Telugu breaking News: తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్గా సిరిసిల్ల రాజయ్య
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE

Background
రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ మృతి
మాస్కో: రష్యాలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) మృతిచెందారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన నేత నావల్నీ(47) జైలులో శుక్రవారం మృతిచెందినట్లు సమాచారం. గతంలో అలెక్సీ నావల్నీపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 19 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నావల్నీ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో నావల్నీ చనిపోయారని రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్గా సిరిసిల్ల రాజయ్య
హైదరాబాద్: తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్గా కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా సంకేపల్లి సుధీర్రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్, ఎం.రమేశ్లను ప్రభుత్వం నియమించింది. తాజాగా నియమితులైన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు.
కులగణన తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం
కులగణన తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన సభలో శుక్రవారం తీర్మానం ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ జరిగిన తరువాత.. కులగణన కోసం బిల్లు తీసుకువస్తే తమ పార్టీ మద్దతిస్తుందని బీఆర్ఎస్ సభ్యులు స్పష్టం చేశారు.
IND vs ENG 3rd Test Live Score: రాజ్కోట్లో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ 445 పరుగులకు అలౌట్
IND vs ENG 3rd Test Live Score: రాజ్కోట్లో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది ఆదిలోనే 3 వికెట్లు త్వరగా కోల్పోయిన రోహిత్, జడేజా, సర్పరాజ్ఖాన్ నిలకడైన ఆటతో భారత్ భారీ టార్గెట్ను ఇంగ్లండ్ ముందు ఉంచింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా 112 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 62, ధ్రువ్ జురెల్ 46, రవిచంద్రన్ అశ్విన్ 37 పరుగులు చేశారు. చివర్లో జస్ప్రీత్ బుమ్రా 28 బంతుల్లో 26 పరుగులు చేశాడు. బుమ్రా మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా, రెహాన్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ, జో రూట్ తలో వికెట్ తీశారు.
400చేరువలో భారత్ స్కోర్
రెండో రోజు తొలి సెషన్ మిశ్రమంగా సాగింది. దీంతో టీమిండియా 27 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా 112, కుల్దీప్ యాదవ్ 04 పరుగులు చేశారు. ఆ తర్వాత ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్ 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్ ఒక వికెట్, జేమ్స్ అండర్సన్ ఒక వికెట్ తీశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

