అన్వేషించండి

Banks Money : ఆ రూ. 26వేల కోట్లు ఎవరివో ? బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయిన జనం..!

బ్యాంకుల్లో దాదాపుగా రూ. 26వేల కోట్ల నగదు పదేళ్ల నుంచి ఖాతాల్లో ఉండిపోయాయి. ఎవరూ వాటిని క్లెయిమ్ చేసుకోవడం లేదని కేంద్రం తెలిపింది.

మనం బ్యాంకుల్లో డబ్బులు వేసుకుంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటాం. ఒక రూపాయి ఎక్కువ, తక్కువైనా ఎందుకొచ్చాయి.. ఎందుకు జమ అయ్యాయో స్టేట్‌మెంట్ చూస్తాం. అయితే అందరూ మన లాంటి వాళ్లే ఉండరు. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులేసి.. మర్చిపోయేవాళ్లు ఉంటారు. ఆ డబ్బులు తీసుకునే తీరిక లేని వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లు బాగా పెరిగిపోయారు. బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని మొత్తాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం యాక్టివ్‌గా లేని బ్యాంకు ఖాతాల్లో ఏకంగా రూ.26,697 కోట్లు ఉన్నాయట. ఈ విషయం కేంద్రం అధికారికంగా ప్రకటించింది. 

Also Read : చరిత్రలో రెండోసారి అత్యధికంగా జీఎస్‌టీ రాబడి.. ఎంత వచ్చాయంటే..!

దేశంలోని అన్ని బ్యాంకుల్లో వినియోగం లేని ఖాతాల్లో రూ.26,697 కోట్లు మగ్గుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు వెల్లడించారు.  2020 ముగింపు నాటికి దాదాపు 9 కోట్ల బ్యాంక్ ఖాతాల్లో ఈ మొత్తం వినియోగం లేకుండా ఉంది. దాదాపు పదేళ్ల నుంచీ నిర్వహణలో లేవు. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల్లో రూ.24,356 కోట్లు, అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకుల్లో రూ.2,341 కోట్లు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో రూ.0.71 కోట్లు చొప్పున ఈ మొత్తం ఉందన్నారు. ఈ ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు లేదా వారసులను గుర్తించాలని బ్యాంక్‌లకు సూచనలు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. 

Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది

ఏదైనా అకౌంట్ పదేళ్ల పాటు లావాదేవీలు లేకపోతే అందులో ఉన్న సొమ్మును "క్లెయిమ్ చేయని డిపాజిట్ల" ఖాతాలోకి చేరుస్తారు. డిపాజిటర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ఆర్బీఐ ఓ నిధిని ఏర్పాటు చేసింది. క్లెయిమ్ చేయని డబ్బునంతా ఈ నిధి ఖాతాలోకి బదిలీ చేస్తారు. కస్టమర్లకు సేవలు అందించేందుకు ఈ నిధిని ఉపయోగిస్తారు. అయితే పదేళ్ల తర్వాత ఖాతాదారుడు తిరిగి వస్తే ఇవ్వరా.. అంటే... ఇచ్చి తీరాల్సిందే. తిరస్కరించడానికి బ్యాంకుకు హక్కు లేదు. 

Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..

ఎవరైనా ఒక ఖాతాదారుడు, తన అకౌంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉండి, పదేళ్లకు పైగా ఆ ఖాతాను మర్చిపోతే మళ్లీ బ్యాంకును సంప్రదించవచ్చు. ఒకవేళ ఆ ఖాతాలోని డబ్బును ప్రత్యేక నిధికి బదిలీ చేసినా, ఖాతాదారుడు బ్యాంకులకు సరైన ఆధారాలు చూపిస్తే తిరిగి అకౌంట్లోకి డిపాజిట్ చేస్తారు. యథావిథిగా ఆ అకౌంట్ న ఖాతాదారు వాడుకోవచ్చు. డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే అలా వచ్చేవారు తక్కువ. ఆనిధి ఖాతాలో సొమ్ములు అలా పెరిగిపోతూనే ఉన్నాయి. 

Also Read: Star Health IPO: స్టార్‌ హెల్త్‌ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget