక్తెవరో కానీ చాలా ఇంటిలిజెంట్ అయ్యుంటాడు అని మరి కొందరు కామెంట్ చేశారు.

 
Post by @dr.mananvora
 
View on Threads

ఏటీఎంలో దొంగనోట్లు వస్తే ఏం చేయాలి? ఏటీఎంలో దొంగనోట్లు గుర్తించిన వెంటనే సీసీటీవీ ముందు నిలబడి నోటు ముందు, వెనకవైపు చూపించాలి. దొంగనోటు గురించి అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుకు తెలియజేయాలి. ఆ ఏటీఎం లావాదేవీకి సంబంధించిన రిసిప్టును భద్రపరుచుకోవాలి. ఆ తర్వాత బ్యాంకు వెళ్లి దానిని డిపాజిట్‌ చేయాలి. వారికి ఏటీఎం రిసిప్టు చూపించాలి. బ్యాంకు అధికారులు తమ నిబంధనలను అనుసరించి అసలు నోటును ఇస్తారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏటీఎం నుంచి దొంగనోట్లు వస్తే సాధ్యమైనం త్వరగా కస్టమర్‌కు అసలు నోట్లు ఇవ్వాలి. బ్యాంకు ఇందుకు నిరాకరిస్తే ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటుంది. దొంగనోట్లను బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఫేక్‌ ఇండియన్‌ కరెన్సీ నోట్‌ (FICN)గా పిలుస్తారు. ఈ నోట్లను చలామణీలోకి తెస్తే జీవితఖైదు విధిస్తారు. ఐపీసీ సెక్షన్‌ 489C ప్రకారం ఇది నేరం. నేర తీవ్రతను బట్టి ఏడేళ్ల నుంచి జీవితకాలం జైలు శిక్ష విధిస్తారు. నోట్ల రద్దుకు ముందు బ్యాంకింగ్‌ వ్యవస్థలో 2012 నుంచి 17 మధ్యన ఏటా 5.21 లక్షలు, 4.98, 4.88, 5.94, 6.36, 7.62 లక్షల దొంగనోట్లను గుర్తించారు. 

Also Read: ట్రైన్‌లో ఉండగా ఫోన్‌ లాక్కున్న దుండగులు, పట్టుకోబోయి కింద పడిన యువతి మృతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget