అన్వేషించండి

Banks Money : ఆ రూ. 26వేల కోట్లు ఎవరివో ? బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయిన జనం..!

బ్యాంకుల్లో దాదాపుగా రూ. 26వేల కోట్ల నగదు పదేళ్ల నుంచి ఖాతాల్లో ఉండిపోయాయి. ఎవరూ వాటిని క్లెయిమ్ చేసుకోవడం లేదని కేంద్రం తెలిపింది.

మనం బ్యాంకుల్లో డబ్బులు వేసుకుంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటాం. ఒక రూపాయి ఎక్కువ, తక్కువైనా ఎందుకొచ్చాయి.. ఎందుకు జమ అయ్యాయో స్టేట్‌మెంట్ చూస్తాం. అయితే అందరూ మన లాంటి వాళ్లే ఉండరు. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులేసి.. మర్చిపోయేవాళ్లు ఉంటారు. ఆ డబ్బులు తీసుకునే తీరిక లేని వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లు బాగా పెరిగిపోయారు. బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని మొత్తాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం యాక్టివ్‌గా లేని బ్యాంకు ఖాతాల్లో ఏకంగా రూ.26,697 కోట్లు ఉన్నాయట. ఈ విషయం కేంద్రం అధికారికంగా ప్రకటించింది. 

Also Read : చరిత్రలో రెండోసారి అత్యధికంగా జీఎస్‌టీ రాబడి.. ఎంత వచ్చాయంటే..!

దేశంలోని అన్ని బ్యాంకుల్లో వినియోగం లేని ఖాతాల్లో రూ.26,697 కోట్లు మగ్గుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు వెల్లడించారు.  2020 ముగింపు నాటికి దాదాపు 9 కోట్ల బ్యాంక్ ఖాతాల్లో ఈ మొత్తం వినియోగం లేకుండా ఉంది. దాదాపు పదేళ్ల నుంచీ నిర్వహణలో లేవు. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల్లో రూ.24,356 కోట్లు, అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకుల్లో రూ.2,341 కోట్లు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో రూ.0.71 కోట్లు చొప్పున ఈ మొత్తం ఉందన్నారు. ఈ ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు లేదా వారసులను గుర్తించాలని బ్యాంక్‌లకు సూచనలు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. 

Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది

ఏదైనా అకౌంట్ పదేళ్ల పాటు లావాదేవీలు లేకపోతే అందులో ఉన్న సొమ్మును "క్లెయిమ్ చేయని డిపాజిట్ల" ఖాతాలోకి చేరుస్తారు. డిపాజిటర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ఆర్బీఐ ఓ నిధిని ఏర్పాటు చేసింది. క్లెయిమ్ చేయని డబ్బునంతా ఈ నిధి ఖాతాలోకి బదిలీ చేస్తారు. కస్టమర్లకు సేవలు అందించేందుకు ఈ నిధిని ఉపయోగిస్తారు. అయితే పదేళ్ల తర్వాత ఖాతాదారుడు తిరిగి వస్తే ఇవ్వరా.. అంటే... ఇచ్చి తీరాల్సిందే. తిరస్కరించడానికి బ్యాంకుకు హక్కు లేదు. 

Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..

ఎవరైనా ఒక ఖాతాదారుడు, తన అకౌంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉండి, పదేళ్లకు పైగా ఆ ఖాతాను మర్చిపోతే మళ్లీ బ్యాంకును సంప్రదించవచ్చు. ఒకవేళ ఆ ఖాతాలోని డబ్బును ప్రత్యేక నిధికి బదిలీ చేసినా, ఖాతాదారుడు బ్యాంకులకు సరైన ఆధారాలు చూపిస్తే తిరిగి అకౌంట్లోకి డిపాజిట్ చేస్తారు. యథావిథిగా ఆ అకౌంట్ న ఖాతాదారు వాడుకోవచ్చు. డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే అలా వచ్చేవారు తక్కువ. ఆనిధి ఖాతాలో సొమ్ములు అలా పెరిగిపోతూనే ఉన్నాయి. 

Also Read: Star Health IPO: స్టార్‌ హెల్త్‌ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget