అన్వేషించండి

AP News: ఇంధన పొదుపు రాష్ట్రంగా ఏపీ, నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు ఆదా

AP News: ఇంధన పొదుపు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా అవతరించింది. ఇంధన సంరక్షణ చర్యలతో నాలుగేళ్లలో రూ. 4 వేల కోట్లు ఆదా చేసింది.

AP News: ఇంధన పొదుపు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా అవతరించింది. ఇంధన సంరక్షణ, సామర్థ్య చర్యలు అమలు చేయడం ద్వారా రూ. 4 వేల కోట్లకు పైగా ఆదా చేసింది. గత నాలుగు నుండి ఐదేళ్లలో ఇంధన శాఖ పొదుపు చర్యల ద్వారా రూ.4,088 కోట్ల విలువైన సుమారు 5600 మిలియన్ యూనిట్ల(MU) విద్యుత్ ను ఆదా చేసింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం డిమాండ్ 66 వేల మిలియన యూనిట్లలో 25 శాతం ఆదా చేయగలదు. రాష్ట్ర ఇంధన శాఖ 2030 నాటికి 11 వేల మిలియన్ యూనిట్లు ఆదా చేయడానికి ఎనర్జీ ఎఫిషియన్సీ చర్యలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని యోచిస్తోంది. అంటే సంవత్సరానికి 1700 మిలియన్ యూనిట్లను ఆదా చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంధన పొదుపు సామర్థ్యాన్ని వెలికి తీసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రత్యేకంగా ఎనర్జీ కన్జర్వేషన్(EC) సెల్ లను రూపొందించినట్లు ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఎ. చంద్రశేఖర రెడ్డి తెలిపారు. 

'విద్యుత్ ను సమర్థవంతంగా వాడటాన్ని ప్రోత్సహించడం, విద్యుత్ వాడకాన్ని, బిల్లులను వీలైనంత వరకు తగ్గించడమే ఎనర్జీ ఎఫిషీయన్సీ సెల్స్ ప్రధాన ఉద్దేశం. దీని వల్ల అన్ని శాఖలపై ఆర్థిక భారం తగ్గుతుంది. నివాస సముదాయాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎకో నివాస్ సంహిత కోడ్ ను తీసుకువచ్చేందుకు యోచిస్తోంది. ఇంధన సామర్థ్య నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు గాను, PAT పథకం కింద కొత్త పరిశ్రమల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది' అని ఏపీఎస్ఈసీఎం మాజీ సీఈవో చంద్రశేఖర రెడ్డి తెలిపారు.

Also Read: కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్, పులిహోరా మేనిఫెస్టో వండారు, పత్తికొండలో సీఎం జగన్ ఆగ్రహం

దేశంలోనే అత్యుత్తమ ఎనర్జీ ఎఫిషీయంట్ రాష్ట్రాల్లో ఏపీ ఒకటని, సమీప భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఏపీఎస్ఈసీఎం మాజీ సీఈవో చంద్రశేఖర రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు పెరుగుతుండటం వల్ల వచ్చే ఏదేళ్లు అత్యంత వేడిగా ఉంటాయని నివేదికలు చెబుతున్నట్లు చంద్రశేఖర రెడ్డి గుర్తు చేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో ఎనర్జీ ఎఫిషీయంట్ 50 శాతం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎకాలజీ, ఎకానమీ, జీవన నాణ్యతకు ప్రయోజనం చేకూర్చడంలో ఎనర్జీ ఎఫిషియన్సీది ప్రధాన పాత్ర అని తెలిపారు. 2011-12 లో విద్యుత్ కోసం వేగంగా పెరిగిన డిమాండ్, డిమాండ్, సప్లై మధ్య అసమతుల్యత వల్ల రాష్ట్ర సర్కారు పొదుపు చర్యలు తక్షణ ప్రాతిపదికన అమలు చేసినట్లు తెలిపారు. 

2011లో ఎనర్జీ కో-ఆర్డినేషన్ సెల్ మెంబర్ సెక్రటరీగా చంద్రశేఖర రెడ్డి నియమితులయయ్యారు. ఆ తర్వాత ఏపీఎస్ఈసీఎం సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. తన నాయకత్వంలో ఇంధన పొదుపును సాధించడంలో ఉత్తమ పనితీరు కనబరిచారు. అలా భారత రాష్ట్రపతి నుంచి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2022 తో సహా రాష్ట్రానికి ఐదు జాతీయ అవార్డులు రావడంలో కీలక భూమిక పోషించారు. జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులను చంద్రశేఖర రెడ్డి మూడుసార్లు అందుకున్నారు. రాష్ట్రంలో రూ. 412 కోట్ల విలువైన 30కి పైగా ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్టులను గుర్తించడంలో చంద్రశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget