By: Ram Manohar | Updated at : 10 Mar 2023 05:17 PM (IST)
సిసోడియాను 10 రోజుల పాటు రిమాండ్లో ఉంచేందుకు అనుమతించాలని ఈడీ కోర్టుని కోరింది.
Delhi Liquor Policy Case:
కోర్టు పరిశీలనలో..
మనీశ్ సిసోడియాను 10 రోజుల పాటు రిమాండ్లో ఉంచేందుకు రౌజ్ అవెన్యూ కోర్టుకు పిటిషన్ పెట్టుకుంది ఈడీ. విచారణకు ఆయన సహకరించడం లేదని, మరి కొద్ది రోజులు ప్రశ్నించాల్సిన అవసరముందని నివేదించింది. ఇదే సమయంలో సిసోడియా బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణను మార్చి 21కి వాయిదా వేసిన కోర్టు..మార్చి 17 వరకూ ఈడీ రిమాండ్లో ఉంచేందుకు అంగీకరించింది.
Delhi's Rouse Avenue Court sends AAP leader and former Delhi Deputy Chief Minister Manish Sisodia to ED remand till March 17 in excise policy case. pic.twitter.com/Kh70KfYPc8
— ANI (@ANI) March 10, 2023
ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు సిసోడియా. అయితే...ఆయనను పూర్తి స్థాయిలో విచారించాలని, సమన్లు జారీ అయిన వారందరితో సిసోడియాకు ఎలాంటి సంబంధం ఉందో తేల్చాలని చెబుతోంది. సిసోడియా CA కూడా కొన్ని కీలక విషయాలు చెప్పాడని, కానీ సిసోడియా మాత్రం విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేస్తోంది. అయితే...ఈడీ రిమాండ్ పిటిషన్ వేయడంపై సిసోడియా తరపున న్యాయవాది ఖండిస్తున్నారు. సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్ తన వాదనలు వినిపించారు.
"ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆమోదించారు. ఏ మాత్రం పరిశీలించకుండానే ఆ నిర్ణయం తీసుకుంటారా..? ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా కేవలం ఉద్దేశపూర్వకంగా అరెస్ట్లు చేస్తూ పోతున్నారు. అమాయకులను నిందితులుగా చేసి వాళ్లను నిరపరాధులుగా నిరూపించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మొత్తం 57 పేజీల రిమాండ్ పిటిషన్ వేశారు. అందులో దాదాపు సీబీఐ కేసులో ఉన్న అంశాలే ఉన్నాయి. మనీలాండరింగ్ జరిగింది అని చెప్పడానికి కనీసం ఓ డాక్యుమెంట్ ఆధారం కూడా ఈడీ వద్ద లేదు. అయినా రిమాండ్ అడుగుతున్నారు. ఇదంతా కావాలని చేస్తున్నదే. PMLA చట్టాన్ని అడ్డంగా పెట్టుకుని సిసోడియాకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు"
- సిసోడియా తరపు న్యాయవాది
Delhi excise policy case | ED tells Delhi Court that it is seeking 10-day custody for interrogation of Manish Sisodia to identify the modus operandi and to confront other persons who have been summoned
— ANI (@ANI) March 10, 2023
Delhi excise policy case | Senior Advocate Dayan Krishnan, appearing for Manish Sisodia, opposes ED plea seeking Sisodia's 10-day custody
— ANI (@ANI) March 10, 2023
తీహార్ జైళ్లో ఉన్న మాజీ మంత్రి సిసోడియాను ప్రత్యేక కోర్టు అనుమతితో మార్చి 7 నుంచి మూడు రోజులపాటు ఈడీ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. గురువారం విచారణ పూర్తయిన తరువాత సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అయితే మొదట ఈ కేసులో నవంబర్ 25, 2022న సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన సమయంలో సిసోడియా పేరు సైతం ఇందులో లేదని ఆప్ నేతలు ప్రస్తావిస్తున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఆప్ నేతలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను వినియోగిస్తుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం నిప్పులు చెరిగారు. ముందు సీబీఐ, ఇప్పుడు ఈడీ అధికారులు సిసోడియాను లక్ష్యంగా చేసుకుని వ్యవరిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. జరుగుతున్నది గమనిస్తే.. ఏం జరిగినా సరే సిసోడియాను మాత్రం జైళ్లో ఉంచాలి అనేది వారి లక్ష్యంగా కనిపిస్తుందన్నారు కేజ్రీవాల్.
UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్