అన్వేషించండి

Adani Hindenburg: అదానీ అంశంలో హిండెన్‌బర్గ్‌కు సెబీ నోటీసులు- మోసం చేసే వారిని రక్షిస్తున్నారంటున్న షార్ట్ సెల్లర్ సంస్థ

Adani Hindenburg: అదానీ సంస్థ ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందంటూ గతేడాది సంచలనం రేపిన అమెరికాకు చెందిన రీసెర్చి సంస్థ హిండెన్ బర్గ్ తాజాగా సెబీ నుంచి షోకాజు నోటీసులందుకుంది.

Adani Hindenburg: అదానీ గ్రూప్ సంస్థలపై చేసిన  ఆరోపణలకు సంబంధించి యూఎస్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ తాజాగా షోకాజు నోటీసులందుకుంది.  తాము  సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) నుంచి ఈ  నోటీసుల అందుకున్నట్లు సదరు సంస్థే స్వయంగా తెలిపింది. అదాని గ్రూపుపై 2023 జనవరిలో తాము విడుదల చేసిన నివేదికలో ఇండియన్ రెగ్యులేషన్స్‌ను అతిక్రమించామనే అనుమానాలపై సెబీ తాజా నోటీసులు  జారీ చేసిందని పేర్కొంది. జూన్ 27న ఈ నోటీసులు అందుకున్నట్లు జులై 1 న సంస్థ తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది.

సెబీ ముందునుంచీ అటువైపే.. : హిండెన్‌బర్గ్

‘‘అదానీ గ్రూప్ పై మేము గతేడాది నివేదిక విడుదల చేసిన వెంటనే ఆ గ్రూపుకు సెబీ బాసటగా నిల్చుందని మాకు అక్కడి సోర్సెస్ నుంచి అప్పుడే సమాచారమొచ్చింది.  సంస్థలో పెట్టిన పెట్టుబడుల్లో షార్ట్ పొజిషన్స్ క్లోజ్ చేయాలని బ్రోకర్లను తెరవెనుక నుంచి సెబీ ఒత్తిడి చేసింది. కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి సంస్థను కష్టకాలంలో ఆదుకునేందుకు ప్రయత్నించింది. సుప్రీం కోర్టు విచారణ సమయంలో కూడా తొలుత మా నివేదికతో ఏకీభవించిన సెబీ తరువాత విచారణను ముందుకు తీసుకెళ్లలేమని కోర్టుకు చెప్పింది.  గత నెలలో అదానీ గ్రూప్ సీఎఫ్‌వో జుగేషిందర్ సంస్థపై వచ్చిన కొన్ని రెగ్యులేటరీ నోటీసులను పట్టించుకోనక్కర్లేదని మాట్లాడారు. అదానీ గ్రూపునకు సెబీతో ఉన్న లింకు వల్లే ఆయన అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 2022లో గౌతమ్ అదానీ సెబీ ఛైర్మన్ మదబి పురి బచ్ ను రెండు సార్లు కలిశారు. అసలు అదానీ, హిండెన్ బర్గ్ నివేదిక విషయంలో పనిచేసిన సెబీ ఉద్యోగుల పేర్లేంటి? వాళ్లు అదానీ సంస్థకు చెందిన వారిని ఎన్నిసార్లు కలిశారు. వారి మధ్య నడిచిన కాల్స్ వివరాలేంటి వంటివి సమాచార హక్కు ద్వారా పొందేందుకు అప్లై చేస్తాం. సెబీ తన ఇన్వెస్టిగేషన్ విషయంలో పారదర్శకంగా ఉంటుందో లేదో చూస్తాం’’ అని సంస్థ తన బ్లాగ్ పోస్టులో రాసుకొచ్చింది.  

ఈ పోెస్టుతో పాటు సంస్థ ఉంచిన 46 పేజీల ‘సెబీ’ షోకాజ్ నోటీసుని సంస్థ సదరు పోస్టుకి జతచేసింది.  ‘‘గతేడాది జనవరిలో హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదికలో చాలా తప్పుడు వివరణలు, అవాస్తవ ప్రకటనలు ఉన్నాయి. అవి పాఠకులను తప్పుదారి పట్టించే అవకాశముంది’’ అని ఆ నోటీసులో రాసి ఉంది.

మోసం చేసిన వారిని రక్షించడమే లక్ష్యమా

‘‘ఈ రోజు ఈ నోటీసు అంతట్నీ మీ ముందు ఎలాంటి దాపరికం లేకుండా చూపిస్తున్నామంటే అందుకు కారణం.. అసలీనోటీసుకు అర్థమే లేదు. కేవలం ఇండియాలోని అత్యంత బలవంతుల ప్రయోజనాలను కాపాడటం కోసమే దీన్ని రూపొందించారు. వారి మోసాలను కప్పిపెట్డడమే దీని వెనకున్న ఆంతర్యం. మా దృష్టిలో సెబీ తన బాధ్యతను మరచి ప్రవర్తిస్తోంది. పెట్టుబడి పెట్టి మోసపోయిన వారిని రక్షించడం కంటే.. మోసం చేసిన వారిని రక్షించేందుకే ప్రాధాన్యమిస్తోంది’’ అని హిండెన్ బర్గ్ పేర్కొంది.  

మేం గర్విస్తున్నాం.. 

ఈ అదానీ థీసిస్ రాయడంలో  అదానీ గ్రూపులో పెట్టుబడి పెట్టిన ఓ ఇన్వెస్టర్ భాగస్వామ్యం కూడా ఉంది. మా ఇన్వెస్టర్ కి మొత్తం కలిపి 4.1 మిలియన్ డాలర్ల గ్రాస్ రెవిన్యూ వచ్చింది. అయితే ఈ రెండేళ్లలో ఈ థీసిస్ పై మేం చేసిన పరిశోధన, లీగల్ ఖర్చులు అన్నీ తీసేస్తే కేవలం 31 వేల డాలర్లే మిగిలాయి. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించకుండా మేం ఈ  ఇన్వెస్ట్ మెంటు నుంచి బయటకి వచ్చే పరిస్థితి ఉంది. అదానీ గ్రూపుపై మేము చేసిన నివేదిక ఆర్థిక పరమైన లాభం కోసం చేసింది కానే కాదు. కానీ ఇప్పటి వరకూ మేం చేసిన రీసెర్చిపై మేము గర్విస్తున్నాం. కానీ సెబీ చేసిన ఇన్వెస్టిగేషన్ తో భారత్ మార్కెట్ లో ఇన్వెస్టర్ల సొమ్ముకు మోసాల నుంచి ఎలాంటి రక్షణా లేదని తేలిపోయింది. ఇండియాలో కార్పోరేట్ రక్షణ శూన్యం’’ అని  హిండెన్‌బర్గ్ స్పష్టం చేసింది.  

 షేర్ల విలువ పెంచడానికి అదానీ గ్రూపు అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్ బర్గ్  గతేడాది విడుదల చేసిన నివేదిక వల్ల అదానీ గ్రూపు మార్కెట్ విలువ రూ. లక్షల కోట్ల మేర ఆవిరైపోయిన విషయం తెలిసిందే.  ఇప్పటికీ ఆ గ్రూపు షేర్లపై ఈ నివేదిక ప్రభావం ఉంది. అయితే ఈ నివేదిక బయటకి వచ్చినప్పటి నుంచి ఈ విషయాన్ని సెబీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అదానీ గ్రూపుకు ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget