అన్వేషించండి

IAS Trainee: ఆరోపణలపై స్పందించిన IAS ట్రైనీ, ఆ అధికారం లేదని కీలక వ్యాఖ్యలు

IAS Trainee Officer: పుణే ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్‌ తనపై వస్తున్న ఆరోపణలపై తొలిసారి స్పందించింది. ఈ వ్యవహారంపై వ్యాఖ్యలు చేసే అధికారం తనకు లేదని తేల్చి చెప్పింది.

IAS Trainee Pooja Khedkar: పుణే IAS ట్రైనీ పూజా ఖేడ్కర్‌ వ్యవహారాన్ని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది. ఇప్పటి తనపై వస్తున్న ఆరోపణల గురించి స్పందించిన పూజే ఖేడ్కర్ తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. ఇప్పటికైతే నేను ఏమీ మాట్లాడలేనని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. కేంద్ర విచారణ గురించి కూడా ఏమీ స్పందించకుండానే వెళ్లిపోయింది. ప్రభుత్వం నిబంధన ప్రకారం తాను ఈ వ్యవహారంపై ఏమీ మాట్లాడడానికి వీల్లేదని, తనకు ఆ అధికారం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ట్రైనింగ్‌లో ఉండగానే ఇన్ని డిమాండ్‌లు పెట్టడమేంటని అధికారులు తీవ్రంగా పరిగణించారు. అటు కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. విచారణ చేపట్టేందుకు ప్రత్యేంగా ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది. ఆమెపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత అన్నది తేల్చి చెప్పాలని ఆదేశించింది. ఈ కమిటీలో ఒకే ఒక సభ్యుడు ఉన్నాడు. అడిషనల్ సెక్రటరీ స్థాయి ఉన్న ఓ సీనియర్ అధికారిని ఇందులో సభ్యుడిగా చేర్చింది కేంద్రం. రెండు వారాల్లోగా ఈ కమిటీ కేంద్రానికి ఓ నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు కేంద్రం అధికారికంగా ఈ ప్రకటన చేసింది. 

"ఒక సభ్యుడితో కూడుకున్న ప్యానెల్‌ని ఏర్పాటు చేసి పూజా ఖేడ్కర్ వ్యవహారంపై విచారణకు ఆదేశించాం. అడిషనల్ సెక్రటరీ స్థాయి ఉన్న సీనియర్ అధికారికి ఈ ప్యానెల్‌ బాధ్యతలు అప్పజెప్పాం. ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్‌పై వస్తున్న ఆరోపణల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతుంది. రెండు వారాల్లో ఈ కమిటీ ఓ నివేదికను అందజేస్తుంది"

- కేంద్ర ప్రభుత్వం

,స్థలం ఆక్రమించి బంగ్లా నిర్మాణం..

అటు పుణే మున్సిపల్ కార్పొరేషన్ కూడా పూజాపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. స్థలాన్ని కబ్జా చేసి బంగ్లా కట్టుకోగా, ఆ బంగ్లాని కూల్చి వేయాలని నిర్ణయించుకుంది. ఆ పరిసరాలనూ పూర్తిగా బుల్‌డోజర్‌తో కూల్చి వేయనుంది. IAS 2023 బ్యాచ్‌కి చెందిన పూజా ఖేడ్కర్ UPSC లో 841 ర్యాంక్ సాధించింది. కానీ ట్రైనింగ్‌ మొదలు కాగానే వివాదాల్లో చిక్కుకుంది. ప్రైవేట్ ఆడీ కార్‌కి రెడ్, బ్లూ బీకాన్ లైట్ పెట్టించుకుంది. VIP నంబర్‌ ప్లేట్‌ కూడా పెట్టించింది. ట్రైనింగ్‌లో ఉండగా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. అయినా సరే పట్టుబట్టి మరీ అన్ని వసతులూ కల్పించాలని డిమాండ్ చేసింది. 

మరో సంచలన విషయమూ వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో దొంగను జైల్లో నుంచి వదిలేయాలని DCPపై పూజా ఖేడ్కర్ ఒత్తిడి తీసుకొచ్చినట్టు తేలింది. మే 18వ తేదీన ఇది జరిగినట్టు విచారణలో వెల్లడైంది. దొంగతనం కేసులో అరెస్టైన వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఆ వ్యక్తి దొంగతనం చేయలేదని, అమాయకుడు అని సమర్థించింది. ఓ చిన్న కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని విడుదల చేయమని పూజా ఖేడ్కర్ ఎందుకు చెప్పిందో DCPకి అర్థం కాలేదు. అందుకే ఆమె డిమాండ్‌ని పక్కన పెట్టి ఆ దొంగని జ్యుడీషియల్ కస్టడీకి తరలించాడు. 

Also Read: Viral Video: పుణే ట్రైనీ IAS ఆఫీసర్ తల్లి హల్‌చల్‌, రైతుల భూములు కబ్జా - అడ్డుకున్న వాళ్లకి గన్‌తో వార్నింగ్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
Embed widget