అన్వేషించండి

అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం, ముస్లిం వివాహాల చట్టం రద్దు - త్వరలోనే ప్రకటన

Muslim Marriage Act: ముస్లిం వివాహాల చట్టాన్ని రద్దు చేసేందుకు అసోం ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Assam Muslim Marriage Act: అసోం ప్రభుత్వం త్వరలోనే సంచలన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో Assam Muslim Marriage and Divorce Registration Act 1935 చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 23న జరిగిన ఈ భేటీలో ఈ చట్టం గురించి చర్చ రాగా...దీన్ని రద్దు చేయడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటికే Uniform Civil Code (UCC) అమలుకు సిద్ధమవుతున్న అసోం ప్రభుత్వం...అందులో భాగంగానే ముస్లిం వివాహాల చట్టాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. అసోం మంత్రి జయంత మల్లా బరువా మీడియాకి ఈ విషయం వెల్లడించారు. యూసీసీ అమలులో ఇది మొదటి అడుగు అని స్పష్టం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో 94 మంది ముస్లిం రిజిస్ట్రార్‌లు అసోం ముస్లిం మ్యారేజ్ యాక్ట్‌ కింద వివాహాల రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, విడాకులూ ఇక్కడే జరుగుతున్నాయని తెలిపారు. 

"అసోంలో యూసీసీ అమలులో భాగంగా ఇది మొదటి అడుగు. అసోం ముస్లిం మ్యారేజ్ అండ్ డైవర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించుకుంది. వీలైనం త్వరలో ఈ రద్దు అమల్లోకి వస్తుంది. ఇప్పటికీ 94 మంది ముస్లిం రిజిస్ట్రార్‌లు ఇప్పటికీ ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు. కాలం చెల్లిన ఈ చట్టమే ఇంకా కొనసాగుతోంది. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి చట్టం ఇది. కానీ..ఇకపై ఈ చట్టం పరిధిలో ఎలాంటి వివాహాలు, విడాకులు రిజిస్టర్ కావు. ఇకపై అన్ని వివాహాల రిజిస్ట్రేషన్‌లు Special Marriage Act 1954 ప్రకారమే జరుగుతాయి"

- జయంత మల్లా, అసోం మంత్రి

ఇప్పటికీ ఆ పాత చట్టం పరిధిలోనే వివాహాలు రిజిస్టర్ చేస్తున్న వాళ్లని జిల్లా కమిషనర్‌లు అదుపులోకి తీసుకుంటారని మంత్రి జయంత మల్లా స్పష్టం చేశారు. వాళ్లకి రూ.2 లక్షల పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం బాల్య వివాహాలను అడ్డుకునేందుకే ఈ పాత చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేస్తోంది. 

యునిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలుకు అసోం ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో ఈ చట్టానికి ఆమోదం లభించింది. అయితే ఎలా అమలు చేయాలన్న అంశంపై మేధోమథనం చేస్తోంది అసోం ప్రభుత్వం. ఉత్తరాఖండ్‌ చట్టాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే కేబినెట్‌లో దీనిపై చర్చ జరిగినట్టు ఓ మంత్రి వెల్లడించారు. కానీ...అమలుపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో యూసీసీపైనే ఎక్కువగా చర్చ జరిగింది. అసోం ప్రభుత్వం ఈ చట్టం తీసుకొస్తే...ఆ పరిధిలో నుంచి గిరిజనులను తొలగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా సందర్భాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ యూసీసీపై మాట్లాడారు. తమ ప్రభుత్వం కూడా కచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేస్తుందని, గిరిజనులను మాత్రం ఇందులో చేర్చమని స్పష్టం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Nikhil Maliyakkal - Chinni Serial: 'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
Indira Mahila Shakti: కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
Donald Trump: ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మూడో ప్రపంచ యుద్ధం రావడం కన్ఫామ్: డొనాల్డ్ ట్రంప్
ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మూడో ప్రపంచ యుద్ధం రావడం కన్ఫామ్: డొనాల్డ్ ట్రంప్
AP News: ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
Embed widget