అన్వేషించండి

ట్విటర్ ఓ విదేశీ కంపెనీ, భారత్‌లోని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ హక్కు ఆ సంస్థకు వర్తించదు - కేంద్ర ప్రభుత్వం

Central Govt on Twitter: ట్విటర్‌కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కు వర్తించదు అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Central Govt on Twitter:

కర్ణాటక హైకోర్టులో పిటిషన్ 

ట్విటర్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి ప్రస్తావించిన కేంద్రం...ట్విటర్ అమెరికన్ కంపెనీ అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఆ సంస్థకు వర్తించదని తేల్చి చెప్పింది. భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించే ఆర్టికల్ 19 అనేది కేవలం భారతీయ పౌరులకు, సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం విధించిన పలు ఆంక్షలపై అసహనం వ్యక్తం చేసిన ట్విటర్..కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించింది. 2021 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి మధ్య కాలంలో కొన్ని ట్విటర్ అకౌంట్‌లను బ్లాక్‌ చేయాలని కేంద్రం తమపై ఒత్తిడి తెచ్చిందని ట్విటర్ కోర్టులో తెలిపింది. ఈ ఆదేశాలు పక్షపాతంగా ఉన్నాయని, ముందుగా నోటీసులు పంపకుండా అప్పటికప్పుడు పోస్ట్‌లు బ్లాక్ చేయమని చెప్పడమేంటని అసహనం వ్యక్తం చేసింది. అయితే...ప్రభుత్వం తరపున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఆర్ శంకరనారాయణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19...విదేశీ కంపెనీ అయిన ట్విటర్‌కు వర్తించదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి పక్షపాతం లేదని వెల్లడించారు. ట్విటర్‌కు ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేమని చెప్పారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏప్రిల్ 10వ తేదీకి విచారణను వాయిదా వేసింది. అయితే ఐటీ చట్టంలోని సెక్షన్ 69(A) ప్రకారం ఇది అనైతికం అని ట్విటర్ వాదించింది. సమానత్వం కల్పించే ఆర్టికల్ 14ని కేంద్రం ఉల్లంఘిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. 

ఫేక్‌ ట్వీట్‌ల పరిస్థితేంటి..? 

సొలిసిటర్ జనరల్ మాత్రం ట్విటర్‌ వ్యాఖ్యల్ని ఖండించారు. ఓ ప్రొఫైల్‌కు సంబంధించిన సమాచారం అడిగిన ప్రతిసారీ ట్విటర్ ప్రైవసీ పాలసీని ప్రస్తావిస్తోందని అన్నారు. ఇలాగే మినహాయింపు ఇస్తూ పోతే ఎప్పుడో ఓ రోజు ఇది ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు. ఉదాహరణకు పాకిస్థాన్ ప్రభుత్వం తరపు నుంచి ట్వీట్ చేస్తున్నట్టుగా ఓ ఫేక్ ట్వీట్‌ వెలుగులోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలని వివరించారు. కశ్మీర్ లాంటి సున్నితమైన అంశాలపై ఉద్రేకపరిచే ట్వీట్‌లు పెడితే సమాజంలో అశాంతి నెలకొనే ప్రమాదముందని చెప్పారు. కంటెంట్ రాసే వ్యక్తి వివరాలు కచ్చితంగా తెలియాలని గతంలో సుప్రీం కోర్టు కూడా తేల్చి చెప్పిన సంగతిని గుర్తు చేశారు. 

ఆఫీసులకు తాళం..

ఇండియాలోని ట్విటర్‌ ఆఫీస్‌లకు తాళం వేసేయమని ఆర్డర్‌ పాస్ చేశారు ఎలన్ మస్క్. భారత్‌లోని మూడు కార్యాలయాల్లో రెండింటిన మూసేశారు. ఇక్కడి ఉద్యోగులంతా ఇంటి నుంచి పని చేసుకోవచ్చు అని ప్రకటించారు. ఆఫీస్‌లు అంటే బోలెడంత ఖర్చు. మెయింటేనెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. అసలే రెవెన్యూ లేక ఇబ్బందులు పడుతున్న ట్విటర్‌కు...ఇది అదనపు భారంగా మారింది. అందుకే ఆఫీస్‌లు తీసేసి ఉద్యోగులకు WFH ఆప్షన్ ఇచ్చేశారు మస్క్‌. భారత్‌లో ట్విటర్‌కు 200 మంది ఉద్యోగులుండేవాళ్లు. వారిలో 90% మందిని ఇప్పటికే తొలగించారు. ఇక మిగిలింది తక్కువే. వాళ్ల కోసం అంత పెద్ద ఆఫీస్‌లు ఎందుకని భావించారు మస్క్. అందుకే న్యూఢిల్లీ, ముంబయిల్లోని ఆఫీస్‌లకు తాళం వేశారు. బెంగళూరులోని ఆఫీస్ మాత్రం తెరిచే ఉంచారు. నిజానికి ఇండియాలోనే కాదు. ప్రపంచంలో చాలా చోట్ల ట్విటర్ ఆఫీస్‌లను మూసేశారు. ఈ ఏడాది పూర్తయ్యేలోగా ట్విటర్‌కు ఆర్థిక కష్టాలు తీరిపోవాలని చాలా పట్టుదలతో ఉన్నారు ఎలన్ మస్క్.

Also Read: BJP vs Rahul Gandhi: రాహుల్ సారీ చెబితేగానీ మాట్లాడనివ్వం, తేల్చి చెప్పిన బీజేపీ నేతలు

టాప్ హెడ్ లైన్స్

BAT-BMS Controversy: BAT-BMSతో సహా 7 యాప్‌లను తొలగించాలని గూగుల్‌, ఆపిల్‌కు ప్రభుత్వం నోటీసులు! ఎందుకు ఎలా వివాదం మొదలైంది? 
BAT-BMSతో సహా 7 యాప్‌లను తొలగించాలని గూగుల్‌, ఆపిల్‌కు ప్రభుత్వం నోటీసులు! ఎందుకు ఎలా వివాదం మొదలైంది? 
NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
Agra Bathroom Murder Case: ఆగ్రాలో భర్తను చంపి బాత్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టిన భార్య! 45 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం! 
ఆగ్రాలో భర్తను చంపి బాత్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టిన భార్య! 45 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం! 
Eng Playing XI Vs Ind in Manchester T20: ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్ ప్ర‌క‌ట‌న‌.. స్టార్ పేస‌ర్ రీఎంట్రీ
ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్ ప్ర‌క‌ట‌న‌.. స్టార్ పేస‌ర్ రీఎంట్రీ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
How Car Airbags Work: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Honda కార్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్ - Elevate, Amazeపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్లు
కొత్త కారు కొనేవాళ్లకు బంపర్ ఆఫర్‌ - Honda కార్లపై రూ.2 లక్షలకు పైగా బెనిఫిట్స్‌
Telangana Political Narrative : రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
Embed widget