అన్వేషించండి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి- బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు!

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు. కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది.

మరి కొన్ని నెలల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీని దృష్టిలో పెట్టుకున్న బీజేపీక పార్టీలో కీలక మార్పులు చేయబోతోంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతోంది. ఐదు రాష్ట్రాల అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో ఈ ఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఇందులో భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ సమయంలో రాష్ట్రాల్లోని అధ్యక్షులను మార్చాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

తెలంగాణ, గజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ మార్చబోతోంది. ఈ రాష్ట్రాల బాధ్యతలను పార్టీ కొత్త వారికి అప్పగించవచ్చు. జి.కిషన్ రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడిగా, సునీల్ జాఖర్ ను పంజాబ్ అధ్యక్షుడిగా, అశ్వత్ నారాయణ్ లేదా శోభాకు కర్ణాటక అధ్యక్షులుగా నియమించవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో ఎన్నికల మధ్యప్రదేశ్‌లో కీలక నేతలు బాధ్యతలు అప్పగించవచ్చు.

తెలంగాణ విషయానికి వస్తే కిషన్ రెడ్డి గతంలో కూడా అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా బండి సంజయ్‌కు  మంచి మార్కులే ఉన్నప్పటికీ తెలంగాణలో వస్తున్న రాజకీయ పరిణామాలతో ఆయన్ని మార్చాల్సి వస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. బండి సంజయ్‌ను మారుస్తారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. ఇన్ని రోజులు ఖండిస్తూ వచ్చిన బీజేపీ నాయకులు కొన్ని రోజుల నుంచి సైలెంట్ అయిపోయారు. అదే టైంలో బండి సంజయ్‌ కూడా హన్మకొండలో జరిగిన సమావేశంలో కాస్త భావోద్వేగానికి గురయ్యారు. 8న జరిగే ప్రధాని బహిరంగ సభకు అధ్యక్ష హోదాలో వస్తానో రానో అంటూ ఎమోషన్ అయ్యారు. దీంతో ఆయన మార్పు ఖాయమని పార్టీ వర్గాలు కన్ఫామ్ చేసుకున్నాయి. 

కర్ణాటకలో బీజేపీ ఓటమి తర్వాత ఇప్పుడు ఆ పార్టీ మేధోమథనంలో నిమగ్నమైంది. ప్రతిపక్ష నేత పేరుపై కూడా పార్టీ సస్పెన్స్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ ప్రతిపక్ష నేత లేకుండానే కర్ణాటక అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతోంది. మాజీ సీఎం, సీనియర్ నేత యడ్యూరప్పను ఢిల్లీకి పిలిపించి అమిత్ షా కలిశారు. అదే సమయంలో ఎన్నికల్లో ఓటమి నివేదికను కూడా కేంద్ర నాయకత్వానికి ఆయన అందజేశారు. ఇన్నిరోజుల మధనం తర్వాత పార్టీ పగ్గాలు కొత్త వ్యక్తి చేతికి అప్పగించవచ్చు.

ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే ఇక్కడ అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో పార్టీ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించింది. ప్రధాని మోదీ కూడా రాష్ట్రంలో పర్యటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయిలో బలంగా ఉండి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయగల నాయకుడికి పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారు. 

Also Read: తెలంగాణ బీజేపీకి బిగ్ మండే- ఢిల్లీకి రావాలని బండికి పిలుపు- సాయంత్రం కిషన్ రెడ్డి కీలక ప్రెస్‌మీట్

Also Read: కార్యకర్తల భేటీలో బండి సంజయ్‌ భావోద్వేగం - తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఖాయమైనట్టేగా!

 Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget