అన్వేషించండి

Bengal election polling: బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌‌కకు సర్వం సిద్ధం - మోదీ వర్సెస్ దీదీ - ఎవరిది పైచేయి?

Bengal : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. తుది దశ పోలింగ్ బుధవారం జరగనుంది. మమతా బెనర్జీ నియోజకవర్గం భవానీపూర్ కూడా ఈ సారి పోలింగ్ లో ఉంది.

Bengal second phase  polling: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. మొత్తం 294 స్థానాలకు గాను ఇప్పటికే తొలి దశ పోలింగ్ ముగియగా, బుధవారం జరగనున్న రెండో ,  చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో  142 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో, బెంగాల్ పీఠం ఎవరిదో తేల్చే అసలైన ఫైనల్ ఫైట్  ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కోల్‌కతా సహా ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గాల్లో సుమారు 3.21 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు.

 అమిత్ షా వ్యూహం - మమతా బెనర్జీ ధీటుగా సమాధానం 

ఈ ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాత్మక అడుగులు వేశారు. బెంగాల్ సంస్కృతికి విఘాతం కలిగిస్తున్నారంటూ దీదీ చేసిన విమర్శలను తిప్పికొడుతూ.. అభివృద్ధి, పారిశ్రామికీకరణ, నిరుద్యోగ సమస్యలను బీజేపీ అస్త్రాలుగా మలుచుకుంది. మరోవైపు, మమతా బెనర్జీ బెంగాల్ కూతురు అనే నినాదంతో ఒంటిచేత్తో పోరాడుతున్నారు. లక్ష్మీ భండార్ వంటి సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని ఆమె నమ్ముతున్నారు.

 కీలక నియోజకవర్గాలు - ప్రతిష్ఠాత్మక పోరు 

రెండో దశలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న స్థానం  నందిగ్రామ్ . ఇక్కడ సువేందు అధికారి,  పవిత్ర కర్ మధ్య పోరు కేవలం ఒక సీటు కోసం జరుగుతున్నది కాదు, అది ఆత్మగౌరవ పోరాటంగా మారింది. అలాగే, సిలిగురిలో మేయర్ గౌతమ్ దేబ్, శంకర్ ఘోష్ మధ్య పట్టణ ఆధిపత్య పోరు సాగుతోంది. బహరంపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తన రాజకీయ మనుగడ కోసం పోరాడుతుండగా, కృష్ణగంజ్‌లో సుకాంత బిస్వాస్ వంటి నేతల భవితవ్యం రేపు తేలనుంది. మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌లోనూ పోలింగ్ బుధవారం జరగనుంది. 

 పోలరైజేషనే పార్టీల వ్యూహం

రెండో దశలో పోలరైజేషన్, మతువా సామాజిక వర్గం ఓట్లు కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఉత్తర 24 పరగణాలు, నదియా జిల్లాల్లో మతువా ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ పౌరసత్వ సవరణ చట్టం  అంశాన్ని ప్రస్తావించగా, తృణమూల్ కాంగ్రెస్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మైనారిటీ ఓట్లను ఏకీకృతం చేసే ప్రయత్నం చేసింది. విద్యావంతులు, యువత ఎక్కువగా ఉన్న కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏ మేరకు ఉందనేది ఫలితాలను శాసించనుంది.

పటిష్టమైన భద్రత

తొలి దశలో భారీగా ఓటింగ్ నమోదు కావడంతో, రెండో దశలోనూ అదే ఉత్సాహం కొనసాగుతుందని భావిస్తున్నారు. అయితే, బెంగాల్ ఎన్నికలంటేనే హింసాత్మక ఘటనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారినందున, కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. సుమారు 1,448 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ దశతో ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. మే 4న వెలువడే ఫలితాలు బెంగాల్ రాజకీయాల్లో  దీదీ  కొనసాగుతారా లేక  కమలం వికసిస్తుందా అన్నది తేల్చనున్నాయి.                              

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Iran War: జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget