అన్వేషించండి

Imported Coal: మార్చి వరకు 4% విదేశీ బొగ్గు వాడండి, కొరత వేళ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలు

Imported Coal: బొగ్గు నిల్వలు సరిపడా లేనందు వల్ల మార్చి వరకు 4 శాతం విదేశీ బొగ్గు వాడాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.

Imported Coal: దేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ పెరిగిపోయింది. అయితే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జలాశయాలు ఆశించిన మేర నిండుకోలేవు. దీని వల్ల జల విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయింది. డిమాండ్ ను తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి కోసం చాలా రాష్ట్రాల్లోని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బొగ్గు ఆధారిత కరెంట్ పై దృష్టి పెట్టాయి. అయితే డిమాండ్ కు తగ్గ విద్యుత్ ఉత్పత్తిని అందుకోవడానికి అవసరమైన బొగ్గు నిల్వలు లేనందు వల్ల కేంద్రం ఈ సమస్యపై ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది మార్చి నెల వరకు 4 శాతం విదేశీ బొగ్గును ఉపయోగించాలని రాష్ట్రాలకు కేంద్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాల ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ ఉత్పత్తి సంస్థల సీఎండీలకు లేఖ రాసింది. 

ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 6 శాతం విదేశీ బొగ్గును కలపాలని ఇది వరకు ఉత్తర్వులు జారీ చేశామని కేంద్రం పేర్కొంది. తాజాగా పరిస్థితులను సమీక్షించినట్లు తెలిపింది. ఆర్థిక వృద్ధిని అనుసరించి దేశంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగినట్లు చెప్పుకొచ్చింది. ఆగస్టు నెల మొత్తం 200 గిగావాట్లకు మించి డిమాండ్ నమోదు అయినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గరిష్ఠ డిమాండ్ 236.6 గిగావాట్లను తాకినట్లు వెల్లడించింది. ఇది గత ఏడాది ఆగస్టు నెలలో కనిపించిన డిమాండ్ కంటే 21 శాతం ఎక్కువ అని కేంద్రం పేర్కొంది. దేశీయంగా అందుబాటులోకి వస్తున్న బొగ్గు, దాని ఉపయోగం మధ్య నిరంతరం భారీగా వ్యత్యాసం కనిపిస్తోందని చెప్పుకొచ్చొంది. 

ఆగస్టు లో రోజుకు 2 లక్షల టన్నుల మేర కొరత కనిపించిందని, ఆ కొరతను కొంత మేరకు విదేశీ బొగ్గు ద్వారా పూడ్చగలిగినట్లు కేంద్రం చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో అంటే అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి నెల వరకు 404 మిలియన్ టన్నుల దేశీయ బొగ్గు అవసరం అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసినట్లు వెల్లడించింది. అయితే రైల్వే నెట్ వర్క్ తో ఉన్న ఇబ్బందుల వల్ల వచ్చే 6 నెలల కాలంలో 397 మిలియన్ టన్నుల దేశీయ బొగ్గు మాత్రమే సరఫరా చేయడానికి వీలు అవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడం తప్పనిసరి అని వెల్లడించింది. దీని వల్ల వచ్చే 6 నెలల వరకు కనీసం 4 శాతం విదేశీ బొగ్గును దేశీయ బొగ్గుతో కలిపి వాడాలని నిర్ణయించినట్లు రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర సర్కారు వివరించింది. అందువల్ల అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు 4 సాతం విదేశీ బొగ్గును కలపడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని లేఖల్లో పేర్కొంది.

భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్

దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెద్ద ఎత్తున పెరిగిపోయింది. రాత్రిపూట కూడా భారీగా వినియోగం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల వ్యవసాయానికి పగటి వేళల్లో మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. రాత్రివేళల్లో అస్సలే పంట సాగు కోసం కరెంటు ఇవ్వకూడదని వివరించింది. పగటి వేళల్లో డిమాండ్ మరీ ఎక్కువ అయితే సౌర, పవన విద్యుత్ తో తీర్చవచ్చని స్పష్టం చేసింది. ఈనెల ఒకటవ తేదీన పగటి పూట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 241 గిగావాట్లకు పెరిగిపోయినా తీర్చడం సాధ్యం అయిందని పేర్కొంది. దేశంలో కేవలం 0.1 శాతమే విద్యుత్ కొరత ఉందని తెలిపింది.

కొంతకాలం నుంచి సూర్యాస్తమయం తర్వాతి వేళల్లోనూ భారీగా విద్యుత్ డిమాండ్ ఉంటోందని.. ఈనెల ఒకటవ తేదీన ఈ సమయంలో రికార్డు స్థాయిలో 218.4 గిగావాట్ల డిమాండ్ నమోదు అయిందని వెల్లడించింది. సౌర విద్యుత్ లభ్యత లేకపోవడంతో రాత్రిపూట కొరత ఏర్పడుతోందని అందువల్లే విద్యుత్ సరఫరాను పగటి వేళకే పరిమితం చేయాలని సూచించింది. ఈ మేరకు భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్ ను తీర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ.. కేంద్ర విద్యుత్ శాఖ ఈనెల 5వ తేదీన అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget