అన్వేషించండి

Bilkis Bano Case: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు, బిల్కిస్ బానో కేసు విచారణ

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసుని విచారించిన సుప్రీం కోర్టు..దోషులను విడుదల చేయటంపై గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

Bilkis Bano Case:

సమగ్ర విచారణ అవసరం: సుప్రీం కోర్టు 

బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయటానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. అంతే కాదు. గుజరాత్ ప్రభుత్వం ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను ఆగస్టు 15వ తేదీన విడుదల చేశారు. దీనిపై ఇంకా రగడ కొనసాగుతూనే ఉంది. ఇది అనుచిత నిర్ణయం అని భాజపాపై అందరూ విమర్శలు ఎక్కు పెడుతున్నారు. అటు బాధితురాలు బిల్కిస్ బానో కూడా ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కూడా. అయితే..ఇప్పుడు ఈ కేసు సుప్రీం కోర్టుకు గడప తొక్కింది. 11 మంది దోషుల విడుదలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ అంశాన్ని విచారించనున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. దోషుల విడుదలను రద్దు చేయాలని కోరుతూ..మహిళా హక్కుల కార్యకర్తలు రేవతి లౌల్, సుభాషిణి అలీ, రూపా రేఖా వర్మలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.  సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ హిమా కోహ్లీ, జ‌స్టిస్ సీటీ ర‌వికుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించ‌నుంది. సీనియ‌ర్ అడ్వ‌కేట్ క‌పిల్ సిబాల్‌, అడ్వ‌కేట్ అప‌ర్ణా భ‌ట్‌లు ఈ కేసు వాదించ‌నున్నారు. 

భాజపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇప్పటికే  వాళ్లను విడుదల చేయటంపై దుమారం రేగుతుండగా..ఇప్పుడు మరో విషయం ఈ వివాదాన్ని మరింత సంక్లిష్టం చేసింది. గుజరాత్ భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. "ఈ కేసులో దోషులైన వారిలో కొందరు బ్రాహ్మణులు ఉన్నారు. వారెంతో సంస్కార వంతులు. బహుశా వారి ముందు తరం వాళ్లు చేసిన తప్పులకు వీళ్లు శిక్ష అనుభవిస్తున్నారేమో" అని గోద్రా ఎమ్మేల్యే సీకే రౌల్జీ వ్యాఖ్యానించారు. ఆ 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని ప్రతిపాదించిన వారిలో ఈ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. "15 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన వీళ్లు అసలు ఆ నేరం చేశారా లేదా అన్నది నాకు తెలియదు. మేం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే నడుచుకున్నాం. 
వాళ్ల ప్రవర్తనను గమనించి, నిర్ణయం తీసుకోవాలని మాకు సుప్రీం కోర్టు సూచించింది" అని రౌల్జీ పీటీఐతో చెప్పారు. వాళ్లను విడుదల చేసే ముందు జైలర్‌తో మాట్లాడమని అన్నారు. ఆ సమయంలోనే వారి సత్ప్రవర్తన గురించి తెలిసిందని వెల్లడించారు. వాళ్లలో కొందరు బ్రాహ్మణులు ఉన్నారని, ఎంతో సంస్కారవంతులు అని జైలర్ చెప్పినట్టు రౌల్జీ వివరించారు. "సాధారణంగా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు, 
ఎలాంటి సంబంధం లేని వాళ్ల పేర్లు కూడా తెరపైకి వస్తాయి. బహుశా వీరి ముందు తరం వాళ్లు చేసిన తప్పుల వల్ల వీరిపై అభియోగాలు వచ్చి ఉండొచ్చు. వాళ్లు నేరం చేశారా లేదా అన్నది తెలియదు కానీ..వాళ్ల ప్రవర్తన ఆధారంగానే విడుదల చేశాం" అని రౌల్జీ స్పష్టం చేశారు. 

Also Read: Pegasus Row: ఆ ఫోన్లు పెగాసస్‌కు గురైనట్టు ఆధారాల్లేవు, సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Also Read: తెలుగు కవులకు కేంద్ర సాహిత్య పురస్కారం-2022

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget