అన్వేషించండి

2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!

దక్షిణాదిలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు భాజపా వ్యూహరచన చేస్తోంది. రాజ్యసభకు నామినేట్ చేసిన వాళ్లంతా దక్షిణాదికి చెందిన వాళ్లే కావటంతో ఆ పార్టీ స్ట్రాటెజీ ఏంటో అర్థమవుతోంది.

దక్షిణాదిపై ఫోకస్ చేసిన భాజపా 

ఉత్తరాదిలో పాగా వేసి పరుగులు పెడుతున్న భాజపా..దక్షిణాదిలో మాత్రం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. గతంతో పోల్చుకుంటే కాస్త నయమే అయినా "దక్షిణాదినీ ఏలాలి" అనే ఆకాంక్ష మాత్రం ఇంకా తీరలేదు. 2024 ఎన్నికల్లో ఆ లోటునీ భర్తీ చేయాలని గట్టిగానే కసరత్తు చేస్తోంది కాషాయ పార్టీ. కేంద్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోవటం వల్ల ఎలాగో "గెలుపు మాదే" అనే ధీమాతో ఉంది. ఎటొచ్చి దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానిక పార్టీలు, భాజపా విస్తరణను అడ్డుకుంటున్నాయి. ఈ సారి, ఎవరు అడ్డు వచ్చినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా వాటిని చిత్తు చేసి అధికారంలోకి రావాలని శపథం చేసింది. అందుకే "సౌత్ ఇండియా మిషన్" అమలు చేస్తోంది. ఎప్పుడూ లేనిది హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయటంతోనే ఈ సంకేతాలు ఇచ్చేసింది. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమే అని, ప్రజలు తమ వైపే ఉన్నారని క్లెయిమ్ చేసుకుంటోంది. ఇక్కడేంటి..? మొత్తం దక్షిణాది భాజపా అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని బాగానే ప్రచారం చేసుకుంటోంది. ఇలాంటి ప్రకటనలతో ముందుగానే ప్రతిపక్షాలను అభద్రతా భావంలోకి నెట్టివేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది. 

స్ట్రాటెజిక్‌గా రాజ్యసభ ఎంపీల ఎంపిక..

దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలోనే అధికారంలో ఉంది భాజపా. తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో తెలంగాణలోనే భాజపాకు అత్యధిక అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన ఉప ఎన్నికలు సహా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పలు చోట్ల గెలిచింది. ఫలితంగా...ఇక్కడ వాక్యూమ్ ఉందని భావించిన భాజపా, పూర్తి స్థాయిలో పాగా వేయాలని చూస్తోంది. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఇంకా కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనదైన స్ట్రాటజీతో ముందుకొచ్చింది భాజపా. దక్షిణాదికి చెందిన వారిని రాజ్యసభకు నామినేట్ చేసింది. తమిళనాడుకు చెందిన సంగీత దర్శకుడు ