అన్వేషించండి

Rafale fighter: భారత్ రాఫెల్ జెట్ కోల్పోయింది నిజమే - దసాల్ట్ సీఈవో సంచలన ప్రకటన - కానీ ట్విస్ట్ ఉంది !

Rafale: భారత్ ఓ రఫెల్ జెట్ ఫైటర్‌ను కోల్పోయిన మాట నిజమేనని దసాల్ట్ సీఈవో ప్రకటించారు. అయియే పాకిస్తాన్ కాల్పుల వల్ల కాదని ఆయన ధృవీకరిస్తున్నారు.


India lost a Rafale fighter: పాకిస్తాన్ భారత రాఫెల్ జెట్ ఫైటర్లను కూల్చేశామని ప్రకటిస్తూ వచ్చింది. కానీ ఇప్పటి వరకూ ఆధారాలు చూపించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ  భారత్ కు ఎంత నష్టం జరిగిందో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. కానీ కొంత నష్టం జరిగింది రాఫెల్ జెట్ కోల్పోయామా లేదా అన్నది భారత సైన్యం కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు రాఫెల్ సరఫరా దారు అయిన డాస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్ , సీఈఓ  ఎరిక్ ట్రాపియర్ * భారత వైమానిక దళం (IAF) ఒక  రాఫెల్ ఫైటర్ జెట్ *ను కోల్పోయినట్లు ప్రకటించారు.  ఒక ఫ్రెంచ్ వెబ్‌సైట్‌కు ఈ విషయం తెలిపారు. అయితే, ఈ నష్టం శత్రు దాడి కారణంగా కాకుండా అధిక ఎత్తులో సాంకేతిక లోపం ) వల్ల సంభవించిందని స్పష్టం చేశారు. ఈ ఘటన ఆపరేషన్ సిందూర్ తో సంబంధం లేనిదని, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.   

రాఫెల్ ఫైటర్ జెట్‌  12,000 మీటర్లకు పైగా ఎత్తులో జరిగిన ఒక విస్తృత శిక్షణ మిషన్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా  కూలిపోయినట్లుగా చెబుతున్నారు.  ఈ ఘటనలో శత్రు రాడార్ కాంటాక్ట్ లేదా శత్రు దాడి జరిగినట్లు ఎటువంటి సంకేతాలు లేవని ట్రాపియర్ స్పష్టం చేశారు.  రాఫెల్‌లోని  SPECTRA ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్  శత్రు దాడి లేనట్లు నిర్ధారించింది, . ఫ్రెండ్ ఆర్ ఫో సిస్టమ్స్ ,  ఫ్లైట్ లాగ్‌ల డేటా కూడా ఈ నిర్ధారణను బలపరిచింది.
 
మే 2025లో జరిగిన భారత-పాకిస్తాన్  మధ్య ఘర్షణ సమయంలో పాకిస్తాన్ ఐదు భారత ఫైటర్ జెట్‌లను, అందులో మూడు రాఫెల్‌లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఈ వాదనలను ట్రాపియర్  తప్పుడు ,ఆధారరహితం అని ఖండించారు.  బహుళ రాఫెల్‌లు కోల్పోయినట్లు చెప్పడం “పూర్తిగా తప్పు” అని, పాకిస్తాన్ మానవ, భౌతిక నష్టాలలో భారత్ కంటే ఎక్కువ నష్టపోయిందని, 100 మందికి పైగా ఉగ్రవాదులను  అంతమొందించినట్లుగా భారత్ ప్రకటించారు. 

ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7-10, 2025 మధ్య  ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన బాంబు దాడులు చేసింది.  IAF పాకిస్తాన్‌కు గణనీయమైన నష్టం కలిగించింది.  ఇందులో ఆరు పాకిస్తానీ ఫైటర్ జెట్‌లు, రెండు నిఘా విమానాలు, ఒక C-130 ట్రాన్స్‌పోర్ట్ విమానం, 30కి పైగా మిస్సైళ్లు , బహుళ డ్రోన్‌లు ధ్వంసమయ్యాయి.

ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, ఆపరేషన్ సిందూర్ తర్వాత చైనా రాఫెల్  పనితీరుపై అనుమానాలు రేకెత్తించేందుకు ఒక సమన్వయ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. చైనా రక్షణ అటాషేలు, ముఖ్యంగా ఇండోనేషియా వంటి దేశాల్లో, రాఫెల్‌లను కొనుగోలు చేయకుండా చైనా తయారీ ఫైటర్ జెట్‌లను ఎంచుకోవాలని లాబీయింగ్ చేశారు. ఈ క్యాంపెయిన్‌లో సోషల్ మీడియా పోస్ట్‌లు, నకిలీ చిత్రాలు, AI-జనరేటెడ్ కంటెంట్,   వీడియో గేమ్ సిమ్యులేషన్‌లు కూడా ఉపయోగించారని  ఫ్రెంచ్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.[

డాస్సాల్ట్ ఏవియేషన్ ప్రపంచవ్యాప్తంగా 533 రాఫెల్‌లను విక్రయించింది, ఇందులో 323 ఈజిప్ట్, ఇండియా, ఖతార్, గ్రీస్, క్రొయేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సెర్బియా,ఇండోనేషియా కొనుగోలు చేశాయి.  భారత్‌లో, డాస్సాల్ట్ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL)తో కలిసి 2028 నుండి రాఫెల్ ఫ్యూజ్‌లేజ్‌లను హైదరాబాద్‌లో తయారు చేయనుంది, ఇది భారత ఏరోస్పేస్ రంగంలో ఒక ముఖ్యమైన అడుగు. దస్సాల్ట్ ప్రకటనపై  భారత వైమానిక దళం ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అంతిమంగా - భారత్ ఒక రాఫెల్ ఫైటర్ జెట్‌ను కోల్పోయింది, కానీ ఇది ఆపరేషన్ సిందూర్ సమయంలో శత్రు దాడి కారణంగా కాకుండా, శిక్షణ మిషన్‌లో అధిక ఎత్తులో సాంకేతిక లోపం వల్ల  జరగిందని చెబుతున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Embed widget