అన్వేషించండి

CAA పై అసదుద్దీన్ ఒవైసీ అసహనం, అమలుని ఆపేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

CAA Implementation: పౌరసత్వ సవరణ చట్టం అమలుని నిలిపివేయాలంటూ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

 Citizenship Amendment Act: AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ CAA పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది కేవలం ముస్లింలను అణిచివేసేందుకు తీసుకొచ్చిన చట్టం అని మండి పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. వెంటనే ఈ చట్టం అమలుని నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. National Register of Citizens (NRC)కి పౌరసత్వ సవరణ చట్టానికి దగ్గరి పోలిక కనిపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో కీలక విషయాలు ప్రస్తావించారు. కేవలం మైనార్టీ వర్గాలపై వివక్ష చూపించాలన్న కుట్రతోనే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. 

"కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా CAA చట్టంతో ఎవరికీ పౌరసత్వం కల్పించరు. ఇదంతా కేవలం మైనార్టీ వర్గాలను ఇబ్బంది పెట్టేందుకు తీసుకొచ్చిన చట్టం. కావాలనే వాళ్లని లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపించేందుకే ఇదంతా చేస్తున్నారు. వాళ్ల పౌరసత్వాన్ని సవాల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు పౌరసత్వానికి సంబంధించి దాఖలయ్యే అప్లికషన్‌లను పక్కన పెట్టాలని కోరుకుంటున్నాను"

- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్ 

ఇప్పటికే సుప్రీంకోర్టులో CAAకి వ్యతిరేకంగా పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటన్నింటిపైనా సర్వోన్నత న్యాయస్థానం మార్చి 19వ తేదీన విచారణ చేపట్టనుంది. మార్చి 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఇకపై కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్‌లో హింసకు గురై భారత్‌కి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించనుంది. ముస్లిమేతరులకు మాత్రమే ఇది వర్తించనుంది. 2014 డిసెంబర్ 31వ తేదీ కన్నా ముందు భారత్‌కి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పిస్తామని కేంద్రం వివరించింది. ఈ నిర్ణయంపై ఇప్పటికే ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా తీవ్రంగా మండి పడుతున్నారు. 

"ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ చేసే జిమ్మిక్కు ఇదే. ఎన్నికలు రాగానే CAA నిబంధనల గురించి మాట్లాడుతుంది. ముందు నుంచి మేం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఈ చట్టం అమలు చేయాలనుకోవడం గాడ్సే తరహా ఆలోచనా విధానం. కేవలం దేశంలో ముస్లింల సంఖ్య తగ్గించాలని జరుగుతున్న కుట్ర. పౌరసత్వం అనేది మతం ఆధారంగా ఇవ్వాల్సింది కాదు. ఐదేళ్లుగా ఈ చట్టం ఎందుకు అమలు చేయలేదు..? ఇప్పుడే ఎందుకు చేస్తున్నారో కేంద్రం వివరణ ఇవ్వాలి. NPR,NRC లాగే సీఏఏ కూడా ముస్లింలను అణిచివేసేందుకు తీసుకొచ్చిందే. దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు"

- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్ 

Also Read: Lok Sabha Elections 2024: మార్చి 19వ తేదీన కాంగ్రెస్ మేనిఫెస్టో! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget