Adhav Arjuna: పిల్లలకేమో ప్రభుత్వ ఇడ్లీ.. మంత్రిగారికేమో ప్రైవేట్ బ్రెడ్ జామ్! సోషల్ మీడియాకు చిక్కిన అధవ్ అర్జున
Adhav Arjuna: విద్యార్థులతో కలిసి అల్పాహారం తినడానికి వెళ్లారు తమిళ మంత్రి అధవ్ అర్జున. వారి ఆహారం ఎలా ఉందో చూడాలనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లి ఆయన బ్రెడ్డు, జామ్ తిని ట్రోలిగ్కు గురవుతున్నారు.

Vijay Minister Trolled Bread Jam Controversy: తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి ప్రతి రోజూ ఏదో ఒక అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది. తాజాగా విజయ్ కేబినెట్లో అత్యంత కీలకమైన మంత్రి, వ్యూహకర్త అధవ్ అర్జున చేసిన ఒక పని నెటిజన్లకు చిక్కింది. ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులతో కలిసి అల్పాహారాన్ని ఆయన బ్రెడ్డు, జామ్తో పూర్తి చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆశయాలకు అనుగుణంగా మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అధవ్ అర్జున ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, అక్కడ విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార పథకాన్ని తనిఖీ చేశారు. అయితే, అక్కడే అసలు కథ మొదలైంది. చిన్నారులందరూ ప్రభుత్వం వడ్డించిన అల్పాహారాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటే, పక్కనే కూర్చున్న మంత్రి గారు మాత్రం తన వెంట తెచ్చుకున్న బ్రెడ్ అండ్ జామ్ ను ఆరగిస్తూ కెమెరాలకు చిక్కారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు.
‼️TVK is DMK 2.0
— Arun Pudur (@arunpudur) May 18, 2026
Remember when ate his own food and silver plate while eating with kids?
Joseph Vijay's Minster Aadhav Arjuna is eating bread & jam while children are eating Govt cooked breakfast. It shows he doesn't trust his Govt food.pic.twitter.com/SoCX9SMdyQ
మా ప్రభుత్వం వండే ఆహారం అమృతం.. మా చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాం అని స్టేజీల మీద చెప్పే మాటలకు, మంత్రి గారి చేతిలోని బ్రెడ్ ముక్కకు ఏమైనా సంబంధం ఉందా? అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "పిల్లలు తింటున్న ఆహారంపై మంత్రి గారికే నమ్మకం లేనప్పుడు, ఆ ఆహారం నాణ్యతపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను తనిఖీ చేయాల్సిన మంత్రే.. ఆ ఆహారాన్ని ముట్టకుండా తన సొంత డబ్బా తెచ్చుకోవడం చూస్తుంటే, ఆయనకు ప్రభుత్వ వంటకాలపై ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Adaav Arjuna is another MK Stalin in the making. Look at the plates: everyone eating hostel cooked food, while he eats bread and jam. Is this your idea of sharing breakfast with students? What a useless PR stunt. pic.twitter.com/nIwpyTVxsj
— Karthik (@skarthikdotin) May 18, 2026
ముఖ్యమంత్రి విజయ్ మొదటి నుంచీ తాను సామాన్యుడిని అని, ప్రజలతో కలిసి ఉండేవాడిని అని చెప్పుకుంటున్నారు. కానీ ఆయన కేబినెట్ మంత్రులు మాత్రం ఇలా విదేశీ డైట్ ఫాలో అవుతూ చిన్నారుల మధ్య కూర్చోవడం పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తోంది. పిల్లలకి పెట్టిన ఉప్మాలో ఉప్పు లేదో ఏమో కానీ, మంత్రి గారి బ్రెడ్ మీద మాత్రం జామ్ అదిరిపోయింది అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
రాజకీయాల్లో ఏ చిన్న పొరపాటు చేసినా అది భూతద్దంలో కనిపిస్తుందని అధవ్ అర్జున మరచిపోయినట్లున్నారు. ఆయన డైట్ ప్లాన్ ఏదైనా కావచ్చు, కానీ ఒక ప్రజా ప్రతినిధిగా ప్రభుత్వ పథకాన్ని ప్రోత్సహించాల్సిన సమయంలో ఇలాంటి చర్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తాయని టీవీకే క్యాడర్ ఆందోళన చెందుతోంది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















