News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

30 కిలోల హైగ్రేడ్‌ కొకైన్‌ డ్రగ్స్‌ను జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిలోని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బేనీహాల్‌ వద్ద డ్రగ్స్‌ ముఠాను అదుపులోకి తీసున్నారు.

FOLLOW US: 
Share:

జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. 30 కిలోల హైగ్రేడ్‌ కొకైన్‌ డ్రగ్స్‌ను జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిలోని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బేనీహాల్‌ వద్ద డ్రగ్స్‌ ముఠాను అదుపులోకి తీసున్నారు. వారి వద్ద నుంచి 30 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలోని బేనీహాల్‌ వద్ద డ్రగ్స్‌ ముఠా కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. డ్రగ్స్‌ ముఠా కోసం వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానం ఉన్న ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా అందులో భారీగా డ్రగ్స్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హైగ్రేడ్‌ కొకైన్‌ గుర్తించిన పోలీసులు, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.300 కోట్లు ఉంటుందని జమ్మూ జోన్‌ ఏడీజీపీ ముకేశ్‌ సింగ్‌ వెల్లడించారు. 

దేశంలో పంజాబ్‌లోనే అత్యధికంగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. పంజాబ్‌లో ఏటా సుమారు 7,500 కోట్ల విలువైన డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో హెరాయిన్ వాటా రూ.6,500 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. సగటున ప్రతిరోజూ రూ.20 కోట్ల మేరకు పంజాబ్ లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. ఒక్కో వ్యక్తి డ్రగ్స్ కోసం సుమారు రూ.1400 ఖర్చుచేస్తున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. పంజాబ్‌లో డ్రగ్స్ మహమ్మారిపై బాలీవుడ్‌లో ఉడ్తా పంజాబ్‌ పేరుతో సినిమా కూడా వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అవగతం చేసుకోవచ్చు.

పంజాబ్‌లో సగటున ప్రతిరోజూ రూ.20 కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. ఒక్కో వ్యక్తి డ్రగ్స్ కోసం సుమారు రూ.1400 ఖర్చుచేస్తున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. దాదాపు 1.23 లక్షల మందికి పైగా పంజాబీలు హెరాయిన్ వాడుతున్నారు. కొందరు ఓపియం ఇతర పదార్థాలు వినియోగిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. మరో 75 వేల మంది డ్రగ్స్‌ ఇంజక్షన్ల రూపంలో తీసుకుంటున్నారు. డ్రగ్స్‌ వినియోగంతో నరాలు దెబ్బతినడంతోపాటు యువత శక్తి సామర్థ్యాలను తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తుందని అంటున్నారు.

Published at : 01 Oct 2023 04:24 PM (IST) Tags: Crime News Jammu & Kashmir DRUGS

ఇవి కూడా చూడండి

గోధుమల నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణ కట్టడికి ప్రత్యేక చర్యలు

గోధుమల నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణ కట్టడికి ప్రత్యేక చర్యలు

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TMC MP Expulsion: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు - ఇక సీబీఐతో వేధిస్తారని మహువా సంచలన ఆరోపణలు

TMC MP Expulsion: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు - ఇక సీబీఐతో వేధిస్తారని మహువా సంచలన ఆరోపణలు

Bharat Ki Baat Year Ender 2023 : చంద్రునిపైకి చేరిన భారత కీర్తి పతాక - 2023లో భారత్ సాధించిన అద్భుతం చంద్రయాన్ 3

Bharat Ki Baat Year Ender 2023 :  చంద్రునిపైకి చేరిన భారత కీర్తి పతాక - 2023లో భారత్ సాధించిన అద్భుతం చంద్రయాన్ 3

Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే