అన్వేషించండి

రైలు బోగీల రంగుల వెనుక అంత కథ ఉందా? కోచ్‌లపై ఆ గీతలకు అర్థం ఏమిటీ?

1990 కంటే ముందు మన రైళ్లన్నీ ఇటుక రంగులోనే ఉండేవి. ఆ తర్వాత కాలక్రమేనా నీలం రంగు బోగీల సంఖ్య పెరిగాయి. రైల్వే ఆ రంగులను ఎందుకు మార్చింది? రైల్వే బోగీల రంగులు ఏం సూచిస్తాయి?

రైలు బోగీలు రకరకాల రంగుల్లో ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే, ఒకప్పుడు మన దేశంలోని రైలు బోగీలు ముదురు ఎరుపు(ఇటుక రంగు)లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు మాత్రం అన్నీ రైళ్లు దాదాపు నీలం రంగులో ఉంటున్నాయి. కొన్ని రెడ్, గ్రీన్ కలర్‌లో కూడా ఉంటున్నాయి. మరి రైల్వే బోగీలను రంగులను ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలుసా? అయితే, తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవల్సిందే. 

ఇండియాలో 1990 వరకు బోగీలన్నీ ఇటుక రంగులోనే ఉండేవి. ఆ తర్వాత బోగీల్లో మార్పులు తీసుకురావడం మొదలుపెట్టారు. చాలా బోగీలను నీలం రంగులోకి మార్చారు. అయితే, దీని వెనుక కొన్ని టెక్నికల్ కారణాలు కూడా ఉన్నాయి. పాత రైలు బోగీలకు, కొత్తగా తయారు చేసిన బోగీల బ్రేక్ సిస్టమ్‌లో చాలా మార్పులు వచ్చాయి. దీనివల్ల రైళ్లకు బోగీలను అమర్చేప్పుడు గందరగోళంగా ఉండేది. పాత బోగీలకు కొత్త బోగీలు అమర్చడం వల్ల బ్రేకింగ్ సిస్టమ్‌లో లోపాలు తలెత్తేవి. ఈ నేపథ్యంలో పాత బోగీలను, కొత్త బోగీలను తేలికగా గుర్తుపట్టేందుకు రంగులు మార్చడం ఒక్కటే మార్గమని భావించారు. ఈ నేపథ్యంలో కొత్త బోగీలకు నీలం రంగు వేయడం మొదలుపెట్టారు. 

రైళ్లను ఎక్కువగా స్టీల్-ఐరన్‌ కాంబినేషన్‌తో తయారు చేస్తారు. దీనివల్ల బోగీలు ఎన్నాళ్లయినా తుప్పు పట్టవు. బోగీల తయారీ తర్వాత రెడ్ ఆక్సైడ్ ప్రైమర్ వేసినప్పుడే అది సాధ్యమవుతుంది. ఫెర్రస్ ఆక్సైడ్‌తో తయారు చేసే ఈ ప్రైమర్.. ఇటుక రంగులో ఉంటుంది. ఇనుప వస్తువులకు రంగులు వేసే ముందు ఈ ప్రైమర్‌నే ఉపయోగిస్తారు. అందుకే అప్పట్లో రైళ్ల బోగీలన్నీ ముదురు ఎరుపు ఇటుక రంగులో ఉండేవి. బోగీలన్నింటికీ రంగులు వేయడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో అప్పట్లో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొత్త బోగీలకు, పాత బోగీలకు వేగాన్ని తట్టుకోవడంలో తేడాలు ఉండేవి. ఈ నేపథ్యంలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) రకానికి చెందిన కోచ్‌లకు నీలం రంగులు వేసేవారు. 

