అన్వేషించండి

Chaitra Navratri 2023: 100 మందిని సన్యాసులుగా మార్చేయనున్న రామ్‌దేవ్‌ బాబా, ముహూర్తం కూడా పెట్టేశారు

Chaitra Navratri 2023: రామనవమి రోజున రామ్‌దేవ్‌ బాబా ఆధ్వర్యంలో 100 మంది సన్యాసం తీసుకోనున్నారు.

Sanyas Diksha Progamme: 


రామనవమి రోజున సన్యాసం..

యోగా గురు బాబా రామ్ దేవ్‌ బాబా ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రామ నవమి రోజున 100 మంది మహిళలు, పురుషులను సన్యాసులుగా మార్చనున్నారు. పతంజలి యోగపీఠ చైత్ర నవరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రామ్‌ దేవ్ బాబా సమక్షంలో 40 మంది మహిళలు, 60 మంది పురుషులు సన్యాసం తీసుకోనున్నారు. దీంతో పాటు 500 మంది మహిళలు, పురుషులు బ్రహ్మచర్యం తీసుకోనున్నారు. ఇటీవలే మహాప్రాణ యజ్ఞం పూర్తి చేసిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రామ్‌దేవ్ బాబా వెల్లడించారు. హిందూ సనాతన ధర్మాన్ని రక్షించేందుకు, ఆ ధర్మం బోధించిన సన్యాసులకు గౌరవమిచ్చేందుకు ఈ కార్యక్రమం మొదలు పెట్టినట్టు తెలిపారు. వేదాల్లోని సారాన్ని అధ్యయనం చేసిన వాళ్లు, సనాతన ధర్మాన్ని గౌరవించే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. భారత దేశ సనాతన ధర్మాన్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. 

"పతంజలి యోగపీఠ్‌లో మహిళలు, పురుషులు అన్న తేడాలు ఉండవు. కులం, మతం ఆధారంగా విడదీయం. వీళ్లంతా ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తారు. ఇంకొంత మంది సన్యాసం తీసుకునేలా చొరవ చూపిస్తారు. రామ రాజ్యం నాటి రోజులను తిరిగి తీసుకురావాలన్నదే మా ఆకాంక్ష. రామ మందిర నిర్మాణంతో ఆ కల సాకారమవుతుంది. ఇది జాతీయ ఆలయంగా చిరస్థాయిలో నిలబడిపోతుంది"

- రామ్‌దేవ్ బాబా 

ఇదే సమయంలో జమ్ముకశ్మీర్ సహా పలు కీలక అంశాలనూ ప్రస్తావించారు రామ్‌దేవ్‌ బాబా. ముఖ్యంగా బీజేపీ అజెండాలోని విషయాలపై మాట్లాడారు. 

"అయోధ్య రామ మందిరం వచ్చే జనవరి నాటికి పూర్తవుతుంది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. వీటితో పాటు ఇంకొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలి. జనాభా నియంత్రణకు కొత్త చట్టం తీసుకురావాలి. వచ్చే ఏడాది నాటికి ఈ రెండు పనులూ పూర్తవుతాయని ఆశిస్తున్నాను"

- రామ్‌దేవ్ బాబా 

సివిల్‌ కోడ్‌పైనా వ్యాఖ్యలు..

రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి సన్యాస్ దీక్ష ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 15 వందల మంది యువత..సన్యాసం తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఇలాంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని అమలు చేయడంలో స్వామి రామ్‌దేవ్ బాబా విజయం సాధించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు. గతంలోనూ రామ్‌ దేవ్‌ బాబా ఇదే విధంగా 100 మందిని సన్యాసం తీసుకునేలా చొరవ చూపించారు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. 

సంచలన వ్యాఖ్యలు..

యోగా గురు రామ్‌ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లింలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. ముస్లింలు అందరూ ఉగ్రవాదులు, రేపిస్ట్‌లు అంటూ నోరు జారారు. అప్పటి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన బర్మేర్ జిల్లాలో జరిగిన ఓ ఈవెంట్‌లో ముస్లింలు, క్రిస్టయన్లను ఉద్దేశిస్తూ మాట్లాడారు 
రాం దేవ్ బాబా. 

"ముస్లింలు తప్పనిసరిగా ఉదయం ప్రార్థనలు చేస్తారు. రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలంతే. ఆ తరవాత ఏమైనా చేసుకోవచ్చు. హిందూ అమ్మాయిలను పరిచయం చేసుకుని ఎన్ని పాపాలైనా చేయొచ్చు. చాలా మంది ముస్లింలు ఇదే చేస్తారు. కానీ నమాజ్‌ను మాత్రం కొనసాగిస్తారు. టెర్రరిస్ట్‌లు, క్రిమినల్స్‌లా కనిపించే వీళ్లు నమాజ్‌తో వాటిని కవర్ చేస్తారు. ఇస్లాం అంటే నమాజ్ చేయడం అని మాత్రమే వాళ్లకు తెలుసు. కానీ హిందూ మతం అలా కాదు" 
- బాబా రాం దేవ్, యోగా గురు 

Also Read: QR code on Tombstone: కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్, జ్ఞాపకాలను సజీవంగా దాచిన కుటుంబం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chennai Super Kings vs Lucknow Super Giants Highlights | స్టోయినిస్ సూపర్ సెంచరీ..లక్నో ఘన విజయంCM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Embed widget