అన్వేషించండి

Agneepath Scheme: అగ్నిపథ్‌ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ వెల్లువెత్తిన పిటిషన్‌లు, అన్నింటినీ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

Agneepath Scheme: అగ్నిపథ్‌ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్‌లను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది.

Agneepath Scheme:


పిటిషన్‌లు తిరస్కరణ..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పలువురు కోర్టుల్లో పిటిషన్‌లు కూడా వేశారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. ఢిల్లీ హైకోర్టులోనూ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా చాలా పిటిషన్‌లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ పక్కన పెట్టేస్తున్నట్టు వెల్లడించింది ఢిల్లీ హైకోర్టు. విచారణకు తిరస్కరించింది. ఇది మన భద్రతా బలగాలను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పథకం అని వ్యాఖ్యానించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని తేల్చి చెప్పింది. పాత విధానం ప్రకారమే ఆర్మీ రిక్రూట్‌మెంట్ జరగాలని దాఖలైన పిటిషన్‌నూ తిరస్కరించింది. ఇది సరైన డిమాండ్ కాదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఇవన్నీ చివరకు సుప్రీం కోర్టుకు చేరుకున్నాయి. అయితే...సర్వోన్నత న్యాయస్థానం వాటిని ఢిల్లీ హైకోర్టుకి బదిలీ చేసింది. ఢిల్లీ హైకోర్టు చీఫ్‌జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. అయితే..ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌పై వివరణ ఇచ్చింది. రక్షణ రంగంలోని రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను గొప్ప సంస్కరణ అని చెబుతోంది. ఇకపై నియామకాల తీరు మారిపోతుందని తేల్చి చెప్పింది. నిజానికి గతేడాదే దీనిపై తీర్పునివ్వాల్సి ఉంది. కానీ...డిసెంబర్ 15న తీర్పుని రిజర్వ్‌లో ఉంచింది ధర్మాసనం. గతేడాది జూన్ 14వ తేదీ నుంచి అగ్నిపథ్‌ అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం 17-21 ఏళ్ల మధ్య ఉన్న యువత దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు నాలుగేళ్ల పాటు ఆర్మీలో సేవలందించే అవకాశం కల్పిస్తారు.

విమర్శలు...వివరణలు..

 అగ్నిపథ్ పథకం కింద పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయస్సు గల యువకులు నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేస్తారు. అయితే వారిలో 25 శాతం మంది తరువాత సాధారణ సేవ కోసం కొనసాగిస్తారు. ఈ పథకం కింద రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచిందనట్లు జూన్ 16న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాలు, డిఫెన్స్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రాధాన్యత ఇస్తామని ఉపశమన చర్యలు ప్రకటించింది కేంద్రం. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అగ్నిపథ్ పథకం కింద పనిచేసిన సైనికులను రాష్ట్ర పోలీసు బలగాలలో తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించాయి. కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు, అగ్నిప్రమాదాలకు పాల్పడిన వారిని చేర్చుకోబోమని సాయుధ దళాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ స్కీమ్‌ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని కొందరు విమర్శిస్తుంటే, విదేశాల్లో ఉన్నదేనని ఇంకొందరు సమర్థిస్తున్నారు. కేంద్రం ఎంత వివరణ ఇస్తున్నా, విమర్శలు మాత్రం ఆగటం లేదు. అటు ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయంపై భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇదే అంశమై కేంద్రంపై విమర్శలు గుప్పించారు. "నో ర్యాంక్, నో పెన్షన్" అన్నదే అగ్నిపథ్ పథకం ఉద్దేశమని ఎద్దేవా చేశారు. ఉద్యోగం సాధించినా వాళ్లకు ఆ ప్రయోజనాలు దక్కవని, అదే అగ్నిపథ్ పథకంలోని గొప్పదనం అంటూ సెటైర్లు వేశారు. 

Also Read: Manish Sisodia Arrested: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget