అన్వేషించండి

Asaduddin Owaisi Attack: ఓవైసీకి Z కేటగిరీ భద్రతను కల్పించిన కేంద్ర ప్రభుత్వం

ఓవైసీకీ కేంద్రం Z కేటగిరీ సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీని కల్పించింది. ఓవైసీపై నిన్న దాడి జరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భారత ప్రభుత్వం భద్రతను పెంచింది. ఓవైసీకి Z కేటగిరీ సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీని కల్పించింది. ఓవైసీ కారుపై నిన్న దుండగులు కాల్పులు జరిపడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన భద్రతపై సమీక్ష నిర్వహించి Z కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది.

ఏం జరిగింది?

ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద ఆయన కారుపై 3-4 రౌండ్లు బుల్లెట్ల కాల్పులు జరిపారు.

యూపీ మేరట్‌లోని కిథౌర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొని నేను దిల్లీకి వెళ్తోన్న సమయంలో నా వాహనంపై 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు. మొత్తం నలుగురు వ్యక్తులు గుంపుగా వచ్చారు. ఇద్దరు కాల్పులు చేశారు. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. దీంతో నేను మరో వాహనంలో వెళ్లిపోయాను.                                                     "

-అసదుద్దీన్ ఓవైసీ, ఏఐఎమ్ఐఎమ్ అధినేత

ఉత్తర్‌ప్రదేశ్ మేరట్‌లో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొని దిల్లీ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

దర్యాప్తునకు విజ్ఞప్తి..

కాల్పుల ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత మోదీ, యూపీ ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ విషయంపై లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాను కూడా కలుస్తానన్నారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరిని అరెస్ట్​ చేశామని పోలీసులు తనకు చెప్పినట్లు ఓవైసీ పేర్కొన్నారు. అతని నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

ఇదంతా డ్రామా..

ఓవైసీపై జరిగిన దాడిపై యూపీ భాజపా కీలక వ్యాఖ్యలు చేసింది. సానుభూతి కోసమే ఓవైసీ ఈ దాడి చేయించుకుని ఉంటారని ఆరోపించింది. ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకే ఈ డ్రామా చేసినట్లు విమర్శించింది. అయితే ఈ వ్యాఖ్యలను ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేసి ఎవరు డ్రామాలు ఆడుతున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు.

Also Read: CM Channi Nephew Arrest: పంజాబ్ సీఎం చన్నీకి ఈడీ షాక్.. మేనల్లుడు భూపేందర్ సింగ్ అరెస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP DesmBr Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP DesamAP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP DesamMegastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Ind Vs Eng Odi Series Clean Sweap:  సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
Telangana News:తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
APPSC Group -II: గ్రూప్- 2 అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్ హాల్‌టికెట్స్‌ వచ్చేస్తున్నాయి
APPSC Group -II: గ్రూప్- 2 అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్ హాల్‌టికెట్స్‌ వచ్చేస్తున్నాయి
Pawan Kalyan Temple Tour: అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర
అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర
Embed widget