By: ABP Desam | Updated at : 06 Oct 2022 12:40 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI)
Amit Shah in Baramulla Rally: జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆజాన్
బారాముల్లాలో ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తుండగా సమీపంలోని మసీదు నుంచి 'ఆజాన్' కోసం పిలుపు వినిపించింది. దీంతో అమిత్ షా తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపారు. "మసీదులో ప్రార్థన జరుగుతోందా? మసీదులో ప్రార్థన ఉందని నాకు ఇప్పుడే చిట్టీ అందింది" అని అమిత్ షా అన్నారు. మసీదులో ఆజాన్ పిలుపు అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించవచ్చా అని అమిత్ షా ప్రజలను అడిగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
Halting the Speech Midway by Hnbl Home Minister due to #Azaan is Great Gesture and has Won the Hearts of Kashmiris, this Clearly Indicates the Respect for the Religion and Sentiments of Kashmiris. @AmitShah @AshokKoul59 #NayaKashmir pic.twitter.com/853g8IXXgq
— Sheikh Iqbal (@ListenIqbal) October 5, 2022
అమిత్ షా ఆజాన్ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆజాన్ పిలుపు సందర్భంగా అమిత్ షా తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపడంతో సభకు వచ్చిన ప్రజలు అమిత్ షా జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ చప్పట్లు కొట్టారు.
చర్చలకు నో
ఈ సందర్భంగా పాకిస్థాన్తో చర్చలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్తో చర్చలు జరిపే సమస్యే లేదన్నారు.
" 1990 నుంచి జమ్ముకశ్మీర్లో 42వేల మంది ప్రాణాలను ఉగ్రవాదం అనే భూతం బలిగొంది. అలాంటిదానితో ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? అబ్దుల్లాలు, ముఫ్తీలు, నెహ్రూ కుటుంబం.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకుంటూనే ఉంటున్నారు. పైగా కొంతమంది పాకిస్థాన్తో చర్చలు జరపాలని మాకు సూచిస్తున్నారు. అసలు పాక్తో ఎందుకు మాట్లాడాలి? ఉగ్రవాదాన్ని ఎందుకు సహించాలి? మేం చర్చలు జరపం. "
సహించేది లేదు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఉగ్రవాదాన్ని ఎట్టపరిస్థితుల్లో ఉపేక్షించలేదని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలోనే కశ్మీర్ను శాంతివనంగా తీర్చిదిద్దుతామన్నారు.
కశ్మీర్ ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం కశ్మీర్లో శాంతి నెలకొనాలంటే పాక్తో చర్చలు జరపాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
International Yoga Day: యోగా రాజకీయాలు షురూ, బీజేపీకి పోటీగా ఆప్ వేడుకలు
MANUU: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో 47 టీచింగ్ పోస్టులు!
APSFC: ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో 20 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు, అర్హతలివే!
ప్రియురాలిని హత్య చేసిన యువకుడు, డెడ్బాడీని ట్యాంక్లో దాచి మిస్సింగ్ అంటూ డ్రామా
ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? చించినాడ మట్టి తవ్వకాలపై సీఎంకు చంద్రబాబు లేఖ
Telangana Poltics : తెలంగాణ చీఫ్ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?
14 రోజుల రిమాండ్కు అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ
పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు టీడీపీ టీం- అడ్డుకున్న పోలీసులు- ఉయ్యూరుపాడు వద్ద ఉద్రిక్తత
టీఎస్పీఎస్సీ కేసులో ఛార్జ్షీట్ వేసిన సిట్- నిందితులకు బెయిల్ ఆశలపై నీళ్లు