అన్వేషించండి

Gujarat Elections 2022: బీజేపీ నాకు డబ్బు ఆశ చూపించింది, అలా చేస్తే బంపర్ ఆఫర్ ఇస్తానంది - కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Gujarat Elections 2022: ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు భాజపా తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు.

Gujarat Elections 2022:

భాజపా భయపడుతోంది: కేజ్రీవాల్ 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు భాజపా తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేసిందని చెప్పారు. మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌పై కొనసాగుతున్న విచారణను నిలిపివేస్తామని చెప్పినట్టు వెల్లడించారు. ఓ టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూకి హాజరైన కేజ్రీవాల్...ఈ కామెంట్స్ చేశారు. భాజపా గతంలో మనీశ్ సిసోడియాకు డబ్బుని ఆశ చూపించాయని, ఇప్పుడు తననూ కాంటాక్ట్ అవుతున్నారని ఆరోపించారు. "భాజపా చేసిన ఆఫర్‌ను మనీశ్ సిసోడియా కాదన్నారు. 
ఢిల్లీ సీఎం పదవి ఇస్తానని ఆశపెట్టినా పట్టించుకోలేదు. ఇప్పుడు నన్ను మభ్య పెడుతున్నారు. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయకుంటే ఇద్దరు మంత్రులను విడుదల చేస్తామని చెబుతున్నారు" అని తీవ్ర ఆరోపణలు చేశారు. "మిమ్మల్ని ఎవరు సంప్రదించారు" అన్న ప్రశ్నకు "వాళ్ల పేర్లు ఎలా బయట పెడతాను. వాళ్లు నేరుగా అడగకుండా వాళ్ల మనుషులతో అడిగిస్తారు" అని చెప్పారు కేజ్రీవాల్. ఒకరి నుంచి ఒకరు ఈ మెసేజ్‌ను పాస్ చేస్తారని, చివరకు అది చేరాల్సిన చోటకు చేరుతుందని అన్నారు. ఇదే సమయంలో ఢిల్లీ, గుజరాత్ ఎన్నికల గురించీ ప్రస్తావించారు. "ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై భాజపా భయపడుతోంది. ఢిల్లీ, గుజరాత్‌లో తప్పకుండా  గెలుస్తామన్న ధీమా ఉంది. ఢిల్లీ ఎమ్‌సీడీ ఎన్నికలతో పాటు గుజరాత్‌లోనూ ఓడిపోతామేమో అన్న భయం భాజపాను పట్టుకుంది. అందుకే ఈ రెండు ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించేలా జాగ్రత్తపడ్డారు" అని అన్నారు. ఢిల్లీ MCD,గుజరాత్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తుండటం వల్ల రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 

సుకేశ్ చుట్టూ రాజకీయాలు..

సుకేశ్ చంద్రశేఖర్ కేజ్రీవాల్‌పై చేసిన వ్యాఖ్యలూ హాట్‌టాపిక్‌గా మారాయి. రాజ్యసభ సీటు కోసం అరవింద్ కేజ్రీవాల్ తనను రూ.50 కోట్లు అడిగారని లెటర్ రాశారు సుకేశ్. అంతే కాదు. పార్టీలో ఓ బడా బిజినెస్‌మెన్‌ను చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. దీనిపై భాజపా స్పందించింది. "ఆప్‌ అవినీతిమయమైన పార్టీ అని నిరూపించటడానికి ఇంత కన్నా సాక్ష్యం ఇంకేముంటుంది" అని చెబుతోంది. కొందరు బడబడా డాన్‌లతో, బిజినెస్‌మేన్‌లతో ఆప్‌నకు సన్నిహిత సంబంధాలున్నాయని విమర్శించింది. భాజపా విమర్శలకు అటు ఆప్ కూడా కౌంటర్ ఇచ్చింది. సుకేష్ చంద్రశేఖర్ అండతోనే భాజపా ఎన్నికల బరిలోకి దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుకేశ్‌ను బ్రాండింగ్ చేస్తోందని విమర్శించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేరు చెప్పుకుని సుకేష్  రూ.215 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని చెబుతోంది. అంత డబ్బు అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో భాజపా చెప్పాలని డిమాండ్ చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget