By: Ram Manohar | Updated at : 04 Oct 2023 06:00 PM (IST)
ఢిల్లీ ఎక్సైజ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.
Sanjay Singh Arrest:
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్కి పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే సంజయ్ సింగ్ గురించి ఈడీ చాలా సార్లు ప్రస్తావించింది. ఛార్జ్షీట్లోనూ ఆయన పేరు ఉంది. ఆయన ఇంట్లో తొలిసారి సోదాలు నిర్వహించింది ఈడీ. రోజంతా సోదాలు చేసిన తరవాత సాయంత్రానికి అరెస్ట్ చేసింది. అరెస్ట్కి ముందు సుదీర్ఘంగా విచారించింది. ఎన్నో ప్రశ్నలు వేసింది.
AAP MP Sanjay Singh arrested following the ED raid at his residence in connection with the Delhi excise policy case. pic.twitter.com/tvOxDaOg5b
— ANI (@ANI) October 4, 2023
పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కి పాల్పడినట్టు ఈడీ చెబుతోంది. సంజయ్ సింగ్ ఇంటి ఎదుట ఆయన మద్దతుదారులు చేరుకున్నారు. ఈడీ సోదాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు. సత్యేంద్రజైన్తో పాటు మనీశ్ సిసోడియా జైల్లో ఉన్నారు. ఇంకా లీగల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఈ విచారణ ఓ కొలిక్కి రాలేదు. సీబీఐ ఛార్జ్షీట్ ప్రకారం...గతేడాకి అక్టోబర్ 1వ తేదీన దినేష్ అరోరా ఈ కేసులో అప్రూవర్గా మారాడు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లిక్కర్ కేసులో మనీలాండరింగ్కి పాల్పడినట్టు సీబీఐకి చెప్పాడు. సంజయ్ సింగ్ ద్వారానే మనీశ్ సిసోడియాని కలిసినట్టు వివరించాడు. సంజయ్ సింగ్ సలహాతోనే రెస్టారెంట్ ఓనర్లతో మాట్లాడి రూ.82 లక్షల చెక్లు కలెక్ట్ చేసినట్టు చెప్పాడు. ఆ డబ్బులనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేసినట్టు తెలిపాడు. ఈ డబ్బంతా మనీశ్ సిసోడియాకి ఇచ్చినట్టు అంగీకరించాడు.
#WATCH | Delhi | Supporters of AAP MP Sanjay Singh sit outside his residence and raise slogans.
— ANI (@ANI) October 4, 2023
ED raid is going on at his residence since today morning in connection with the Delhi excise policy case. pic.twitter.com/gGTvE3y2uk
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీకి ఉన్న చివరి అస్త్రం ఇదే అని విమర్శించారు. ఈడీ సోదాల్లో ఒక్క రూపాయి కూడా దొరకలేదని, ఇకపై కూడా ఏమీ దొరకదని తేల్చి చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో భాగంగా ఈడీ సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు చేసింది. ఇప్పటికే ఈ కేసు ఢిల్లీలో సంచలనం సృష్టించింది. పలువురు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు జరిగాయి. అప్పటి నుంచి మధ్య మధ్యలో ఈ కేసు అలజడి రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ సింగ్పైనా దృష్టి పెట్టింది ఈడీ. దీనిపైనే ప్రధాని మోదీని టార్గెట్గా చేసుకుని అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.
Also Read: ఉజ్జెయిన్ అత్యాచార కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత, బుల్డోజర్తో ధ్వంసం - వీడియో
Delhi Air Pollution: బాబోయ్ మేము ఉండలేం, ఇక్కడి నుంచి వెళ్లిపోతాం - సర్వేలో ఢిల్లీ, ముంబై వాసులు
IPR Recruitment: ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Natural Disasters: దేశంలో వేగంగా మారిపోతున్న వాతావరణం, వేలాదిగా మరణాలు
Ashwini Vaishnaw: 2026లో దూసుకెళ్లనున్న తొలి బుల్లెట్ రైలు
Anju Nasrullah: ఇండియాలో అడుగుపెట్టిన అంజు, ఎందుకంటే?
Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్తో పోలింగ్ బూత్కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!
Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!
Chiranjeevi Telangana Elections: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్కు ఫుల్ మీల్స్
Airtel Vs Jio: నెట్ఫ్లిక్స్ను ఫ్రీగా అందించే ఎయిర్టెల్, జియో ప్లాన్లు ఇవే - మినిమం రీఛార్జ్ ఎంతంటే?
/body>