అన్వేషించండి

Chittoor News: చోరీ అయిన 500 ఫోన్లు రికవరీ, మీ మొబైల్ పోతే ఇలా కంప్లైంట్ ఇవ్వండి

Chittoor News: చోరీకి గురైన కోటి రూపాయల విలువ చేసే 500 ఫోన్లు చిత్తూరు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లనూ స్వాధీనం చేసుకుని బాధితులకు అందించారు.

Chittoor News: ఫోన్లు పోవడం, చోరీకి గురికావడం చాలా సాధారణం. ఆ పోయిన ఫోన్లు దొరక్కపోవడం కూడా అంతే సాధారణం. ఫోన్ పోతే ఒకటీ రెండు చోట్ల వెతుకుతారు. దొరికిందా సరేసరి లేదంటే తూర్పు వైపు తిరిగి దండం పెడుతుంటారు చాలా మంది. అంటే ఇక ఆ ఫోన్ దొరకదని ఊరుకుంటారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేయరు. అందులో ఉన్న ఫోటోలు, ఇతర డేటా కోసం బాధపడుతుంటారు. టెక్నాలజీ తెలిసిన వారు, ఫోన్లలోని ఆప్షన్లపై అవగాహన ఉన్న వారు ఆ ఫోన్ పని చేయకుండా బ్లాక్ చేయడం లాంటివి చేస్తుంటారు. డేటా దుర్వినియోగం కాకుండా ఎరేజ్ చేస్తుంటారు. కానీ పోయిన ఫోన్ కోసం పోలీసు కంప్లైంట్ ఇవ్వరు, దాని కోసం వెతకరు. సెల్ ఫోన్ పోగొట్టుకుని లేదా చోరీకి గురైన ఇక ఆశలన్నీ వదులుకున్న వారికి చిత్తూరు జిల్లా పోలీసులు అదిరిపోయే న్యూస్ చెప్పారు. 

చోరికి గురైన కోటి రూపాయలు విలువైన 500 మొబైల్ ఫోన్లను   రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా పోలీసులు ప్రకటించారు. ఆయా ఫోన్లు బాధితులకు అందజేసారు. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ లో మొబైల్ రికవరీ మేళా పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి బాధితులకు ఫోన్లు ఇచ్చారు. చాట్ బాట్ లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో ఉన్న ఫోన్లను కూడా గుర్తించి రికవరీ చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.

దొరకవు అనుకున్న ఫోన్లు దొరికాయి

ఆధునిక సాంకేతికత సాయంతో మొబైల్ ఫోన్ దొంగలు ఆట కట్టించారు చిత్తూరు జిల్లా పోలీసులు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఐదు వందలకు పైగా ఫోన్లను రికవరీ చేసి వాటిని బాధితులకు అందజేశారు. చిత్తూరు జిల్లాలో కొట్టేసిన ఫోన్లు జమ్మూ కశ్మీర్ లో ఉన్నప్పటికీ లేటెస్ట్ చాట్ బాట్ టెక్నాలజీ ఉపయోగించి గుర్తించినట్టు ఎస్పీ విశ్వంత్ రెడ్డి తెలిపారు.  కొన్ని కేసుల్లో భాదితుల ఫిర్యాదు అందిన 4 గంటల లోపు మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఇతర  రాష్ట్రాలు, జిల్లాల నుండి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్, రాజాస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్ల రికవరీ చేశారు చిత్తూరు పోలీసులు. ఇక దొరకవు అన్న ఫోన్లు మళ్ళీ తమ కళ్ళ ముందు కనిపించేటప్పటికి బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కూడా ఫిర్యాదులు అందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ విశ్వంత్ రెడ్డి అభినందించారు. ఎటువంటి కంప్లయింట్ లేకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్ళకుండా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసుల “చాట్ బాట్” సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బాధితులు మళ్లీ పొందవచ్చునని తెలిపారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు చాట్ బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పని చేస్తున్నారన్నారు. 

చాట్ బాట్‌కు వివరాలు ఇలా పంపించాలి

ముందుగా 9440900004 నంబర్ వాట్సాప్ కు HI, లేదా Help టెక్ట్స్ మెసేజ్ పంపాలి. తర్వాత వెనువెంటనే Welcome to Chittoor Police పేరున ఒక లింకు వస్తుంది. ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. జిల్లా, పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్ట్ నంబర్, మిస్సయిన మొబైల్ మోడల్, IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ వివరాలను సబ్మిట్ చేయాలి. వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది. తర్వాత ఆ మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి రికవరీ చేసేందుకు చాట్ బాట్ బృందం నిపుణులు ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget