అన్వేషించండి

APSRTC : ఏపీఎస్ఆర్టీసీకి కలిసొచ్చిన సంక్రాంతి పండుగ.. రూ.12 కోట్ల ఆదాయంతో రికార్డ్ కలెక్షన్‌లు

APSRTC : ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగకు స్పెషల్ బస్సులు నడుపుతుండగా.. వీటి ద్వారా ఇప్పటివరకు రూ.12కోట్ల ఆదాయం వచ్చిందని యాజమాన్యం తెలిపింది.

APSRTC : సంక్రాంతి(Sankranthi) పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ - ఏపీఎస్ఆర్టీసీ (Andhra Pradesh State Road Transport Corporation) 7,200 ప్రత్యేక బస్సులు నడిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆర్టీసీ యాజమాన్యం (RTC Management) వెల్లడించింది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులో దాదాపుగా 4లక్షల మంది ప్రయాణించినట్టు తెలిపింది. కనుమ(Kanuma)తో సంక్రాంతి పండుగ సంబురాలు పూర్తయినప్పటికీ.. చాలా మంది ఇంకా తిరుగు ప్రయాణం చేయలేదు. అందులోనూ వీకెండ్ దగ్గరగా ఉండడంతో సెలవుల్లో కుటుంబంతో గడుపుతున్నారు. ఇక తిరుగుప్రయాణాలు ప్రారంభం కాకపోవడంతో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏపీఎస్ఆర్టీసీ నడిపిన 7200 బస్సుల్లో 2153 బస్సులు హైదరాబాద్(Hyderabad) నుంచే ఉండడం గమనార్హం.

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) స్పెషల్ బస్సులు వేసింది. జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు(Special Buses) నడపనున్నట్టు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. తిరుగు ప్రయాణం చేసే వారికి అనుకూలంగా 3200 అదనపు బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ తెలిపింది. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జీలు(Extra Charges) వసూలు చేయమని చెప్పడం చెప్పుకోదగిన విషయం. అంతే కాకుండా పలు బస్సుల్లో ప్రత్యేక ఆఫర్లను సైతం ప్రకటించారు. ఇరువైపులా ప్రయాణానికి ఒకేసారి టిక్కెట్లు బుక్ చేసుకుంటే మొత్తం ఛార్జీలో 10శాతం రాయితీ ఇస్తామని చెప్పారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో ప్రధానమైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Journey). కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినప్పటికీ దీనిపై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మార్చి 8న మహిళా దినోత్సవం (Women's Day) నుంచి అమలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో జరిగే కేబినెట్ భేటీలో క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలపై చర్చించి.. అమలు తేదీలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వంపై రూ. 277 కోట్లకు పైగా భారం 

ఏపీ ప్రభుత్వం తీసుకురాబోయే ఈ కొత్త పథకం ద్వారా రోజుకు దాదాపు 20 లక్షల మందికిపైగా మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వలన ప్రభుత్వంపై నెలకు రూ. 277 కోట్ల అదనపు భారం పడుతుందని అంటున్నారు. అందుకోసం అటు ప్రయాణికులపై భారం పడకుండా ఉన్న నిధుల్లోనే వీటిని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కర్ణాటకలోనూ ఈ తరహా పథకం అమలవుతున్నప్పటికీ నష్టాలు పూడ్చుకునేందుకు బస్సు ఛార్జీలను 15% పెంచుతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటికైతే ఏపీలో బస్సు ఛార్జీలు అధికంగా ఉన్నందున ఛార్జీల పెంపు ఉండకపోవచ్చని వాదన వినిపిస్తోంది. 

Also Read : Free Bus Scheme in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎప్పటి నుంచో తెలుసా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Everest Masala : ఎవరెస్ట్ మసాలాల్లో నాణ్యత సమస్యలు? పురుగుల మందులు, ఎంటెరోబాక్టీరియా గుర్తింపు
ఎవరెస్ట్ మసాలాల్లో నాణ్యత సమస్యలు? పురుగుల మందులు, ఎంటెరోబాక్టీరియా గుర్తింపు
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. అనర్హత పిటిషన్లు కొట్టివేత
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. అనర్హత పిటిషన్లు కొట్టివేత
LPG Cylinder Truck Theft: ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
Embed widget