అన్వేషించండి

ABP C Voter Opinion Poll : మళ్లీ మోదీనే - ఇండియా కూటమికి నిరాశే ! ఏబీపీ న్యూస్ సీఓటర్ ఒపీనియన్ పోల్స్‌ డీటైల్స్ ఇవిగో

ABP C Voter Opinion Poll Loksabha : ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ లో ఎన్డీఏ మరోసారి క్లియర్ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని తేలింది. ఇండియా కూటమికి మరోసారి నిరాశ తప్పదని ఒపీనియన్ పోల్ వెల్లడించింది.

ABP C Voter Opinion Poll :  లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి., ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం ఎవరిదన్న అంశంపై ఏబీపీ సీ ఓటర్ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఒపీనియన్ పోల్ సేకరించింది. అత్యంత విస్తృతంగా , శాస్త్రీయంగా జరిగిన ఈ ఒపీనియన్ పోల్‌లో బారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందని తేలింది. 

NDAకు 42 శాతం ఓట్లు  295-335 మధ్య సీట్లు 

దేశవ్యాప్తంగా ప్రజల ఒపీనియన్ పోల్స్ ను విశ్లేషించిన తర్వాత ఎన్డీఏ కూటమికి దాదాపుగా 42 శాతం ఓట్లు వస్తాయని తేలింది. ఈస్జ్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్‌ల వారీగా ఈ ఒపీనియన్ పోల్స్ సేకరించారు. అన్ని జోన్స్ లో కలిపి 42 శాతం ఓట్లతో పాటు 295 నుంచి 335 సీట్లు వస్తాయని తేలింది. ఇక ఇండియా కూటమి గతంలో కంటే గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీపై గెలిచేంత వరకూ వారు పోటీ ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ తో సహా ఇండియా కూటమిలోని పార్టీలకు 38 శాతం ఓట్లు 165 నుంచి 205 వరకూ సీట్లు రావొచ్చని అంచనా వేశారు. ఇక రెండు కూటముల్లోని పార్టీలకు 20 శాతం ఓట్లు 35 నుంచి 65 సీట్ల వరకూ రావొచ్చని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ తేల్చింది. 

ఈస్జ్ జోన్‌లో గట్టి పోటీ కానీ బీజేపీదే హవా 

దేశంలో  ఒక్క సౌత్ జోన్‌లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కూటమి ఆధిపత్యం చూపిస్తోంది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఎన్డీఏదే హవా. ఈస్జ్ జోన్‌లో మొత్తం 153 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జోన్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 42 శాతం ఓట్లు 80 నుంచి 90 వరకూ లోక్ సభ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 38 శాతం ఓట్లు  50 నుంచి 60 లోక్‌సభ సీట్లు వచ్చే చాన్స్ ఉంది. ఇతర పార్టీలకు 20 సాతం ఓట్లు 10 నుంచి 20 వరకూ లోక్ సభ సీట్లు సాధించే చాన్స్ ఉంది. 

నార్త్ జోన్‌లో పూర్తిగా బీజేపీ ఆధిపత్యం

ఇక నార్త్ జోన్ పూర్తిగా  బీజేపీ ఆధిపత్యం చూపించబోతోంది. మొత్తం నార్త్ జోన్ లో 180 పార్లమెంట్ సీట్లు ఉంటే.. అందులో 50 శాతం ఓట్లతో బీజేపీ 150 నుంచి 160 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కూటమికి 36 శాతం ఓట్లతో 20 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయి. ఇతరులకు పధ్నాలుగు శాతం ఓట్లు వస్తాయి కానీ సీట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. సున్నా నుంచి ఐదు లోక్ సభ సీట్ల వరకూ వచ్చే చాన్స్ ఉంది. 

సౌత్ జోన్‌లో ఇండియా కూటమి ఆధిపత్యం

ఇక  బీజేపీ బలహీనంగా ఉందని భావిస్తున్న సౌత్ జోన్‌లో కాంగ్రెస్ కూటమికి మంచి ఫలితాలు వస్తాయని తేలిపింది. సౌత్ జోన్‌లో మొత్తం 132 లోక్ సభసీట్లు ఉంటే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు కేవలం 19 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ లో వెల్లడయింది. లోక్ సభ సీట్లు 20 నుంచి 30 వరకూ వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమికి 40 శాతం ఓట్లతో  70 నుంచి 80 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు కూటముల్లో లేని పార్టీలు 41 శాతం ఓట్లు తెచ్చుకుని 25 నుంచి 35 లోక్ సభ సీట్లను పొందే అవకాశం ఉందని తేలింది. ఈ స్తానాల్లో ఏపీకి చెందిన ఇరవై ఐదు లోక్ సభ స్థానాలున్నాయి. 

వెస్ట్ జోన్‌లోనూ బీజేపీదే హవా

ఇక ఇండియాలో వెస్ట్ జోన్‌గాభావించే మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి హవా కనిపించనుంది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 78 సీట్లు ఉండగా  బీజేపీ కూటమి 45 నుంచి 55 సీట్లు వస్తాయి. 46  శాతం ఓటింగ్ లభిస్తుంది. కాంగ్రెస్ కూటమికి 37 శాతం ఓట్లు  25 నుంచి 35 పార్లమెంట్ సీట్లు లభించే అవకాశం ఉంది. ఇతరులకు 17 శాతం ఓట్లు సున్నా నుంచి ఐదు వరకూ లోక్ సభ సీట్లు లభించే అవకాశం ఉంది. 

[Disclaimer: This Opinion poll was conducted by CVoter. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding off. The margin of error is +/- 3% at the macro level and +/- 5% at the micro level.]

టాప్ హెడ్ లైన్స్

India First Flex Fuel WagonR: మారుతి నుంచి ఇండియాలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: ఇథనాల్ తో నడిచే వ్యాగన్ ఆర్ వెర్షన్ రెడీ.. 
మారుతి నుంచి ఇండియాలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: ఇథనాల్ తో నడిచే వ్యాగన్ ఆర్ వెర్షన్ రెడీ.. 
Toyota Innova Crysta Launched: టయోటా ఇన్నోవా క్రిస్టా లాంచ్:  సరికొత్త అప్‌డేట్స్ తో వచ్చిన ప్రీమియం ఎమ్‌పీవీ కార్.. లుక్స్ తో పాటు అదిరిపోయే ఇంటీరియర్ ఫీచర్లు
టయోటా ఇన్నోవా క్రిస్టా లాంచ్:  సరికొత్త అప్‌డేట్స్ తో వచ్చిన ప్రీమియం ఎమ్‌పీవీ కార్.. లుక్స్ తో పాటు అదిరిపోయే ఇంటీరియర్ ఫీచర్లు
Lalit Modi Interview:
"నేను, మోదీ చాలా క్లోజ్‌, త్వరలోనే భారత్‌ వస్తాను" లలిత్ మోడీ కీలక స్టేట్మెంట్
Arunachalam Giri Pradakshina Gang Rape Case: అరుణాచలం వెళ్లడానికి ఆలోచించాల్సిందే - భక్తులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేర ముఠాలు !
అరుణాచలం వెళ్లడానికి ఆలోచించాల్సిందే - భక్తులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేర ముఠాలు !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget