అన్వేషించండి

India Covid Cases: వరుసగా మూడో రోజు 20 వేలకు పైగా కోవిడ్ కేసులు.. కేరళలోనే అత్యధికం..

దేశంలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల 20 వేల దిగువకు పడిపోయిన కేసులు.. గత మూడు రోజుల నుంచి పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కోవిడ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది.

దేశవ్యాప్తంగా కోవిడ్ తీవ్రత కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం 18 వేలలో నమోదైన కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా దేశంలో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 26,727 మందికి కోవిడ్ పాజిటివ్‌ అని తేలింది. మొత్తం 15.20 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు వెల్లడైందని ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న నమోదైన కోవిడ్ కేసులతో (23,529) పోల్చితే ఈరోజు 3 వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

Also Read: బూస్టర్ డోసుపై ఏ నిర్ణయం తీసుకోలేదు.. యువతకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యం... స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

ఇక నిన్న ఒక్క రోజే 28,246 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,30,43,144కి పెరిగింది. 277 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4,48,339కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,75,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈరోజు కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 3,37,66,707 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు మొత్తం 89,02,08,007 మందికి కోవిడ్ టీకాలు అందించారు. నిన్న ఒక్క రోజే 64,40,451 మందికి వ్యాక్సిన్లు వేశారు. 

Also Read: ఎవరు గొప్ప అంటూ చెలరేగిన ఘర్షణ.. విద్యార్థి ప్రాణాల్ని బలిగొన్న కొట్లాట.. విశాఖలో దారుణం

కోవిడ్ రికవరీ రేటు 97.86 శాతంగా ఉంది. క్రియాశీల కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.82 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక్క కేరళలోనే ఉన్నాయి. అక్కడ నిన్న 15,914 మంది కోవిడ్ బారిన పడగా.. 122 మంది మరణించారు. 

Also Read: వర్క్ ఫ్రం హోం ఇక ముగిసినట్లే.. ఆఫీసులు తెరవనున్న దిగ్గజ కంపెనీల జాబితా ఇదే..

Also Read: క్యాన్సర్ చికిత్సలో కౌన్సెలింగ్‌ పాత్ర కీలకం.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

ABP C Voter Opinion Poll Telangana | లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటే పార్టీ ఏది? | ABP DesamABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Embed widget