అన్వేషించండి

ABP Southern Rising Summit 2024: నేడే హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.

ABP Network: ఏబీపీనెట్ వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ రెండో ఎడిషన్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. దక్షిణాది లో విభిన్న రంగాల ప్రముఖులు ఈ సమ్మిట్‌కు హాజరవబోతున్నారు.

ABP Southern Rising Summit:   దక్షణాది విజయాలను మరింత బలంగా వినిపించేలా రెండో ఎడిషన్  సదరన్ రైజింగ్ సమ్మిట్ శుక్రవారం వైభవోపేతంగా జరగనుంది.  ఏబీపీ నెట్‌వర్క్. దేశంలో పలు భాషల్లో మీడియా సంస్థలను నడుపుతున్న ABP NETWORK ఇండియా గ్రోత్ స్టోరీలో సౌతిండియా ప్రాధాన్యతను తెలిపేందుకు సదస్సులు నిర్వహిస్తోంది. సౌతిండియా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసేలా  The Southern Rising Summit 2024 ను అక్టోబర్ 25న హైదరాబాద్‌లో జరపనుంది. ఈ సెకండ్ ఎడిషన్ సమ్మిట్ లో దక్షణాది రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, క్రీడా రంగాల్లో వేసిన ముద్ర వేసిన వారు మాట్లాడతారు. దేశ ప్రగతిలో దక్షిణ భారత ప్రాధాన్యతను అందులో ఈ వ్యక్తుల పాత్రను సదస్సు ఆవిష్కరిస్తుంది. "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" జాతీయ కోణంలో దక్షిణాది ప్రాధాన్యతను మరోసారి ప్రముఖంగా ప్రస్తావించనుంది. 

“Coming of Age: Identity, Inspiration, Impact”, అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో  కీలకమైన రాజకీయ, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు దక్షిణాది ప్రత్యేకతను నిలబెట్టుకునే అంశంపై ప్రభావవంతమైన చర్చలు జరుగుతాయి. అలాగే ఆయా రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాల్సిన అంశాల ప్రముఖులు తమ ఆలోచనలు పంచుకుంటారు. సౌతిండియా నుంచి అగ్రశ్రేణి రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖలు, రచయతలు, వ్యాపారులు ఇందులో పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించి తన విజన్‌ను ఆవిష్కరిస్తారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహననాయుడు తన అంతంగాన్ని ఆవిష్కరిస్తారు. ఇండియన్ బాడ్మింటన్ దిగ్గజం, పద్మభూషణ్ పుల్లెలగోపీచంద్, స్టార్ హీరో సాయి దుర్గా తేజ్, నటి రాశీఖన్నా, జాతీయ నటుడు ప్రకాష్ రాజ్, మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు,  రచయిత చిదంబరం, వెటరన్ యాక్టర్ గౌతమి వంటి వారు పాల్గొంటున్నారు. 

రాజకీయ రంగంలోనూ దక్షిణాదిది ప్రత్యేక పాత్ర. సంచలన యువనేతలు తెరపైకి వస్తున్నారు. వారి వారి భావజాలాలను సమర్థంగా వినిపిస్తున్నారు. ఇలాంటి వారిలో ఇటీవల దేశం దృష్టిని ఆకర్షించిన బీజేపీ నేత కొంపెల్ల మాధవి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిది డాక్టర్ షామా మహమ్మద్, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్ మధుయాష్కీ గౌడ్, బీజేపీ ఎంపీ రఘునందన్ వంటి వారు కూడా దక్షిణాది రాజకీయ రంగం భవిష్యత్‌లో దేశంలో పోషించబోతున్న పాత్రపై తమ విశ్లేషణను అందిస్తారు. అలాగే సాంస్కృతి రంగం నుంచి క్లాసికల్ సింగర్ బిందు సుబ్రహ్మణ్యం, అవార్డు విన్నింగ్ సింగల్ శిల్పా రావు, క్లాసికల్ డాన్సర్, మూడు సార్లు జాతీయ అవార్డు పొందిన యామినిరెడ్డి దక్షిణాది కల్చర్ హెరిటేజ్‌ను  హైలెట్ చేస్తారు. అదే సమయంలో దక్షిణాది భవిష్యత్‌లో ఎలా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందో రచయిత, చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్ చర్చిస్తారు. ఇక దక్షిణాది నుంచి వ్యాపార రంగంలో సంచలనాలు నమోదవుతున్నాయి. స్టార్టప్‌లలో తనదైన ముద్ర వేసిన రాపిడో కో ఫౌండర్ అరవింద్ సంకా యువత మరింత వేగంగా వ్యాపార రంగంలో రాణించడానికి ఎలాంటి పాలసీలు అవసరమో... ప్రభుత్వాల వైపు నుంచి ఎలాంటి సహకారం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చో తన ఆలోచనలు పంచుకుంటారు. 

