AP Telangana Today Updates: గాంధీ ఆసుపత్రిలో దారుణం... అక్కా, చెల్లెళ్లను గదిలో బంధించి అత్యాచారం!
గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. అక్కా, చెల్లెళ్లను గదిలో బంధించి అత్యాచారం చేశారని చిలకలగూడ పోలీసు స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు.

Background
తెలంగాణలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవం ఇవాళ (ఆగస్టు 16) అధికారికంగా జరగనుంది. హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరోవైపు నేటి నుంచి ఏపీలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పాఠశాలలను విద్యార్థులకు అంకితం చేయనున్నారు.
గాంధీ ఆసుపత్రిలో దారుణం.. అక్కా, చెల్లెళ్లపై ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం!
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఉమామహేశ్వర్రావు అనే ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం చేసినట్టు బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బావ చికిత్స కోసం వచ్చిన అక్కచెల్లెళ్లను గదిలో బంధించి మత్తు ఇచ్చి నాలుగు రోజులుగా అత్యాచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేసిన బాధితురాలు. గది నుంచి తప్పించుకున్న చెల్లి, అక్క ఆచూకీ ఇంకా తెలియాల్సిఉంది.
టీఎంసీలో చేరిన సుస్మితా దేవ్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ.. అంతలోనే మరో కండువా
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సుష్మితా దేవ్ టీఎంసీలో చేరిపోయారు. అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రెయిన్ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించిన సుష్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె బీజేపీలో చేరతారని తొలుత ప్రచారం జరిగింది. నేటి ఉదయం రాజీనామా లేఖను పంపిన ఆమె మధ్యాహ్నం టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.
Kolkata, West Bengal: Sushmita Dev, who resigned from Congress today, joins TMC in the presence of party leaders Abhishek Banerjee and Derek O'Brien. pic.twitter.com/4KFNVKm3V8
— ANI (@ANI) August 16, 2021





















