అన్వేషించండి

Cyclone Michaung Updates: చెన్నైకి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, వరద నష్టంపై ఏరియల్ సర్వే

Cyclone Michaung News: చెన్నైలో వరద నష్టంపై రాజ్‌నాథ్ సింగ్ ఏరియల్ సర్వే చేయనున్నారు.

Cyclone Michaung News in Telugu: 

తుఫాన్ ప్రభావం..

మిగ్జాం తుఫాన్ ప్రభావం చెన్నైపై (Cyclone Michaung) కొనసాగుతూనే ఉంది. తమిళనాడులోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దాదాపు నాలుగు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. చెన్నై నుంచి (Chennai Floods) వెళ్లాల్సిన 15 రైళ్లను రద్దు చేశారు. ఒడిశాలోనూ పంట నష్టం (Odisha Cyclone Michaung) భారీగా నమోదైంది. అటు ఏపీలోనూ ఈ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వచ్చే 12 గంటల్లో తుఫాను బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. చేపల వేటకు మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఇప్పటి వరకూ హెచ్చరించింది IMD. క్రమంగా ఈ ప్రభావం తగ్గే అవకాశమున్నందున ఈ హెచ్చరికల్ని ఉపసంహరించుకుంది. అయితే...తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఈ ఎఫెక్ట్‌ కొనసాగుతోంది. చెన్నై, వెలచెరి, తంబరం ప్రాంతాలు భారీ వర్షాలతో (Cyclone Michaung Effect) సతమతం అవుతున్నాయి. వాటర్ సప్లై నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకీ అంతరాయం కలిగింది. మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి పవర్ సప్లైని రీస్టోర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యావసర సరుకులనూ అందిస్తున్నారు. 

రాజ్‌నాథ్ సింగ్ ఏరియల్ సర్వే

చెన్నైలోని వరద పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. అవసరమైన సహాయం చేసేందుకు ముందుంటామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెన్నైలో పర్యటించనున్నారు. ఇవాళ (డిసెంబర్ 7) ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వరద పరిస్థితులను సమీక్షించనున్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు ఓ మంత్రి ఏరియల్ సర్వే చేయనున్నారు. ఏరియల్ సర్వే పూర్తైన తరవాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌తో పాటు మరి కొందరు కీలక అధికారులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీ కానున్నారు. 

ఇప్పటి వరకూ అప్‌డేట్స్ ఇవీ..

వరదల కారణంగా చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్‌పట్టు ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వీధుల్లో ఎక్కడికక్కడ వరద నీళ్లు నిలిచిపోయాయి. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో వరద నీటిని బయటకు పంపలేకపోతున్నారు అధికారులు. చిన్నారులను, మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పడవల్లో వాళ్లను వేరే ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ (MK Stalin) ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించారు. నిత్యావసర సరుకులు అందించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సాయం కింద రాష్ట్రానికి రూ.5,060 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget