అన్వేషించండి

Telugu States Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు- పొలిటికల్‌ లీడర్స్‌కు తప్పని భానుడి సెగ

Andhra Pradesh Weather: తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. భానుడి సెగ సాధారణ ప్రజలకే కాదు.. రాజకీయ పార్టీల నేతలకు తగులుతోంది.

Telugu States Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. గత నెల రెండో వారం నుంచి దక్షిణాదిలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది. ఉదయం ఎనిమిది గంటలు నుంచే ఎండ తీవ్రత అధికంగా నమోదవుతుండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రతతోపాటు ఉక్కపోత, వడగాల్పులు తీవ్రంగా వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 38 నుంచి 42 డిగ్రీలు వరకు నమోదవుతుండడంతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటలు దాటిన తరువాత అత్యవసర పనులు ఉంటే తప్పా ఎవరూ బయటకు రావడానికి కూడా ఇష్టపడడం లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు ఈ ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖకు చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్‌ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 
తెలంగాణలో చూసుకుంటే... సిద్దిపేట, మేడ్చల్, యాదరిగి, జనగాం, వరంగల్, కరీంనగర్ పరిధిలో 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, పెద్దపల్లి, జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతుల రిజిస్టర్ కావచ్చు. హైదరాబాద్‌లో కూడా గరిష్ణ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే... నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాలో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రిజిస్టర్ కావచ్చు. పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రిజిస్టర్ కావచ్చు. విశాఖ సుమారుగా 33 డిగ్రీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

పొలిటికల్‌ లీడర్స్‌కు తప్పని సెగ

దేశంలో ఎన్నికల్‌ సీజన్‌ నడుస్తోంది. ఏపీలో పార్లమెంట్‌తోపాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల నేతలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బస్సు యాత్రలు, ప్రత్యేక సభలు, సమావేశాలను నాయకులు నిర్వహిస్తున్నారు. వీరికి కూడా భానుడి సెగ తప్పడం లేదు. ఎండ తీవ్రత దెబ్బకు నాయకులు సాయంత్రం, రాత్రి వేళల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఆయన ప్రజల్లోకి వెళుతూ మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, ఆ పార్టీ ముఖ్య నేత కేటీఆర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా ప్రజల్లోకి ఉదయం, సాయంత్రం వేళల్లోనే వెళుతున్నారు. భానుడి తాపం దెబ్బకు ఇబ్బందులు పడకుండా ఉండే ఉద్ధేశంతోనే ఈ మేరకు ఆయా పార్టీల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా భానుడి సెగ సాధారణ ప్రజలకే కాదు.. రాజకీయ పార్టీల నేతలకు తగులుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Keralam Assembly Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక ప్రచారం - యువనేతలకు ఎలక్షనీరింగ్ బాధ్యతలు !
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక ప్రచారం - యువనేతలకు ఎలక్షనీరింగ్ బాధ్యతలు !
Shroud of Turin: జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
Tamil Nadu Assembly Elections BJP: తమిళిసైకు టిక్కెట్ - అన్నామలైకు నో టిక్కెట్ - తమిళనాట బీజేపీ ప్రయోగాలు
తమిళిసైకు టిక్కెట్ - అన్నామలైకు నో టిక్కెట్ - తమిళనాట బీజేపీ ప్రయోగాలు

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Shroud of Turin: జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
BCB Letter: భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
Esther Anil: 'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
Embed widget