అన్వేషించండి

China On Iphones: ప్రభుత్వ ఉద్యోగులు ఐఫోన్లు వాడొద్దు- చైనా కొత్త రూల్స్

China On Iphones: ప్రముఖ యాపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్లపై చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ప్రముఖ యాపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్లపై చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. చైనా యాపిల్‌ అభివృద్ధిని దెబ్బ తీసేందుకు చర్యలు తీసుకుంటోందని, అందుకోసం చైనా ప్రభుత్వ అధికారులు పని కోసం ఐఫోన్లు వాడొద్దని ప్రభుత్వం నిబంధనలు పెట్టిందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తమ కథనంలో పేర్కొంది. చైనా సెంట్రల్‌ గవర్నమెంట్‌కు చెందిన సంస్థలలో ఐఫోన్లు లేదా విదేశీ బ్రాండెడ్‌ ఫోన్లను ఆఫీస్‌ వినియోగం కోసం వాడొద్దని, అలాగే వాటిని కార్యాలయాలకు తీసుకురావొద్దని అధికారులు వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అని పత్రిక తెలిపింది. 

పై స్థాయి అధికారులు కొన్ని వారాల క్రితమే ఈ ఆదేశాలు జారీ చేశారని అయితే వాటిపై ఎంత వరకు సీరియస్‌గా ఉన్నారు, ఎంత వరకు నిబంధనలు అమలవుతున్నాయి అనే అంశాలపై స్పష్టత లేదని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. అయితే నిషేధించిన విదేశీ బ్రాండ్స్‌లో కేవలం యాపిల్‌ పేరు మాత్రమే ఉందని, మరే పేరును అధికారులు ప్రస్తావించలేదని తెలిపింది. ఈ అంశంపై స్పందన కోరడానికి చైనా స్టేట్‌ కౌన్సిల్‌ ఇన్ఫర్మేషన్‌ కార్యాలయం అందుబాటులోకి రాలేదని, అలాగే యాపిల్‌ సంస్థ కూడా దీనిపై స్పందించలేదని వెల్లడించింది.

ఎంతో ఎదురుచూస్తున్న యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు చైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఎక్కువగా స్వదేశీ బ్రాండ్‌ ఫోన్లనే వాడాలని ప్రోత్సహించే దిశగా చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ఐఫోన్‌ మార్కెట్‌పై పడుతుంది. అమెరికా తర్వాత యాపిల్‌కు అతి పెద్ద మార్కెట్‌ ఉంది చైనాలోనే. అయితే చైనీస్‌ టెక్‌ దిగ్గజం బెహమోత్‌ హవాయ్‌ సరికొత్త మోడల్‌ మేట్‌ 60 సిరీస్‌ చైనాలో యాపిల్‌ మార్కెట్‌ షేర్‌ను పంచుకునే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2019లో బాన్‌ చేసిన అమెరికన్‌ కంపెనీల నుంచి చైనా కంపెనీలకు సాఫ్ట్‌వేర్‌, ఎక్విప్‌మెంట్‌ అమ్మడాన్ని బ్యాన్‌ చేసిన తర్వాత హవాయ్‌ కంపెనీ చేస్తున్న లాంఛ్ కు ప్రత్యేకత సంతరించుకుందని నిపుణులు పేర్కొన్నారు. 

చైనాలో ఆర్థిక ప్రతికూల పవనాల ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్స్‌ డిమాండ్‌ బలహీనపడింది. గత ఏడాదితో పోలిస్తే 2023 రెండవ త్రైమాసికంలో చైనాలో స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు 4శాతం పడిపోయాయి. ఓప్పో, వివో కంపెనీలు 18 శాతం మార్కెట్‌ షేర్‌తో మొదటి రెండు స్థానాల్లో ఉండగా యాపిల్‌ కంపెనీ 16 శాతం షేరత్‌ మూడో స్థానంలో ఉంది. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చి ప్రకారం.. చైనాలో రెండో త్రైమాసికంలో అత్యంత ఎక్కువ ఇయర్‌ ఓవర్‌ ఇయర్‌ గ్రోత్‌ సాధించిన కంపెనీ యాపిల్‌ అని పేర్కొంది. పండగల సీజన్‌లో ఐఫోన్‌ 14 ధర తగ్గించడం వల్ల అధికంగా అమ్ముడుపోయినట్లు తెలిపింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget