News
News
X

Delhi Ministers Resignation: సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా రాజీనామా - ఆమోదించిన సీఎం కేజ్రీవాల్

Delhi Ministers Resignation: ఢిల్లీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా రాజీనామా చేశారు.

FOLLOW US: 
Share:

Delhi Ministers Resignation:


ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా రాజీనామా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖలు పంపారు. ఈ మేరకు కేజ్రీవాల్ వీరిద్దరి రాజీనామాలను ఆమోదించారు. మనీశ్ సిసోడియాకు 18 మంత్రిత్వ శాఖల బాధ్యత అప్పగించారు కేజ్రీవాల్. అంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు సత్యేంద్ర జైన్‌. అయితే ఆయన కూడా ఓ స్కామ్‌లో భాగంగా అరెస్ట్ అయ్యారు. దాదాపు 10 నెలలుగా జైల్లోనే ఉంటున్నారు. ఆయన జైలుకి వెళ్లిన తరవాత ఆరోగ్య శాఖ కూడా సిసోడియాకు అప్పగించారు కేజ్రీవాల్. ఇప్పుడు సిసోడియా కూడా సీబీఐ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ అరెస్ట్ చేసినప్పటికీ సిసోడియా మంత్రిత్వ పదవిలో ఎలా కొనసాగుతున్నారంటూ బీజేపీ ఇప్పటికే ప్రశ్నలు సంధించింది. ఆ వెంటనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం సంచలనమైంది. 

 

Published at : 28 Feb 2023 06:11 PM (IST) Tags: Manish Sisodia Delhi Ministers Satyendar Jain Manish Sisodia Resign

సంబంధిత కథనాలు

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్

BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!

US Army Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్లు - తొమ్మిది మంది దుర్మరణం!

US Army Helicopter Crash:  అమెరికాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్లు - తొమ్మిది మంది దుర్మరణం!

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు