అన్వేషించండి

Telugu breaking News: తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య

Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

LIVE

Key Events
Telugu breaking News: తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య

Background

Latest Telugu breaking News: టీమిండియా సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma), లోకల్‌ బాయ్‌ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) శతక గర్జన చేయడంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును రోహిత్‌, రవీంద్ర జడేజా అద్భుత శతకాలతో ఆదుకుని పటిష్ట స్థితిలో నిలిపారు. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ అర్ధశతకంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.  దురదృష్టవశాత్తు సర్ఫరాజ్‌ రనౌట్‌ అయినా... సాధికార బ్యాటింగ్‌తో తన ఎంపిక సరైందేనని నిరూపించుకున్నాడు. మూడో టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా అయిదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా.. కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నారు. 
 
ఆరంభంలో షాక్‌ మీద షాక్‌లు
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకోగా రోహిత్‌శర్మ, గత మ్యాచ్‌ హీరో ।యశస్వీ  జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. అలా ఆట అరంభమైందో లేదో నాలుగో ఓవర్‌లోనే యశస్వి జైస్వాన్‌ అవుటయ్యాడు. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి యశస్వి అవుటయ్యాడు. దీంతో టీమిండియా 22 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత 24 పరుగుల వద్ద శుభ్‌మన్‌ గిల్‌ డకౌట్‌ అయ్యాడు. మార్క్‌ వుడ్‌ వేసిన ఓవర్‌లో గిల్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి కీపర్‌ చేతిలో పడింది. తొమ్మిది బంతులు ఆడిన గిల్‌ ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్‌ చేరాడు. అనంతరం టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. హార్ట్‌ లీ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి రజత్‌ పాటిదార్‌ అవుటయ్యాడు. కేవలం అయిదు పరుగులే చేసి రజత్‌ పాటిదార్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.
 
రోహిత్‌-జడేజా శతక మోత
33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను రోహిత్ శర్మ- రవీంద్ర జడేజా ఆదుకున్నారు. హిట్ మ్యాన్‌ తన సహజశైలికి విరుద్ధంగా ఆచితూచి ఆడాడు. ఆరంభంలో రోహిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఫస్ట్‌ స్లిప్‌లో రూట్‌ వదిలేశాడు. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న రోహిత్‌ శర్మ అద్భుత శతకంతో భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. 157 బంతుల్లో రోహిత్‌ శర్మ శతకాన్ని అందుకున్నాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది పదకొండో సెంచరీ కావడం గమనార్హం. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ శర్మ 131 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో రోహిత్‌- జడేజా 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 237 పరుగుల వద్ద రోహిత్ అవుటవ్వడంతో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 
 
జడేజా-సర్ఫరాజ్ జోరు
అనంతరం జడేజాతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ జత కలిశాడు. వీరిద్దరూ వేగంగా పరుగులు తీస్తూ ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ క్రమంలో సొంత మైదానంలో జడేజా శతకంతో మెరిశాడు. 198 బంతుల్లో రవీంద్ర జడేజా సెంచరీ చేసి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. టెస్టుల్లో జడేజాకు ఇది నాలుగో సెంచరీ. సర్ఫరాజ్‌ కూడా ఆడిన తొలి టెస్ట్‌లోనే అర్ధ శతకం సాధించి సత్తా చాటాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో సర్ఫరాజ్‌  హాఫ్‌ సెంచరీ చేశాడు. అనంతరం సింగిల్‌ కోసం ప్రయత్నిస్తూ రనౌట్‌ అయ్యాడు. అనంతరం కుల్‌దీప్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు. మూడో టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా అయిదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా.. కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నారు.
20:00 PM (IST)  •  16 Feb 2024

రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ మృతి

మాస్కో: రష్యాలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) మృతిచెందారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన నేత నావల్నీ(47) జైలులో శుక్రవారం మృతిచెందినట్లు సమాచారం. గతంలో అలెక్సీ నావల్నీపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 19 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నావల్నీ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆర్కిటిక్‌ ప్రిజన్ కాలనీలో నావల్నీ చనిపోయారని రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  

19:10 PM (IST)  •  16 Feb 2024

తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య

హైదరాబాద్‌: తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్‌ మాలోత్‌, ఎం.రమేశ్‌లను ప్రభుత్వం నియమించింది. తాజాగా నియమితులైన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. 

19:06 PM (IST)  •  16 Feb 2024

కులగణన తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం

కులగణన తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన సభలో శుక్రవారం తీర్మానం ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ జరిగిన తరువాత.. కులగణన కోసం బిల్లు తీసుకువస్తే తమ పార్టీ మద్దతిస్తుందని బీఆర్ఎస్ సభ్యులు స్పష్టం చేశారు.

13:38 PM (IST)  •  16 Feb 2024

IND vs ENG 3rd Test Live Score: రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ 445 పరుగులకు అలౌట్

IND vs ENG 3rd Test Live Score: రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది ఆదిలోనే 3 వికెట్లు త్వరగా కోల్పోయిన రోహిత్, జడేజా, సర్పరాజ్‌ఖాన్ నిలకడైన ఆటతో భారత్ భారీ టార్గెట్‌ను ఇంగ్లండ్ ముందు ఉంచింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా 112 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 62, ధ్రువ్ జురెల్ 46, రవిచంద్రన్ అశ్విన్ 37 పరుగులు చేశారు. చివర్లో జస్ప్రీత్ బుమ్రా 28 బంతుల్లో 26 పరుగులు చేశాడు. బుమ్రా మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా, రెహాన్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ, జో రూట్ తలో వికెట్ తీశారు.

11:39 AM (IST)  •  16 Feb 2024

400చేరువలో భారత్ స్కోర్‌

రెండో రోజు తొలి సెషన్ మిశ్రమంగా సాగింది. దీంతో టీమిండియా 27 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా 112, కుల్దీప్ యాదవ్ 04 పరుగులు చేశారు. ఆ తర్వాత ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్ 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్ ఒక వికెట్, జేమ్స్ అండర్సన్ ఒక వికెట్ తీశారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
Thangalaan : విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?
విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?
Andhra Pradesh: చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Pawan Kalyan: “ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
“ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
Embed widget