అన్వేషించండి

Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 

Fertilizer Subsidy Increased: కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం రోజున రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎరువులపై రాయితీ ప్రకటించింది. 

Fertilizer Subsidy: కొత్త సంవత్సరం తొలి రోజే కేంద్రం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. తొలి కేబినెట్ సమావేశంలో రైతులకు సంబంధించిన కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో డీఏపీ ఎరువులు తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించింది. దీంతో రైతులు డీఏపీకి అధిక ధర చెల్లించాల్సిన అవసరం లేదు. ఎరువులపై అధిక సబ్సిడీ ఇవ్వనుంది కేంద్రం. 

డీఏపీ ఎరువుల తయారీదారులకు ఉపశమనం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారికి సబ్సిడీతోపాటు ఆర్థిక సాయం అందించేందుకు కూడా ఆమోదం తెలిపింది. వ్యవసాయ ఉత్పాదకతను ప్రోత్సహించడం, రైతులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు అవసరమైన ఎరువులను సరసమైన ధరలకు అందించడం ఈ నిర్ణయాల లక్ష్యం.

అందుకే జనవరి 1నే కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దంతో ఇప్పుడు రైతులకు 50 కిలోల డిఎపి బ్యాగ్‌ను రూ.1350కి రానుంది. దీనికి అయ్యే అదనపు ఖర్చులను కేంద్రం భరించనుంది. దీని కోసం డీఏపీ కంపెనీలకు రూ.3850 కోట్ల సబ్సిడీని భారత ప్రభుత్వం ఇస్తుంది.

డీఏపీ ప్యాకేజీ ఒక సంవత్సరంపాటు వర్తిస్తుంది అంటే దీని ప్రయోజనాన్ని 31 డిసెంబర్ 2025 వరకు పొందవచ్చు. DAP ఎరువుల తయారీదారులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ఈ ప్యాకేజీని ఆమోదించింది.  

కేంద్ర క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు రూ.69515 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపినట్లు తెలిపారు. దీని వల్ల 4 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. చిన్న రైతులు ఫసల్ బీమా యోజన ప్రయోజనం పొందుతున్నారు. ఈ ఫసల్ బీమా పథకాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తామన్నారు. 

రైతుకు ఇస్తున్న పంటల బీమా పథకాన్ని  మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పంటల బీమా పథకాన్ని సులభతరం చేసేందుకు, దాని నియమాలు, నిబంధనలను సవరిస్తామన్నారు. 2025 సంవత్సరానికి సంబంధించిన మొదటి కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది, ఇందులో ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు.  

DAP అంటే ఏమిటి
DAP అంటే డి-అమ్మోనియం ఫాస్ఫేట్, ఇది పంటలకు భాస్వరం, నత్రజని అందిస్తుంది. DAP అనేది అమ్మోనియా, ఫాస్పోరిక్ ఆమ్లం ప్రతిచర్య నుండి తయారైన నీటిలో కరిగే ఎరువులు. రైతులకు ఇది ఒక ప్రధానమైన ఎంపిక ఎందుకంటే ఇది వేగంగా కరిగిపోతుంది. పోషకాలలో అధికంగా ఉంటుంది.

మోదీ హర్షం

కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. అందుకే మొదటి మంత్రిమండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. 

Also Read: అక్కాచెల్లెళ్లను హైదరాాబాద్‌లో అమ్మేస్తారని చంపేశా - సంచలనం రేపుతున్న లక్నో హత్య కేసు నిందితుడి వీడియో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget