అన్వేషించండి

Delhi Assembly Ruckus: విశ్వాస పరీక్షలో ఆప్ విజయం, ఆపరేషన్ లోటస్ ఫెయిల్ అంటూ కేజ్రీవాల్ కామెంట్స్

Delhi Assembly Ruckus: ఢిల్లీలో ఆప్ సర్కార్ విశ్వాస పరీక్షలో విజయం సాధించింది.

Delhi Assembly Ruckus: 

కేజ్రీవాల్‌కు మద్దతుగా ఎమ్మెల్యేలు.. 

ఢిల్లీలో ఆపరేషన్ లోటస్‌కు వ్యతిరేకంగా, తన బలం నిరూపించుకునేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో సొంత ప్రభుత్వంపై విశ్వాస పరీక్షకు దిగారు. ఈ పరీక్షలో ఆప్ సర్కార్ విజయం సాధించింది. అసెంబ్లీలో ఆప్‌నకు మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా...59 మంది కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలిచారు. మరో ఇద్దరు విదేశాలకు వెళ్లటం వల్ల ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ భాజపాపై మండి పడ్డారు. 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు కాషాయ పార్టీ బేరసారాలు కొనసాగించిందని మరోసారి విమర్శించారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్‌ విఫలమైందనటానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. దాదాపు 49 మంది ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అసెంబ్లీ వేదికగా డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియాకు మద్దతు తెలిపారు. సిసోడియా ఏ తప్పూ చేయలేదని CBI కి కూడా తెలుసని అన్నారు. అయినా...ఆయనపై 13 కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారంటూ భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనపై తప్పుడు కేసులు పెట్టారని తెలిసినా...సిసోడియా సీబీఐ విచారణను స్వాగతించారని గుర్తు చేశారు. సిసోడియా ఇంట్లోనే కాకుండా తన గ్రామానికీ వెళ్లి బ్యాంక్‌ లాకర్‌ని తనిఖీ చేశారని, వాళ్లకు అక్కడ ఏమీ దొరకలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో సిసోడియా ఏ తప్పూ చేయలేదని CBIకి తెలిసినప్పటికీ...ఆయనను అరెస్ట్ చేయాలని కేంద్రం పైనుంచి ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. సిసోడియాపై సీబీఐ దాడులు చేసిన తరవాత గుజరాత్‌లో ఆప్ ఓటు శాతం 4% మేర పెరిగిందని, ఆయనను అరెస్ట్ చేస్తే...ఇది 6% వరకూ పెరిగే అవకాశముందని జోస్యం చెప్పారు. స్కూల్స్, ఆసుపత్రులు నిర్మించాలనుకోవటం తప్పా అని ప్రశ్నించారు. కేవలం తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భాజపా రూ.20-50కోట్ల ఖర్చు చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. ఆప్‌ మంచి చేసిన ప్రతి చోటా సీబీఐతో సోదాలు చేయిస్తున్నారని మండి పడ్డారు. తన ఇద్దరు పిల్లలూ IITలోనే చదివారని...ఢిల్లీలోని విద్యార్థులందరికీ ఆ స్థాయి విద్య అందించాలని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా కేజ్రీవాల్ చెప్పారు. 

సిసోడియాకు కూడా ఆఫర్..?  

సీబీఐ లిక్కర్ కేసులో 8 మందికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా భాజపాపై మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పార్టీలో చేరాలని భాజపా తనను అడిగిందని, అలా చేస్తే...ఈడీ కేసులు, సీబీఐ సోదాలు అన్నింటినీ నిలిపివేస్తామని చెప్పిందని కామెంట్స్ చేశారు సిసోడియా. "నాకు భాజపా నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆప్‌ నుంచి బయటకు వచ్చి భాజపాలో చేరండి. ఈడీ కేసులన్నీ క్లోజ్ చేస్తాం అని అందులో ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు. తనపై పెట్టిన కేసులన్నీ తప్పుడువేనని పదేపదే చెప్పిన సిసోడియా భాజపాకు ఏం రిప్లై ఇచ్చారో కూడా వివరించారు. "నేనో రాజ్‌పుత్‌ని. మహారాణ ప్రతాప్‌ వారసుడిని. నా తలైనా నరుక్కుంటాను కానీ...అలాంటి అవినీతి పరులు, కుట్రదారుల ముందు తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ నిరాధారమైనవి. మీరేం చేసుకుంటారో చేసుకోండి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Telangana Early Elections : తెలంగాణలో మళ్లీ ముందస్తు ఊహాగానాలు - కేబినెట్ భేటీ వైపే అందరి చూపు !

Also Read: Transhumanism: మనిషికీ 2.0 వర్షన్ ఉందా? ట్రాన్స్‌హ్యూమనిజం కాన్సెప్ట్‌ ఏంటో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget