అన్వేషించండి

APSRTC : ఏపీఎస్ఆర్టీసీకి కలిసొచ్చిన సంక్రాంతి పండుగ.. రూ.12 కోట్ల ఆదాయంతో రికార్డ్ కలెక్షన్‌లు

APSRTC : ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగకు స్పెషల్ బస్సులు నడుపుతుండగా.. వీటి ద్వారా ఇప్పటివరకు రూ.12కోట్ల ఆదాయం వచ్చిందని యాజమాన్యం తెలిపింది.

APSRTC : సంక్రాంతి(Sankranthi) పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ - ఏపీఎస్ఆర్టీసీ (Andhra Pradesh State Road Transport Corporation) 7,200 ప్రత్యేక బస్సులు నడిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆర్టీసీ యాజమాన్యం (RTC Management) వెల్లడించింది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులో దాదాపుగా 4లక్షల మంది ప్రయాణించినట్టు తెలిపింది. కనుమ(Kanuma)తో సంక్రాంతి పండుగ సంబురాలు పూర్తయినప్పటికీ.. చాలా మంది ఇంకా తిరుగు ప్రయాణం చేయలేదు. అందులోనూ వీకెండ్ దగ్గరగా ఉండడంతో సెలవుల్లో కుటుంబంతో గడుపుతున్నారు. ఇక తిరుగుప్రయాణాలు ప్రారంభం కాకపోవడంతో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏపీఎస్ఆర్టీసీ నడిపిన 7200 బస్సుల్లో 2153 బస్సులు హైదరాబాద్(Hyderabad) నుంచే ఉండడం గమనార్హం.

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) స్పెషల్ బస్సులు వేసింది. జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు(Special Buses) నడపనున్నట్టు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. తిరుగు ప్రయాణం చేసే వారికి అనుకూలంగా 3200 అదనపు బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ తెలిపింది. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జీలు(Extra Charges) వసూలు చేయమని చెప్పడం చెప్పుకోదగిన విషయం. అంతే కాకుండా పలు బస్సుల్లో ప్రత్యేక ఆఫర్లను సైతం ప్రకటించారు. ఇరువైపులా ప్రయాణానికి ఒకేసారి టిక్కెట్లు బుక్ చేసుకుంటే మొత్తం ఛార్జీలో 10శాతం రాయితీ ఇస్తామని చెప్పారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో ప్రధానమైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Journey). కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినప్పటికీ దీనిపై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మార్చి 8న మహిళా దినోత్సవం (Women's Day) నుంచి అమలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో జరిగే కేబినెట్ భేటీలో క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలపై చర్చించి.. అమలు తేదీలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వంపై రూ. 277 కోట్లకు పైగా భారం 

ఏపీ ప్రభుత్వం తీసుకురాబోయే ఈ కొత్త పథకం ద్వారా రోజుకు దాదాపు 20 లక్షల మందికిపైగా మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వలన ప్రభుత్వంపై నెలకు రూ. 277 కోట్ల అదనపు భారం పడుతుందని అంటున్నారు. అందుకోసం అటు ప్రయాణికులపై భారం పడకుండా ఉన్న నిధుల్లోనే వీటిని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కర్ణాటకలోనూ ఈ తరహా పథకం అమలవుతున్నప్పటికీ నష్టాలు పూడ్చుకునేందుకు బస్సు ఛార్జీలను 15% పెంచుతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటికైతే ఏపీలో బస్సు ఛార్జీలు అధికంగా ఉన్నందున ఛార్జీల పెంపు ఉండకపోవచ్చని వాదన వినిపిస్తోంది. 

Also Read : Free Bus Scheme in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎప్పటి నుంచో తెలుసా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
FOMO: వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Embed widget