అన్వేషించండి

Aadhar Card : ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన పౌరసత్వం ఉన్నట్లు కాదు .. లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన !

ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన అది దేశ పౌరసత్వం ఉన్నట్లు కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. అది ఓ గుర్తింపు మాత్రమేనన్నారు.

ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన అది దేశ పౌరసత్వానికి సర్టిఫికెట్ కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు లోక్‌సభకు ఈ విషయం స్పష్టంగా తెలిపారు. ఆధార్ కార్డు  పౌరసత్వానికి గుర్తింపుగా ఉంటుంది కానీ.. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన పౌరసత్వం  ఉన్నట్లు కాదని స్పష్టం చేసింది. దేశంలోకి అక్రమంగా వలస వస్తున్న అనేక మంది స్థానిక అధికారుల అవినీతి కారణంగా ఆధార్ కార్డు పొందుతున్న ఆరోపణలు తరచూవస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. 

హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లోనూ ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఆధార్ కార్డులు పొంది వాటి ఆధారంగా పాస్‌పోర్టులు ఇతర సిటిజన్ షిప్ ధృవీకరించే గుర్తింపు పత్రాలుపొందినట్లుగా కేసులు కూడా నమోదయ్యాయి. ఇండియా ఆధార్ కార్డు ఉంటే ఇండియనే అన్న భావన పెరుగుతూండటంతో కేంద్ర ప్రభుత్వం దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. విదేశీయులు పౌరసత్వం పొందడానికి ప్రత్యేకమైన మార్గాలుంటాయి.  

అయితే అక్రమంగా వలస వచ్చిన వారు..  దురుద్దేశంతో  అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమ పద్దతుల్లో  ఆధార్ కార్డు పొందడం ద్వారా ఇండియన్ పౌరసత్వం పొందినట్లుగా షార్ట్ కట్ మార్గాలు ఎంచుకోవడం నేరమని కేంద్రం ఈ ప్రకటనతో తేల్చేసినట్లయింది. ఆధార్ విషయంలో కేంద్రం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఓటర్ కార్డుకు కూడా అనుసంధానం చేస్తూ పార్లమెంట్‌లో నిర్ణయం తీసుకుంది. ప్రతి ఓటరు తమ ఆధార్ నెంబర్‌తో ఓటర్ కార్డు నెంబర్‌ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది స్వచ్చందమేనని కేంద్రం తెలిపింది. ఇప్పటికి భారత్‌లో ఆధార్ అనేది అత్యంత ముఖ్యమైన నెంబర్ అయింది. ఇది విస్తృతంగా చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డుగా ఉంది. 

ప్రస్తుతం భారత్‌లో ఆధార్ కార్డు లేకపోతే రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి ఉంది. చిరునామాకు రుజువుగా ఆధార్ కార్డ్ చెల్లుతుంది. ఆధార్ కార్డ్‌లో ఫోటో, పేరు, చిరునామా మాత్రమే బయటకు కనిపిస్తాయి. కానీ వేలిముద్రలు , ఐరిస్ స్కాన్, ఫోన్ నెంబర్ అన్నీ రిజిస్టరై ఉంటాయి. ఓటరు కార్డు లేకపోతే ఓటు వేయలేరు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ చేయలేరు, పాస్‌పోర్ట్ లేకపోతే విదేశాలకు వెళ్లలేరు కానీ లేకపోతే ఆధార్ కార్డు లేకపోతే ఏ పనీ చేయలేము. ఆధార్ కార్డు ఉంటేనే ఇతర గుర్తింపు కార్డులు తీసుకోగలం.  ఆధార్ విషయంలో కేంద్రం ఇచ్చిన తాజా ప్రకటన  ఆధార్ ఉంటే పౌరసత్వం లభిస్తుందనే వారికి స్పష్టత ఇచ్చినట్లయింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
YS Jagan Security: మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు సీజ్
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు సీజ్
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
YS Jagan Security: మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు సీజ్
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు సీజ్
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో హిట్ మ్యాన్ హుకుం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Embed widget