అన్వేషించండి

Telugu breaking News: తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య

Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

Key Events
breaking news February 16th live updates Rajkot test telangana Assemblye budget sessions Andhra Pradesh Assembly cm revanth reddy cm jagan Sharmila chandra babu lokesh Shankharavam ktr harish rao pm narendra modi bjp congress Telugu breaking News: తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య
ప్రతీకాత్మక చిత్రం

Background

Latest Telugu breaking News: టీమిండియా సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma), లోకల్‌ బాయ్‌ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) శతక గర్జన చేయడంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును రోహిత్‌, రవీంద్ర జడేజా అద్భుత శతకాలతో ఆదుకుని పటిష్ట స్థితిలో నిలిపారు. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ అర్ధశతకంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.  దురదృష్టవశాత్తు సర్ఫరాజ్‌ రనౌట్‌ అయినా... సాధికార బ్యాటింగ్‌తో తన ఎంపిక సరైందేనని నిరూపించుకున్నాడు. మూడో టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా అయిదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా.. కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నారు. 
 
ఆరంభంలో షాక్‌ మీద షాక్‌లు
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకోగా రోహిత్‌శర్మ, గత మ్యాచ్‌ హీరో ।యశస్వీ  జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. అలా ఆట అరంభమైందో లేదో నాలుగో ఓవర్‌లోనే యశస్వి జైస్వాన్‌ అవుటయ్యాడు. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి యశస్వి అవుటయ్యాడు. దీంతో టీమిండియా 22 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత 24 పరుగుల వద్ద శుభ్‌మన్‌ గిల్‌ డకౌట్‌ అయ్యాడు. మార్క్‌ వుడ్‌ వేసిన ఓవర్‌లో గిల్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి కీపర్‌ చేతిలో పడింది. తొమ్మిది బంతులు ఆడిన గిల్‌ ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్‌ చేరాడు. అనంతరం టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. హార్ట్‌ లీ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి రజత్‌ పాటిదార్‌ అవుటయ్యాడు. కేవలం అయిదు పరుగులే చేసి రజత్‌ పాటిదార్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.
 
రోహిత్‌-జడేజా శతక మోత
33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను రోహిత్ శర్మ- రవీంద్ర జడేజా ఆదుకున్నారు. హిట్ మ్యాన్‌ తన సహజశైలికి విరుద్ధంగా ఆచితూచి ఆడాడు. ఆరంభంలో రోహిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఫస్ట్‌ స్లిప్‌లో రూట్‌ వదిలేశాడు. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న రోహిత్‌ శర్మ అద్భుత శతకంతో భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. 157 బంతుల్లో రోహిత్‌ శర్మ శతకాన్ని అందుకున్నాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది పదకొండో సెంచరీ కావడం గమనార్హం. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ శర్మ 131 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో రోహిత్‌- జడేజా 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 237 పరుగుల వద్ద రోహిత్ అవుటవ్వడంతో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 
 
జడేజా-సర్ఫరాజ్ జోరు
అనంతరం జడేజాతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ జత కలిశాడు. వీరిద్దరూ వేగంగా పరుగులు తీస్తూ ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ క్రమంలో సొంత మైదానంలో జడేజా శతకంతో మెరిశాడు. 198 బంతుల్లో రవీంద్ర జడేజా సెంచరీ చేసి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. టెస్టుల్లో జడేజాకు ఇది నాలుగో సెంచరీ. సర్ఫరాజ్‌ కూడా ఆడిన తొలి టెస్ట్‌లోనే అర్ధ శతకం సాధించి సత్తా చాటాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో సర్ఫరాజ్‌  హాఫ్‌ సెంచరీ చేశాడు. అనంతరం సింగిల్‌ కోసం ప్రయత్నిస్తూ రనౌట్‌ అయ్యాడు. అనంతరం కుల్‌దీప్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు. మూడో టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా అయిదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా.. కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నారు.
20:00 PM (IST)  •  16 Feb 2024

రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ మృతి

మాస్కో: రష్యాలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) మృతిచెందారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన నేత నావల్నీ(47) జైలులో శుక్రవారం మృతిచెందినట్లు సమాచారం. గతంలో అలెక్సీ నావల్నీపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 19 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నావల్నీ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆర్కిటిక్‌ ప్రిజన్ కాలనీలో నావల్నీ చనిపోయారని రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  

19:10 PM (IST)  •  16 Feb 2024

తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య

హైదరాబాద్‌: తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్‌ మాలోత్‌, ఎం.రమేశ్‌లను ప్రభుత్వం నియమించింది. తాజాగా నియమితులైన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. 

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CII Partnership Summit 2025 : భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
Kondagattu Temple: కనీస సౌకర్యాల్లేవ్ ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  
కనీస సౌకర్యాల్లేవ్ ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  
Delhi Bomb Blast : ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు- ప్రత్యేక కోడ్ నేమ్‌లతో సిరియల్ పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం!
ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు- ప్రత్యేక కోడ్ నేమ్‌లతో సిరియల్ పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం!
Official Apology : క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 
క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 
Advertisement

వీడియోలు

SSMB 29 Priyanka Chopra First Look | రాజమౌళి - మహేశ్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చేసింది | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
Saurav Ganguly On Shami Selection | టీమిండియాలోకి మహ్మద్ షమిని  సెలక్ట్ చేయకపోవడంపై గంగూలీ సీరియస్ | ABP Desam
Chinnaswamy Stadium RCB | 2026లో  చిన్నస్వామి స్టేడియంపై బ్యాన్‌లో నో ఐపీఎల్ | ABP Desam
Ind vs SA | టాస్ కాయిన్ మార్చాలని డిసైడ్ అయిన బెంగాల్ క్రికెట్ అససియేషన్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CII Partnership Summit 2025 : భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
Kondagattu Temple: కనీస సౌకర్యాల్లేవ్ ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  
కనీస సౌకర్యాల్లేవ్ ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  
Delhi Bomb Blast : ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు- ప్రత్యేక కోడ్ నేమ్‌లతో సిరియల్ పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం!
ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు- ప్రత్యేక కోడ్ నేమ్‌లతో సిరియల్ పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం!
Official Apology : క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 
క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 
Globetrotter Main Cast: ఎమోజీల్లో SSMB29 కథ చెప్పిన ప్రియాంక... మహేష్ సింహమే - మరి మిగతా క్యారెక్టర్లు ఎవరు?
ఎమోజీల్లో SSMB29 కథ చెప్పిన ప్రియాంక... మహేష్ సింహమే - మరి మిగతా క్యారెక్టర్లు ఎవరు?
Chiranjeevi - Ram Charan: సక్సెస్‌ ట్రాక్‌లోకి చిరు - చరణ్... వైరల్ సాంగ్స్‌తో మెగా ఫ్యాన్స్ హ్యాపీ
సక్సెస్‌ ట్రాక్‌లోకి చిరు - చరణ్... వైరల్ సాంగ్స్‌తో మెగా ఫ్యాన్స్ హ్యాపీ
Anirudh Ravichander Kavya Maran: కావ్య మార‌న్‌తో అనిరుధ్ సీక్రెట్‌ ట్రిప్‌... ఇలా దొరికేశారేంటి?
కావ్య మార‌న్‌తో అనిరుధ్ సీక్రెట్‌ ట్రిప్‌... ఇలా దొరికేశారేంటి?
Mancherial Crime News: మంచిర్యాల జిల్లాలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
మంచిర్యాల జిల్లాలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
Embed widget