అన్ని రంగాల్లోనూ దక్షిణాది తనదైన ముద్ర వేస్తోంది. ఈ ప్రత్యేకతను చాటేలా రోజంతా అవకాశాలు, అవగాహనలు, అంచనాలపై అర్థవంతమైన చర్చలు ఉండేలా "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" జరగనుంది. దేశాభివృద్ధిలో దక్షిణాది పాత్రను ఈ సందర్భంగా సెలబ్రేట్ చేసుకునేలా కార్యక్రమం జరుగుతుంది. 

 దక్షిణాది ప్రత్యేకతను, సాధించబోయే విజయాలను , దేశ పురోగతికి అందిస్తున్న చేయూతను ప్రత్యక్షంగా చర్చించేందుకు మాతో కలవండి.  అక్టోబర్ 25వ తేదన ఉదయం గం.10 నుంచి ABP Nework అన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లపై ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.

ఏబీపీ నెట్ వర్క్ గురించి !

విశ్వసనీయత, నూతన ఆవిష్కరణలతో పలు భాషల్లో సత్తా చాటుతూ జాతీయ మీడియా రంగంలో కీలకంగా ఉంది ABP NETWORK.  వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ABP  గ్రూప్ నుంచి టెలివిజయన్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫామ్‌లను ABP NETWORK నిర్వహిస్తోంది.  దేశంలో పలు భాషల్లో 535 మిలియన్ల మంది వ్యూయర్స్‌ను కలిగి ఉంది ఏబీపీ నెట్వర్క్. ఏబీపీ స్టూడియోస్ ద్వారా న్యూస్ కాకుండా ఇతర విషయాల్లోనూ భిన్నమైన కంటెంట్‌ను అందించడంలోనూ ప్రత్యేక ముద్ర వేసింది. దక్షిణాదిలో తెలుగులో ఏబీపీ దేశం, తమిళంలో ఏబీపీ నాడు ద్వారా డిజిటల్ మీడియాలో బలమైన ముద్ర వేసింది. ABP NADU తమిళ సంస్కృతి, తమిళభాషను ఉన్నతం చేస్తూ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని శరవేగంగా అందిస్తూ అనతి కాలంలోనే ఆదరణ పొందింది. మన వార్తలు.. మన ఊరి భాషలో అనే కాన్సెప్ట్‌తో ABP DESAM తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫాం గ్రామస్థాయి ప్రజలకూ చేరువ అయింది. ఏపీ, తెలంగాణ సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబిస్తూ.. వారి ప్రీతిపాత్రమైన డిజిటల్ ఫ్లాట్‌ఫాంగా నిలిచింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Europe Heatwave 2026: యూరప్‌లో వడగాలులు 1,300కుపైగా మరణాలు! ఫ్యాన్లు, ఏసీల కోసం జనం పరుగులు!
యూరప్‌లో వడగాలులు 1,300కుపైగా మరణాలు! ఫ్యాన్లు, ఏసీల కోసం జనం పరుగులు!
Home Birth Tragedy: చచ్చినా ఇన్‌ఫ్లూయన్సర్ల మాటలు నమ్మొద్దు - నమ్మితే చచ్చిపోతారు - ఇదిగో భయంకర ఘటన
చచ్చినా ఇన్‌ఫ్లూయన్సర్ల మాటలు నమ్మొద్దు - నమ్మితే చచ్చిపోతారు - ఇదిగో భయంకర ఘటన
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Rice Water For Face : 30 రోజులు రైస్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. ఎలా ఉపయోగించాలంటే
30 రోజులు రైస్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. ఎలా ఉపయోగించాలంటే
Embed widget