By: ABP Desam | Updated at : 09 Sep 2021 10:47 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
దేశంలో కరోనా కేసులు(ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత కొద్ది రోజులుగా 40 వేల దిగువన వస్తున్న కేసులు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 18.17 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 43,263 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బుధవారం 37,875 కేసులతో పోలిస్తే ఇవాళ దాదాపు 6 వేల కేసులు పెరగాయి. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లు దాటింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల 338 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు 4,41,749 మంది కరోనాతో మృతిచెందారు.
Also Read: New study: మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...
కేరళలో కరోనా విలయతాండవం
కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 20 వేల దిగువన ఉన్న కేసులు తాజాగా మళ్లీ 30 వేలు వచ్చాయి. కేరళలో బుధవారం ఒక్కరోజే 30,196 కేసులు నమోదయ్యాయి. 180 మందికి పైగా మరణించారు. ముంబయిలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా అక్కడ 500లకు పైగా కొత్త కేసులు వచ్చాయి. ముంబయిలో ఈ స్థాయిలో కేసులు రావడం జులై 15 తర్వాత ఇదే తొలిసారి.
India reports 43,263 new #COVID19 cases, 40,567 recoveries & 338 deaths in last 24 hours, as per Union Health Ministry.
— ANI (@ANI) September 9, 2021
Total cases: 3,31,39,981
Active cases: 3,93,614
Total recoveries: 3,23,04,618
Death toll: 4,41,749
Total vaccinations: 71,65,97,428 (86,51,701 in last 24 hrs) pic.twitter.com/u9pEV1CyRG
4 లక్షల చేరువలో యాక్టివ్ కేసులు
గత కొన్ని రోజులుగా రికవరీలు అధికంగా ఉన్నాయి. కానీ తాజాగా కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య తక్కువగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 40,567 మంది వైరస్ నుంచి కోలుకోన్నారు. ఇప్పటివరకు దేశంలో 3.23 కోట్ల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.48 శాతం ఉంది. కొత్త కేసులు పెరగడంతో క్రియాశీలక కేసులు మళ్లీ 4 లక్షలకు దగ్గరయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,93,614 మంది వైరస్తో బాధపడుతున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం 86.51 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటి వరకు దేశంలో 71.65 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: Lokesh Tour Tension : నర్సరావుపేటలో టెన్షన్ టెన్షన్ - లోకేష్కు పర్మిషన్ లేదన్న పోలీసులు !
TSPSC Papers Leak: పేపర్స్ లీక్ నిందితులు రేణుక, భర్త డాక్యా నాయక్లపై వేటు
PRO-Khalistani Twitter Account: భారతదేశంలోని ఖలిస్తానీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్
Breaking News Live Telugu Updates: వడగండ్ల ప్రభావిత జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన, పంట నష్టంపై పరిశీలన
AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగ రాతపరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్లో 5388 'నైట్ వాచ్మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం