![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Swati maliwal: అత్యాచారం చేస్తాం, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు- స్వాతి మలివాల్ ఆరోపణలు
Delhi Telugu News: లోక్సభ ఎన్నికల మధ్య, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఊపందుకుంది.
![Swati maliwal: అత్యాచారం చేస్తాం, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు- స్వాతి మలివాల్ ఆరోపణలు i have receiving death threats after a video upload by dhruv rathee says swati maliwal Swati maliwal: అత్యాచారం చేస్తాం, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు- స్వాతి మలివాల్ ఆరోపణలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/91845fb6ded273988e259e8b51cdda9217167383887731037_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Swati Maliwal: లోక్సభ ఎన్నికల మధ్య, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఈ ఉదయం మలివాల్ ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఆమె నేడు(ఆదివారం) ట్విట్టర్లో ఒక సుదీర్ఘ పోస్టును షేర్ చేశారు. పోస్ట్ ద్వారాలో స్వాతి మలివాల్ యూట్యూబర్ ధృవ్ రాఠీ వీడియో తర్వాత, తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ 'వన్-సైడ్' వీడియోను పోస్ట్ చేయడం ద్వారా ద్వేషపూరిత ప్రచారాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. స్వాతి మలివాల్ తన పార్టీ ఆప్ నాయకులు, కార్యకర్తలపై ఆరోపణలు చేశారు.
తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు
సోషల్ మీడియా సైట్ 'ఎక్స్'లో దీని గురించి వివరంగా రాస్తూ.. 'ఆప్' పార్టీ తనపై పథకం ప్రకారం తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మలివాల్ అన్నారు. ఈ పోస్ట్తో పాటు ఆమె అనేక స్క్రీన్షాట్లను కూడా షేర్ చేశారు. అందులో తనను అత్యాచారం, చంపేస్తానని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాతి మలివాల్ ట్విట్టర్ పోస్టులో తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని పార్టీ నాయకత్వం ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.
స్వాతి మలివాల్ తన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా.. సొంత పార్టీ అంటే ఆప్ నేతలు, వాలంటీర్లు ప్రచారం చేస్తున్నప్పటి నుంచి నాకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని పోస్ట్లో రాశారు. యూట్యూబర్ ధ్రువ్ రాఠి నాకు వ్యతిరేకంగా వన్ సైడ్ వీడియోను పోస్ట్ చేయడంతో ఇది మరింత పెరిగిందన్నారు. ఇది మాత్రమే కాదు, స్వాతి మలివాల్ కూడా ధ్రువ్ రాతిపై నిరాశను వ్యక్తం చేశారు. అతనిని సంప్రదించడానికి.. అతని అభిప్రాయాన్ని పంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ధ్రువ్ రాతి కాల్లు, మెసేజులకు స్పందించడం లేదన్నారు. చెప్పారు. పార్టీ మొత్తం తన పరువు తీయడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారని స్వాతి మలివాల్ అన్నారు. పార్టీ యంత్రాంగం తనతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే మహిళల సమస్యలపై వారి వైఖరిని తెలియజేస్తుందన్నారు. ఈ విషయమై స్వాతి మలివాల్ అత్యాచారం, హత్య బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అని అన్నారు.
కాగా, మే 13న ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో మలివాల్పై జరిగిన దాడికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ను మే 18న అరెస్టు చేశారు. ఆ తర్వాత బిభవ్ కుమార్ బెయిల్ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించారు. కోర్త్ సమాధానం కోరుతూ ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)