అన్వేషించండి

మళ్లీ ఎన్‌డీఏ కూటమిలోకి JDU? నితీశ్ కుమార్ సమాధానమిదే!

Nitish Kumar: ఎన్‌డీఏ కూటమిలో మళ్లీ జేడీయూ చేరుతుందన్న వార్తల్ని నితీశ్ కుమార్ కొట్టి పారేశారు.

Nitish Kumar: 


ఎన్‌డీఏలోకి జేడీయూ..?

జేడీయూ మళ్లీ NDA కూటమిలో చేరుతుందన్న ఊహాగానాలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కొంత మంది బీజేపీ నేతలూ ఇదే విషయాన్ని నేరుగా కాకపోయినా పరోక్షంగా చెప్పారు. ఏడాది క్రితమే NDA లో నుంచి బయటకు వచ్చి RJDతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్ యాదవ్. తేజస్వీ యాదవ్ డిప్యుటీ సీఎం బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్లో ఇదో సంచలనమైంది. బీజేపీ నితీశ్‌పై తీవ్రంగా మండి పడింది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేదని విమర్శించింది. అయితే...కొంత కాలంగా మళ్లీ JDU ఎన్‌డీఏలో చేరుతుందన్న వార్తలు వినిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది. దీనిపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి ఆలోచనే లేదని కొట్టి పారేశారు. I.N.D.I.A కూటమిని బలోపేతం చేయడమే తన కర్తవ్యం అని, అంతకు మించి ఇంకేమీ ఆలోచించడం లేదని తేల్చి చెప్పారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ "ఏంటీ పనికి రాని మాటలు" అంటూ ఫైర్ అయ్యారు. మోదీ సర్కార్‌ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష కూటమిలో పెద్ద దిక్కుగా ఉన్నారు నితీశ్ కుమార్. మొదటి నుంచి ఆయనే అన్ని పార్టీలనూ సమన్వయ పరుస్తున్నారు. అయితే..అటు బిహార్‌లోని జేడీయూ నేతలు మాత్రం నితీశ్‌ని ప్రధాని అభ్యర్థి గానూ ప్రచారం చేస్తున్నారు. బిహార్ అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్, సీనియర్ నేత మహేశ్వర్ హజారీ ఇప్పటికే ఈ వ్యాఖ్యలు చేశారు. I.N.D.I.A కూటమిలో ప్రధాని అభ్యర్థిగా నిలబడే అర్హత, సామర్థ్యం నితీశ్‌కి తప్ప మరెవరికీ లేదని అన్నారు. ఇక మంత్రి వర్గ విస్తరణపై నితీశ్‌ని ప్రశ్నించగా..సమాధానం దాటవేశారు. డిప్యుటీ సీఎంని అడగండి అంటూ వెళ్లిపోయారు. 

పదవులపై ఆసక్తి లేదట..

కూటమికి పేరైతే పెట్టారు కానీ...ఇప్పటి వరకూ లీడ్ చేసేది ఎవరన్నది ప్రకటించలేదు. మొదటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరే వినిపిస్తోంది. ఆయనే I.N.D.I.A కూటమికి కన్వీనర్‌గా ఉంటారని చాలా మంది నేతలు చెప్పారు. దీనిపై నితీష్ కుమార్ స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చారు. తనకు ఏ పదవిపైనా ఆసక్తి లేదని, కేవలం అన్ని పార్టీలను ఒకేతాటిపైకి తీసుకురావడమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. కూటమి నుంచి ఏమీ ఆశించడం లేదని స్పష్టం చేశారు. నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆయన గట్టిగానే స్పందించారు. అలాంటి ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు.  విపక్షాలు యునిటీగా పోరాటం చేయాలని నితీష్ కుమార్ భావిస్తున్నా...కొన్ని పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు తలెత్తుతున్నాయి. వాటిని తీర్చేందుకు నితీష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 

"నాకు ఏ పదవిపైనా ఆసక్తి లేదు. ఇదే విషయాన్ని నేను గతంలోనూ చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. నాకు కన్వీనర్ పదవిపై ఏ మాత్రం ఆసక్తి లేదు. కేవలం అన్ని పార్టీలను కలపడమే నా పని. అదే నా లక్ష్యం"

- నితీష్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి 

Also Read: ఢిల్లీ మెట్రో రైల్‌లో ముద్దులతో మైమరిచిపోయిన జంట, వైరల్ అవుతున్న వీడియో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget