అన్వేషించండి

Stubble Management: పొలాల్లో గడ్డి కాల్చితే ఒక్క గింజ కూడా కొనం, రైతులకు బిహార్ ప్రభుత్వం వార్నింగ్

Stubble Management: పొలాల్లో గడ్డి కాల్చితే ధాన్యం కొనుగోలు చేయమని రైతులకు బిహార్ ప్రభుత్వం హెచ్చరించింది.

Bihar Stubble Management:

ఖరీఫ్ మీటింగ్‌లో నిర్ణయం..

వరికి మద్దతు ధర కోసం పలు రాష్ట్రాల్లో నిరసనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి రైతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సవాలుతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు వరి గడ్డిని కాల్చడం మరో పెద్ద సవాలుగా మారింది. అలా చేయడం వల్ల  వాతావరణం కలుషితమవుతోందని చెబుతున్నా..వాళ్లు వినడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్, హరియాణాల్లో వరి పంట కోత అయ్యాక...పొలాల్లోనే గడ్డిని కాల్చడం వల్ల ఢిల్లీ ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతోందో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే..బిహార్ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. "మేము పంట పొలాల్లో గడ్డిని కాల్చం" అని రైతులు లిఖిత 
పూర్వకంగా హామీ ఇస్తేనే...ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తుందని స్పష్టం చేసింది. ఖరీఫ్ మీటింగ్‌లో భాగంగా...ధాన్యాలు పండించి విక్రయించే రైతులందరికీ కొన్ని మార్గదర్శకాలు చేసింది. రైతులు గడ్డి కాల్చమని కచ్చితంగా చెప్పి, ఆ నిబంధనను అనుసరిస్తేనే కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్ వరిని కొనుగోలు చేస్తుందని వెల్లడించింది. ఈ మేరకు బిహార్‌లోని అన్ని జిల్లాల మెజిస్ట్రేట్‌లకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. రైతులెవరూ పంట పొలాల్లో గడ్డి కాల్చకుండా చూడాలని తేల్చి చెప్పింది. ఇందుకోసం జిల్లాల వారీగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఇన్ని చెప్పినా మళ్లీ రైతులు అదే తీరుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం...బిహార్‌లో పాట్నా, భేజ్‌పూర్, నలంద, బుక్సర్, రోహ్‌తస్, కైమూర్ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా గడ్డి కాల్చుతున్నారు. ఇక్కడే 83% మేర కేసులు నమోదయ్యాయి. 

హరియాణాలో గడ్డికి మద్దతు ధర..? 

హరియాణా ప్రభుత్వం...గడ్డికి కనీస మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. హరియాణా వ్యవసాయ మంత్రి జేపీ దలాల్ ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి గడ్డిని కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే కమిటీని నియమించిన ప్రభుత్వం...ఆ సభ్యుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంది. ఆ సలహాల మేరకు గడ్డిని డిస్పోస్ చేసే విధానాలపై మేధోమథనం సాగిస్తున్నారు. వీటికి ఎంత మద్దతు ధర ఇవ్వాలనేదీ నిర్ణయించనున్నారు. దీంతో పాటు రైతుల్లో అవగాహన పెంచే చర్యలనీ చేపడుతోంది హరియాణా ప్రభుత్వం. ఇప్పటికే రైతులకు 80 వేల సూపర్ సీడర్స్ యంత్రాలను అందజేసింది. పంట పొలాల్లో గడ్డి కాల్చకుండా ఉండాలని చెబుతోంది. ఈ నిబంధన పాటించిన రైతులకు హెక్టార్‌కు రూ.1000 చొప్పున నగదు ప్రోత్సాహకాన్నీ అందజేయనుంది. ఈ చర్యలతో గతేడాది కన్నా ఈ సారి హరియాణాలో "గడ్డి కాల్చుతున్న" ఘటనలు తగ్గిపోయాయి. ఇది పూర్తి స్థాయిలో నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది హరియాణా.

Also Read: Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల ప్రచారానికి మోడీ మాస్టర్ ప్లాన్, అక్కడి నుంచే మొదలు పెడతారట

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి

వీడియోలు

India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
6 అడుగుల ఆజానుబాహులకు బెస్ట్‌ ఆప్షన్లు - కంఫర్ట్‌తో పాటు రైడింగ్‌ ఫన్‌ ఇచ్చే మోటార్‌సైకిళ్లు!
6 అడుగులకు పైగా ఎత్తున్న 30+ ఏజ్‌ వాళ్లకు బెస్ట్‌ బైక్‌లు - సిటీ రోడ్లకు చక్కగా సరిపోతాయి!
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
Embed widget