⦿ ICF బోగీలు గంటకు 70 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 
⦿ ICF బోగీలను ఎక్కువగా మెయిల్ ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ ట్రైన్లకు మాత్రమే ఉపయోగిస్తారు.
⦿ ICFలో ఎర్ర రంగు ఏసీ కోచ్‌లు కూడా ఉంటాయి. వీటిని ‘రాజధాని’ ఎక్స్‌ప్రెస్‌కు ఉపయోగిస్తారు. 
⦿ ప్రస్తుతం వీటిని ICF బోగీలను లింకే హాఫ్మన్ బుష్(LHB)కు అప్‌గ్రేడ్ చేశారు. వీటి బాడీని అల్యూమినియంతో తయారు చేస్తారు. 
⦿ ICF బోగీలతో పోల్చితే LHB బోగీలు మరింత తేలిగ్గా ఉంటాయి. వేగాన్ని కూడా తట్టుకుంటాయి. 
⦿ పచ్చ రంగులో ఉండే బోగీలను గరీబ్ రథ్‌కు ఉపయోగిస్తున్నారు. 
⦿ ‘లైట్ బ్లూ’ కలర్ బోగీలను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లకు వాడుతున్నారు. 
⦿ హంసఫర్ రైళ్లకు ‘ట్రూ డిజిటల్ బ్లూ’ కలర్‌ను ఉపయోగిస్తున్నారు. 
⦿ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై తెలుపు, నీలం రంగు గీతలు ఉంటాయి. 
⦿ కింద నీలం రంగు, పైన పసుపు రంగు ఉండే కోచ్‌లు ‘శతాబ్ది’ ఎక్స్‌ప్రెస్‌ను సూచిస్తాయి. 
⦿ పసుపు, ఆరెంజ్ రంగు డిజైన్లలో ఉండే కోచ్‌లు ‘తేజస్’ ఎక్స్‌ప్రెస్‌ను సూచిస్తాయి. 
⦿ ఎరుపు, పసుపు రంగులను కేవలం ‘డబుల్ డెక్కర్’, ‘అంత్యోదయ’ రైళ్లకు మాత్రమే ఉపయోగిస్తారు. 
⦿ మహామన ఎక్స్‌ప్రెస్‌.. ఊదా రంగులో ఉంటుంది. 
⦿ LHB గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌కు నీలం రంగులో ఉండి, పసుపు గీత ఉంటుంది. ఆ రైలు గంటకు 155 కిమీల కంటే వేగంగా ప్రయాణిస్తుందని ఆ గీత సూచిస్తుంది.

రైలు బోగీలపై ఉండే ఆ గీతలు ఎందుకంటే..: రైలు రంగులే కాదు, వాటిపై ఉండే గీతల్లో కూడా ప్రయాణికులకు అవసరమైన సమాచారం ఉంటుంది. ఈ సారి మీరు రైలు ఎక్కేప్పుడు వాటిని బాగా గమనించండి.

⦿ రైలు బోగీ చివరన పసుపు గీతలు క్రాస్‌గా ఉంటే.. అది జనరల్ కోచ్ అని అర్థం. ఆ బోగీ ఎక్కేందుకు రిజర్వేషన్ అక్కర్లేదు.
⦿ నీలం రంగు బోగీపై తెలుపు లేదా, లేత నీలం రంగు గీతలు ఉంటే అది స్లీపర్ క్లాస్. 
⦿ బోగీపై పసుపు చారలు ఉన్నట్లయితే అది అంగవైకల్యం, అనారోగ్యంతో బాధపడేవారికి కేటాయించిన కోచ్ అని అర్థం. 
⦿ లోకల్ రైళ్లలో ఆకుపచ్చ రంగు గీతలుంటే అది మహిళల కోచ్ అని అర్థం. 
⦿ లోకల్ రైళ్లలో ఎరుపు గీతలు ఉంటే ఫస్ట్ క్లాస్ కోచ్ అని అర్థం.  

త్వరలో రంగు రంగుల బోగీలు: దేశంలో అత్యధిక రైళ్లు నీలం రంగులోనే ఉన్నాయి. ఆ రంగును చూసి చూసి బోరు కొట్టినట్లయితే.. త్వరలోనే భిన్నమైన రంగుల్లో బోగీలు కనువిందు చేయనున్నాయి. ఉత్తర రైల్వేలో ఇప్పటికే ఏడు భిన్నమైన రంగుల బోగీలను ప్రయోగాత్మకంగా సిద్ధం చేశారు. బోగీలకు గీతలు ఏర్పడకుండా యాంటీ-గ్రాఫిటీ వినైల్ ఉపయోగించనున్నారు. దీనివల్ల బోగీలు కూడా శుభ్రంగా ఉంటాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget