అన్వేషించండి

Congress On Shashi Tharoor: శశిథరూర్‌పై కాంగ్రెస్ ఫైర్- రిగ్గింగ్ ఆరోపణలకు కౌంటర్!

Congress On Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన శశిథరూర్‌పై పార్టీ నేతలు ఫైర్ అయ్యారు.

Congress On Shashi Tharoor: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గేతో పోటీ పడి శశిథరూర్ ఓడిపోయారు. అయితే ఓటమి అనంతరం ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు శశి థరూర్‌ వర్గం ఆరోపణలు చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు ముఖాలు

ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే శశి థరూర్‌ ఆరోపణలకు మిస్త్రీ కౌంటర్‌ ఇచ్చారు. శశిథరూర్‌కు రెండు ముఖాలు ఉన్నాయన్నారు.

" మేము మీ అభ్యర్థనను స్వీకరించాం. కానీ మీరు మీడియా ముందుకు వెళ్లి కేంద్ర ఎన్నికల అథారిటీ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నినట్లు ఆరోపించారు. మా సమాధానాలన్నిటితో మీరు సంతృప్తి చెందారని మాకు తెలియజేశారు. అప్పుడు మా ముందు మీకు ఒక ముఖం ఉంది. మాపై ఈ ఆరోపణలన్నీ చేసిన మీడియాలో మేం వేరే ముఖం చూశాం. ఇది చెప్పడానికి నేను చింతిస్తున్నాను.                   "
-    మధుసూదన్‌ మిస్త్రీ,  కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ 

సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో అక్రమాలు జరిగాయంటూ శశిథరూర్‌ సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్ నిబంధనలు ఉల్లంఘించి...రిగ్గింగ్‌కు పాల్పడ్డారని అన్నారు. ముఖ్యంగా యూపీలో ఎన్నో అవకతవకలు జరిగాయని థరూర్‌ వర్గం ఆరోపిస్తోంది. ఈ మేరకు వాళ్లు...కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీకి బుధవారం లేఖ రాసింది.

" నిజానికి మేం లేఖ రాయాలని అనుకోలేదు. ఎన్నికలో అవకతవకలు జరుగుతున్నాయని ఇప్పటికే ఎన్నో సార్లు ఫిర్యాదు చేశాం. కానీ...కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదు. అందుకే...లేఖ రాశాం. యూపీలో పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగలేదు. ఖర్గే మద్దతుదారులు దగ్గరుండి మరీ ఈ అవకతవకలకు పాల్పడ్డారు. బహుశా..ఈ విషయం ఖర్గేకి తెలిసి ఉండకపోవచ్చు. కొన్ని బ్యాలెట్ బాక్స్‌లకు సీల్‌ వేయలేదు. ఇది న్యాయమా..? అందుకే ఆ రాష్ట్రంలో పోలైన ఓట్లను చెల్లనివిగా పరిగణించాలి. "
-                     శశిథరూర్ వర్గం
 

ఖర్గే గెలుపు

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో ఎక్కువ మంది కాంగ్రెస్‌ శ్రేణులు ఖర్గేకు ఓటు వేశారు. పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌ పోటీ పడ్డారు. ఇవాళ (అక్టోబర్ 19న) ఫలితాలు వెలువడ్డాయి. దీంతో 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టననున్నారు.

ఎన్నికల్లో ఖర్గేకు అనుకూలంగా చాలా మంది తమ ఓటు వేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌లో జరిగిన ఎన్నికల్లో 7897 మంది ఖర్గేకు అనుకూలంగా ఓట్లు వేశారు. 1072 మంది శశిథరూర్‌కు అనుకూలంగా ఓటు వేశారు. అంటే 6800పైగా మెజారిటీతో  ఖర్గే విజయం సాధించారు. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. 

Also Read: NCP Leader Supriya Sule: ట్రాఫిక్ పోలీస్‌గా మారిన పవార్ కుమార్తె- వీడియో చూశారా?

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs DC Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 8వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP DesamGujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKR

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
UPSC CSE Final Result 2024: సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
IPL 2025 LSG VS DC Result Update: ఢిల్లీ సిక్స‌ర్.. ఆరో విజ‌యంతో స‌త్తా చాటిన క్యాపిటల్స్, రాణించిన అభిషేక్, రాహుల్, ముఖేశ్, ల‌క్నో చిత్తు
ఢిల్లీ సిక్స‌ర్.. ఆరో విజ‌యంతో స‌త్తా చాటిన క్యాపిటల్స్, రాణించిన పొరెల్, రాహుల్, ముఖేశ్, ల‌క్నో చిత్తు
Embed widget