అన్వేషించండి

ABP C Voter Opinion Poll : మళ్లీ మోదీనే - ఇండియా కూటమికి నిరాశే ! ఏబీపీ న్యూస్ సీఓటర్ ఒపీనియన్ పోల్స్‌ డీటైల్స్ ఇవిగో

ABP C Voter Opinion Poll Loksabha : ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ లో ఎన్డీఏ మరోసారి క్లియర్ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని తేలింది. ఇండియా కూటమికి మరోసారి నిరాశ తప్పదని ఒపీనియన్ పోల్ వెల్లడించింది.

ABP C Voter Opinion Poll :  లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి., ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం ఎవరిదన్న అంశంపై ఏబీపీ సీ ఓటర్ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఒపీనియన్ పోల్ సేకరించింది. అత్యంత విస్తృతంగా , శాస్త్రీయంగా జరిగిన ఈ ఒపీనియన్ పోల్‌లో బారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందని తేలింది. 

NDAకు 42 శాతం ఓట్లు  295-335 మధ్య సీట్లు 

దేశవ్యాప్తంగా ప్రజల ఒపీనియన్ పోల్స్ ను విశ్లేషించిన తర్వాత ఎన్డీఏ కూటమికి దాదాపుగా 42 శాతం ఓట్లు వస్తాయని తేలింది. ఈస్జ్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్‌ల వారీగా ఈ ఒపీనియన్ పోల్స్ సేకరించారు. అన్ని జోన్స్ లో కలిపి 42 శాతం ఓట్లతో పాటు 295 నుంచి 335 సీట్లు వస్తాయని తేలింది. ఇక ఇండియా కూటమి గతంలో కంటే గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీపై గెలిచేంత వరకూ వారు పోటీ ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ తో సహా ఇండియా కూటమిలోని పార్టీలకు 38 శాతం ఓట్లు 165 నుంచి 205 వరకూ సీట్లు రావొచ్చని అంచనా వేశారు. ఇక రెండు కూటముల్లోని పార్టీలకు 20 శాతం ఓట్లు 35 నుంచి 65 సీట్ల వరకూ రావొచ్చని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ తేల్చింది. 

ఈస్జ్ జోన్‌లో గట్టి పోటీ కానీ బీజేపీదే హవా 

దేశంలో  ఒక్క సౌత్ జోన్‌లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కూటమి ఆధిపత్యం చూపిస్తోంది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఎన్డీఏదే హవా. ఈస్జ్ జోన్‌లో మొత్తం 153 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జోన్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 42 శాతం ఓట్లు 80 నుంచి 90 వరకూ లోక్ సభ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 38 శాతం ఓట్లు  50 నుంచి 60 లోక్‌సభ సీట్లు వచ్చే చాన్స్ ఉంది. ఇతర పార్టీలకు 20 సాతం ఓట్లు 10 నుంచి 20 వరకూ లోక్ సభ సీట్లు సాధించే చాన్స్ ఉంది. 

నార్త్ జోన్‌లో పూర్తిగా బీజేపీ ఆధిపత్యం

ఇక నార్త్ జోన్ పూర్తిగా  బీజేపీ ఆధిపత్యం చూపించబోతోంది. మొత్తం నార్త్ జోన్ లో 180 పార్లమెంట్ సీట్లు ఉంటే.. అందులో 50 శాతం ఓట్లతో బీజేపీ 150 నుంచి 160 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కూటమికి 36 శాతం ఓట్లతో 20 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయి. ఇతరులకు పధ్నాలుగు శాతం ఓట్లు వస్తాయి కానీ సీట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. సున్నా నుంచి ఐదు లోక్ సభ సీట్ల వరకూ వచ్చే చాన్స్ ఉంది. 

సౌత్ జోన్‌లో ఇండియా కూటమి ఆధిపత్యం

ఇక  బీజేపీ బలహీనంగా ఉందని భావిస్తున్న సౌత్ జోన్‌లో కాంగ్రెస్ కూటమికి మంచి ఫలితాలు వస్తాయని తేలిపింది. సౌత్ జోన్‌లో మొత్తం 132 లోక్ సభసీట్లు ఉంటే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు కేవలం 19 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ లో వెల్లడయింది. లోక్ సభ సీట్లు 20 నుంచి 30 వరకూ వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమికి 40 శాతం ఓట్లతో  70 నుంచి 80 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు కూటముల్లో లేని పార్టీలు 41 శాతం ఓట్లు తెచ్చుకుని 25 నుంచి 35 లోక్ సభ సీట్లను పొందే అవకాశం ఉందని తేలింది. ఈ స్తానాల్లో ఏపీకి చెందిన ఇరవై ఐదు లోక్ సభ స్థానాలున్నాయి. 

వెస్ట్ జోన్‌లోనూ బీజేపీదే హవా

ఇక ఇండియాలో వెస్ట్ జోన్‌గాభావించే మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి హవా కనిపించనుంది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 78 సీట్లు ఉండగా  బీజేపీ కూటమి 45 నుంచి 55 సీట్లు వస్తాయి. 46  శాతం ఓటింగ్ లభిస్తుంది. కాంగ్రెస్ కూటమికి 37 శాతం ఓట్లు  25 నుంచి 35 పార్లమెంట్ సీట్లు లభించే అవకాశం ఉంది. ఇతరులకు 17 శాతం ఓట్లు సున్నా నుంచి ఐదు వరకూ లోక్ సభ సీట్లు లభించే అవకాశం ఉంది. 

[Disclaimer: This Opinion poll was conducted by CVoter. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding off. The margin of error is +/- 3% at the macro level and +/- 5% at the micro level.]

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget