అన్వేషించండి

Bullet Train Project: 2026 నాటికి భారత్‌లో బులెట్ ట్రైన్, మోదీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు - ABPతో రైల్వే మంత్రి

Bullet Train Project: 2026 ఆగస్టు నాటికి తొలి బులెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రి వెల్లడించారు.

Bullet Train Project:

రైల్వే మంత్రి ప్రకటన..

రైల్వే రంగానికి మోదీ సర్కార్ ఎంత ప్రియార్టీ ఇస్తోందో...బడ్జెట్‌ని చూస్తేనే అర్థమవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2.40 లక్షల కోట్లు కేటాయించింది. ఇప్పటికే వందేభారత్ ట్రైన్‌లనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరోలనే వందే భారత్ మెట్రో రైళ్లనూ తీసుకురానుంది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ కూడా వచ్చేసింది. ప్రధాని మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ "బులెట్ ట్రైన్" ప్రాజెక్ట్‌ కూడా పట్టాలెక్కనుంది. ABP Newsతో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయం వెల్లడించారు. 2026 ఆగస్టు నాటికి బులెట్ ట్రైన్ భారత్‌లో అందుబాటులోకి వస్తుందని తేల్చి చెప్పారు. స్వయంగా ప్రధాని ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. జపాన్ ప్రభుత్వ సహకారంతో...2026 నాటికి బులెట్ ట్రైన్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు వివరించారు. నిజానికి గతేడాది ఆగస్టు నాటికే ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాల్సి ఉంది. 2017లో సెప్టెంబర్ 14వ తేదీన జపాన్ ప్రధాని షింజో అబే, ప్రధాని నరేంద్ర మోదీ బులెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. తొలి విడతగా...ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు సర్వీస్‌లు నడపాలని నిర్ణయించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి అంటే...2022 ఆగస్టుకి తొలి బులెట్ ట్రైన్‌ అందుబాటులోకి వస్తుందని అప్పుడే హామీ ఇచ్చారు మోదీ. కానీ...ఆ లక్ష్యం నెరవేరలేదు. ఇప్పుడు రైల్వే మంత్రి ప్రకటనతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే...బులెట్ ట్రైన్ రావడానికి మరో నాలుగేళ్లు పట్టే అవకాశముందని...ఆయన ప్రకటనతో స్పష్టమైంది. ఈ డిలే కారణంగా...ప్రాజెక్ట్ వ్యయమూ పెరిగే అవకాశ ముంది. 

పెరగనున్న ప్రాజెక్ట్ వ్యయం..

2015 డిసెంబర్‌లో ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. జపాన్‌ ప్రభుత్వం టెక్నికల్‌గా, ఫినాన్షియల్‌గా సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రూ.1.08 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అయితే...ఇప్పుడు ఈ ఖర్చు పెరగనుంది. జపాన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం...ఆ దేశం భారత్‌కు మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 81% మేర రుణంగా అందిస్తుంది. ఇందుకు భారత్‌ 0.1% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. "ప్రాజెక్ట్ వ్యయం, రుణ మొత్తంలో అవసరాలకు తగ్గట్టుగా ఎప్పుడైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు" అని అప్పుడే ఒప్పందంలో చాలా క్లియర్‌గా రాసుకున్నారు. 50 ఏళ్లలో ఈ మొత్తం లోన్‌ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చూస్తే...ఇప్పటి ఖర్చులకు అనుగుణంగా వ్యయం కచ్చితంగా పెరుగుతుంది. గతేడాది పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే...ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం మొత్తం 1396 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 1248 హెక్టార్ల భూమిని సేకరించినట్టు చెప్పారు. ముంబయి నుంచి అహ్మదాబాద్ వరకూ మొత్తం 508 కిలోమీటర్లను కవర్ చేసేలా తొలి బులెట్ ట్రైన్‌ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది కేంద్రం. ఇప్పటికే కొంత మేర సివిల్‌ వర్క్స్ మొదలయ్యాయి. మొత్తం 12 స్టేషన్‌లు కవర్ అవుతాయి. 360 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ దూసుకుపోతుంది. ఆపరేటింగ్ స్పీడ్‌ 320కిలోమీటర్లుగా ఉంటుంది. ముంబయి నుంచి సబర్మతికి కేవలం 3 గంటల్లో చేరుకోవచ్చు. 

Also Read: Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉండాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు: స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉంటే చాలు - ABP Desam Smart Ed Conclave లో అప్పల్ల సాయికిరణ్
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Embed widget