అన్వేషించండి

ఢిల్లీలోని ఇజ్రాయేల్‌ ఎంబసీ వద్ద పేలుడు,ఉగ్రదాడి కోణంలో NIA విచారణ

Israel Embassy Blast: ఢిల్లీలోని ఇజ్రాయేల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటనపై NIA విచారణ జరుపుతోంది.

Blast Israel Embassy:


ఎంబసీ వద్ద పేలుడు..

ఢిల్లీలోని ఇజ్రాయేల్ ఎంబసీ వద్ద పేలుడు (Attack on Israel Embassy) ఘటన అలజడి సృష్టించింది. ఇది కచ్చితంగా ఉగ్రదాడే అని ఇజ్రాయేల్ ఇప్పటికే తేల్చి చెప్పింది. భారత్‌లో ఉన్న ఇజ్రాయేల్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మార్కెట్‌లతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరగొద్దని చెప్పింది. ఇజ్రాయేల్‌ దేశానికి సంబంధించిన చిహ్నాలనూ ఎక్కడా ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్ట్‌లు పెట్టకూడదని చెప్పింది. డిసెంబర్ 26న సాయంత్రం చాణక్యపురిలో ఉన్న ఎంబసీ వద్ద ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు సంభవించిన ప్రాంతానికి సమీపంలోనే ఓ లెటర్ దొరికింది. ఇజ్రాయేల్ అంబాసిడర్‌ని తిడుతూ ఆ లేఖ రాశారు. ఘటనా స్థలానికి ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌తో పాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ చేరుకుని అన్ని విధాలుగా పరిశీలించింది. National Investigation Agency సిబ్బంది కూడా అన్ని విధాలుగా దర్యాప్తు మొదలు పెట్టింది. NIAతో పాటు NSG కమాండోలు, ఫోరెన్సిక్ టీమ్‌, డాగ్ స్క్వాడ్‌ కూడా విచారణకు సహకరిస్తోంది. పోలీస్ టీమ్స్‌తో పాటు Canine Unit విచారణ జరుపుతోంది. ప్రాథమికంగా ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం తెలియకపోయినా...జెండాలో పెట్టి ఉన్న లెటర్‌ని మాత్రం స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఇజ్రాయేల్ విదేశాంగ మంత్రి స్పందించారు. ఈ ఘటనలో ఎంబసీలోని సిబ్బంది ఎవరూ గాయపడలేదని ధ్రువీకరించారు. ఇజ్రాయేల్ సెక్యూరిటీ ఫోర్సెస్ విచారణకు పూర్తి సహకారం అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. 

 

గాజాపై ఎయిర్‌ స్ట్రైక్‌ల తీవ్రతను (Israel Hamas War) అంతకంతకూ పెంచుతోంది ఇజ్రాయేల్ సైన్యం. ఇప్పటికే గాజా (Attack on Gaza) పూర్తిగా ధ్వంసమైంది. బిల్డింగ్‌లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్లిపోతున్నారు. అక్టోబర్ 7న హమాస్ దాడులతో మొదలైన ఈ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. అయితే...హమాస్‌ని అంతం చేయడానికి ఇజ్రాయేల్ "Dumb Bombs"ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నట్టు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. అమెరికా చెందిన Director of National Intelligence ఆఫీస్ ఈ రిపోర్ట్‌ని విడుదల చేసింది. CNN వెల్లడించిన వివరాల ప్రకారం...ఇజ్రాయేల్ చేసిన దాడుల్లో 45% మేర ఎయిర్‌ స్ట్రైక్స్‌ ఉన్నాయి. ఇందుకోసం దాదాపు 29 వేల ఆయుధాలను వినియోగించింది. అయితే..ఈ దాడుల తీవ్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారీ మొత్తంలో ప్రాణనష్టం నమోదయ్యే ప్రమాదముందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే గాజాపై ఇలాంటి దాడులు చేయడం వల్ల ఎక్కువ మంది పౌరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Rahul Met Wrestlers: రెజ్లర్లకు మద్దతు తెలిపిన రాహుల్‌ గాంధీ-బజరంగ్‌ పునియాతో సరదాగా రెజ్లింగ్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget