అన్వేషించండి

Flights Ban From India: కరోనా కేసుల ఎఫెక్ట్, భారత్ నుంచి విమానాల రాకపోకలపై యూఏఈ ఆంక్షలు

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. కేరళ, మహారాష్ట్రలో అధికంగా కరోనా కేసులు నమోదు కావడంతో భారత్ నుంచి ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నారు.

కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ సమయం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలు అధికమయ్యాయి. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలపై కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షలు విధించాయి. తాజాగా ఇతిహాద్ ఎయిర్‌వేస్ భారత్‌పై ఆంక్షలు విధించింది. భారత్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)కి ఇతిహాద్ విమానాలను నిలిపివేశారు. ఈ మేరకు ఇతిహాద్ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదివరకే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ, కెనడా లాంటి పలు దేశాలు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో భారత్ నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి. కొన్ని రోజుల అనంతరం విమాన ప్రయాణాలకు అనుమతి ఇచ్చాయి. తాజాగా యూఏఈ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను అనుసరించి భారత్ నుంచి విమానాలను నిలిపివేస్తూ ఇతిహాద్ ఎయిర్‌వేస్ నిర్ణయం తీసుకుంది. తదుపరి ప్రకటన వెలువడే వరకు ఈ నిషేధ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. 

కేవలం యూఏఈ పౌరులు, దౌత్య సంబంధ పనుల నిమిత్తం భారత్ వెళ్లిన వారు, అధికారులును, గోల్డెన్ రెసిడెన్స్ హోల్డర్స్‌కు ప్రయాణ ఆంక్షల నుంచి యూఏఈ ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. మినహాయింపు కల్పించిన వారికి సైతం క్వారంటైన్ నియమాలు తప్పనిసరి వర్తిస్తాయని ఇతిహాద్ ఎయిర్‌వేస్ ప్రతినిధి వెల్లడించారు. 

యూఏఈ నుంచి భారత్‌కు మాత్రం తమ విమాన సర్వీసులు కొనసాగుతాయని, ఇందులో ఏ మార్పు లేదని చెప్పారు. కార్గో విమాన సర్వీసులను భారత్, యూఏఈల మధ్య రెండు వైపులా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగిస్తున్నారు. ఇతిహాద్ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో డెస్టినేషన్ గైడ్‌లో అన్ని వివరాలు అందుబాటులో ఉంచారరు. ప్రయాణికులకు ఏవైనా సందేహాలుంటే +971 600 555 666 యూఏఈ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.  ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు సంబంధిత ఏజెన్సీని సంప్రదించి వారి టికెట్ నగదును అడగాలన్నారు. భారత్ నుంచి ప్రయాణాలకు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినదుకు చింతిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, దేశంలో నిన్న ఒక్కరోజు 17,28,795 మందికి కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 43,509 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 3.15కోట్ల మార్కును చేరుకున్నాయి. కరోనాతో పోరాడుతూ మరో 640మంది మరణించగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 4.22లక్షలకు చేరింది. కేరళలో ఏకంగా 22 వేలకు పైగా తాజా కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆరుగురు సభ్యుల టీమ్‌ను కేంద్ర ప్రభుత్వం కేరళకు పంపుతుంది. కేరళ తరువాత మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
Kantara Chapter 1 : ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
IPAC Case in High Court: ఐ ప్యాక్‌ కేసుపై కోల్‌కతా హైకోర్టులో గందరగోళం, న్యాయమూర్తి వాకౌట్‌, విచారణ వాయిదా!
ఐ ప్యాక్‌ కేసుపై కోల్‌కతా హైకోర్టులో గందరగోళం, న్యాయమూర్తి వాకౌట్‌, విచారణ వాయిదా!
The Raja Saab: అభిమానులతో ఆటలు... ప్రభాస్ 'రాజా సాబ్'కు ఇంత దారుణమైన రిలీజా?
అభిమానులతో ఆటలు... ప్రభాస్ 'రాజా సాబ్'కు ఇంత దారుణమైన రిలీజా?
Natalie Burn : రాకింగ్ స్టార్ యష్‌తో రొమాంటిక్ సీన్ - ఎవరా టాక్సిక్ బ్యూటీ?.. తెగ సెర్చ్ చేసేస్తున్నారు
రాకింగ్ స్టార్ యష్‌తో రొమాంటిక్ సీన్ - ఎవరా టాక్సిక్ బ్యూటీ?.. తెగ సెర్చ్ చేసేస్తున్నారు
Embed widget