By: ABP Desam | Updated at : 17 Dec 2022 09:09 PM (IST)
బిహార్లో కల్తీ మద్యం కల్లోలం ( Image Source : PTI )
Over 200 killed in Bihar hooch tragedy: Chirag Paswan బిహార్లో కల్తీ మద్యం కల్లోలం రేపుతోంది. తాజాగా కల్తీ మద్యానికి కనీసం 37 మంది మృతిచెందారు. దాంతో కల్తీ మద్యం మరణాల సంఖ్య 70 దాటిపోయింది. అయితే కల్తీ మద్యం సేవించి ఇప్పటివరకూ 200 మందికి పైగా మరణించారని, బిహార్ ప్రభుత్వం ఆ విషయాన్ని దాచిపెట్టిందని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. పోస్ట్మార్టం నిర్వహిచకుండానే అంత్యక్రియలు నిర్వహించాలని బాధితుల కుటుంబాలపై ప్రభుత్వం ఒత్తిడి చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మౌనం వహించడాన్ని ప్రశ్నించారు.
బిహార్ లోని ఛాప్రా జిల్లాతో పాటు సరన్, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు నమోదవుతున్నాయి. వారి మరణానికి మద్యం సేవించడం కారణమని చెప్పకూడదని, లేదంటే వారిని జైలుకు పంపుతామని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, సీఎం మౌనం, అధికారుల మద్దతు మరిన్ని అనుమానాలకు కారణం అని జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆరోపించారు. మద్యపానం నిషేధించిన రాష్ట్రం బిహార్ లో కల్తీ మద్యం మరణాలు ఆందోళన పెంచుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కల్తీ మద్యానికి బలయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
200 से ज्यादा लोगों की मृत्यु हुई है। सच दबाया जा रहा है। पोस्टमार्टम किए बिना अंतिम संस्कार करवाया गया। परिवार पर दवाब डालाते हुए बोला जा रहा है कि मत बोलो कि शराब से मृत्यु हुई है नहीं तो जेल भेज देंगे। CM की खामोशी भ्रष्ट अधिकारियों को समर्थन है: चिराग पासवान, LJP (रामविलास) pic.twitter.com/6VyakVmqFi
— ANI_HindiNews (@AHindinews) December 17, 2022
పెళ్లి వేడుకల్లో కల్తీ మద్యం, పెరుగుతున్న మరణాలు..
2016లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యంపై నిషేధం విధించినా.. బిహార్ లో తరచుగా కల్తీ మద్యం మరణాలు నమోదవుతుంటాయి. ఇటీవల పెళ్లి వేడుకల్లో స్థానికంగా తయారుచేసి మహువా, దేశీ మద్యం సేవించిన తరువాత వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో సరన్, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు సంభవించాయి. సోమవారం చనిపోయిన దాని కంటే అధిక సంఖ్యలో గురువారం నాడు కల్తీ మద్యం మరణాలు సంభవించాయని తెలుస్తోంది. ఓ డాక్టర్ ఏఎఫ్పీతో మాట్లాడుతూ.. గడిచిన 48 గంటల్లో 24 మందికి పైగా చనిపోయినట్లు గుర్తించామని శనివారం తెలిపారు. అధికారిక లెక్కలపై స్పష్టత లేదన్నారు.
BREAKING | बिहार-यूपी बार्डर पर खुलेआम बिक रही है शराब
— ABP News (@ABPNews) December 17, 2022
- ग्राउंड जीरो से देखिए ये रिपोर्ट @ShobhnaYadava | @varunjainNEWS #BiharNews #Liquor #NitishKumar pic.twitter.com/4zv4S640zo
కల్తీ మద్యం మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ బిహార్ ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి శుక్రవారం నోటీసులు సైతం జారీ చేసింది. పోలీస్ స్టేషన్ల నుంచే కల్తీ మద్యం సరఫరా అయిందని ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మష్రక్ పోలీస్ స్టేషన్లో ధ్వంసం చేసేందుకు తరలించిన మద్యం అక్కడి నుంచి బయటకు వెళ్లడం తాజాగా వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఇదివరకే దాదాపు రెండు వందల మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. కొందరు బాధితులు కంటి చూపు కోల్పోగా, మరికొందరు తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతున్నారు. ఇంకా కొన్ని వందల మంది ఆయా జిల్లాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సమాచారం.
Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్స్ - ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంచలన మలుపు, ఛార్జ్షీట్లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు
Bullet Train Project: 2026 నాటికి భారత్లో బులెట్ ట్రైన్, మోదీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు - ABPతో రైల్వే మంత్రి
Ram Mandir Construction: అయోధ్య రాముడి కోసం నేపాల్ నుంచి సాలగ్రామ శిలలు, భక్తుల ఘనస్వాగతం
Dattatreya Hosabale: భారతీయులందరూ పుట్టుకతో హిందువులే, బీఫ్ తినే వాళ్లనూ మతంలోకి ఆహ్వానిద్దాం - RSS లీడర్
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు