అన్వేషించండి

IAS Trainee: ఆరోపణలపై స్పందించిన IAS ట్రైనీ, ఆ అధికారం లేదని కీలక వ్యాఖ్యలు

IAS Trainee Officer: పుణే ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్‌ తనపై వస్తున్న ఆరోపణలపై తొలిసారి స్పందించింది. ఈ వ్యవహారంపై వ్యాఖ్యలు చేసే అధికారం తనకు లేదని తేల్చి చెప్పింది.

IAS Trainee Pooja Khedkar: పుణే IAS ట్రైనీ పూజా ఖేడ్కర్‌ వ్యవహారాన్ని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది. ఇప్పటి తనపై వస్తున్న ఆరోపణల గురించి స్పందించిన పూజే ఖేడ్కర్ తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. ఇప్పటికైతే నేను ఏమీ మాట్లాడలేనని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. కేంద్ర విచారణ గురించి కూడా ఏమీ స్పందించకుండానే వెళ్లిపోయింది. ప్రభుత్వం నిబంధన ప్రకారం తాను ఈ వ్యవహారంపై ఏమీ మాట్లాడడానికి వీల్లేదని, తనకు ఆ అధికారం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ట్రైనింగ్‌లో ఉండగానే ఇన్ని డిమాండ్‌లు పెట్టడమేంటని అధికారులు తీవ్రంగా పరిగణించారు. అటు కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. విచారణ చేపట్టేందుకు ప్రత్యేంగా ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది. ఆమెపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత అన్నది తేల్చి చెప్పాలని ఆదేశించింది. ఈ కమిటీలో ఒకే ఒక సభ్యుడు ఉన్నాడు. అడిషనల్ సెక్రటరీ స్థాయి ఉన్న ఓ సీనియర్ అధికారిని ఇందులో సభ్యుడిగా చేర్చింది కేంద్రం. రెండు వారాల్లోగా ఈ కమిటీ కేంద్రానికి ఓ నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు కేంద్రం అధికారికంగా ఈ ప్రకటన చేసింది. 

"ఒక సభ్యుడితో కూడుకున్న ప్యానెల్‌ని ఏర్పాటు చేసి పూజా ఖేడ్కర్ వ్యవహారంపై విచారణకు ఆదేశించాం. అడిషనల్ సెక్రటరీ స్థాయి ఉన్న సీనియర్ అధికారికి ఈ ప్యానెల్‌ బాధ్యతలు అప్పజెప్పాం. ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్‌పై వస్తున్న ఆరోపణల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతుంది. రెండు వారాల్లో ఈ కమిటీ ఓ నివేదికను అందజేస్తుంది"

- కేంద్ర ప్రభుత్వం

,స్థలం ఆక్రమించి బంగ్లా నిర్మాణం..

అటు పుణే మున్సిపల్ కార్పొరేషన్ కూడా పూజాపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. స్థలాన్ని కబ్జా చేసి బంగ్లా కట్టుకోగా, ఆ బంగ్లాని కూల్చి వేయాలని నిర్ణయించుకుంది. ఆ పరిసరాలనూ పూర్తిగా బుల్‌డోజర్‌తో కూల్చి వేయనుంది. IAS 2023 బ్యాచ్‌కి చెందిన పూజా ఖేడ్కర్ UPSC లో 841 ర్యాంక్ సాధించింది. కానీ ట్రైనింగ్‌ మొదలు కాగానే వివాదాల్లో చిక్కుకుంది. ప్రైవేట్ ఆడీ కార్‌కి రెడ్, బ్లూ బీకాన్ లైట్ పెట్టించుకుంది. VIP నంబర్‌ ప్లేట్‌ కూడా పెట్టించింది. ట్రైనింగ్‌లో ఉండగా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. అయినా సరే పట్టుబట్టి మరీ అన్ని వసతులూ కల్పించాలని డిమాండ్ చేసింది. 

మరో సంచలన విషయమూ వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో దొంగను జైల్లో నుంచి వదిలేయాలని DCPపై పూజా ఖేడ్కర్ ఒత్తిడి తీసుకొచ్చినట్టు తేలింది. మే 18వ తేదీన ఇది జరిగినట్టు విచారణలో వెల్లడైంది. దొంగతనం కేసులో అరెస్టైన వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఆ వ్యక్తి దొంగతనం చేయలేదని, అమాయకుడు అని సమర్థించింది. ఓ చిన్న కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని విడుదల చేయమని పూజా ఖేడ్కర్ ఎందుకు చెప్పిందో DCPకి అర్థం కాలేదు. అందుకే ఆమె డిమాండ్‌ని పక్కన పెట్టి ఆ దొంగని జ్యుడీషియల్ కస్టడీకి తరలించాడు. 

Also Read: Viral Video: పుణే ట్రైనీ IAS ఆఫీసర్ తల్లి హల్‌చల్‌, రైతుల భూములు కబ్జా - అడ్డుకున్న వాళ్లకి గన్‌తో వార్నింగ్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Bigg Boss Telugu Day 70 Promo : భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
Advertisement

వీడియోలు

Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
Ravindra Jadeja IPL 2026 | జడేజా ట్రేడ్ వెనుక వెనుక ధోనీ హస్తం
Rishabh Pant Record India vs South Africa | చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌
Sanju Samson Responds on IPL Trade | సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
VARANASI Trailer Decoded | Mahesh Babu తో నీ ప్లానింగ్ అదిరింది జక్కన్నా SS Rajamouli | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Bigg Boss Telugu Day 70 Promo : భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
Viral Video: మేనేజర్‌ను బట్టలూడదీసి దారుణంగా కొట్టిన హోటల్ ఓనర్ అరెస్ట్.. కారణం తెలిస్తే షాక్
మేనేజర్‌ను బట్టలూడదీసి దారుణంగా కొట్టిన హోటల్ ఓనర్ అరెస్ట్.. కారణం తెలిస్తే షాక్
Indian Rupee vs World Currencies : ఇండియన్ రూపాయి బలంగా ఉన్న దేశాలు ఇవే.. అక్కడ లక్షరూపాయలు మూడు కోట్లంత విలువ
ఇండియన్ రూపాయి బలంగా ఉన్న దేశాలు ఇవే.. అక్కడ లక్షరూపాయలు మూడు కోట్లంత విలువ
Hyundai Venue లేక Kia Syros, ఫీచర్ల పరంగా ఏది బెస్ట్ ? కొనే ముందు ఇవి తెలుసుకోండి
Hyundai Venue లేక Kia Syros, ఫీచర్ల పరంగా ఏది బెస్ట్ ? కొనే ముందు ఇవి తెలుసుకోండి
Adilabad Protest: ఈ నెల 21న ఆదిలాబాద్, బోరజ్ జాతీయ రహదారి దిగ్బంధం: మాజీ మంత్రి జోగురామన్న
ఈ నెల 21న ఆదిలాబాద్, బోరజ్ జాతీయ రహదారి దిగ్బంధం: మాజీ మంత్రి జోగురామన్న
Embed widget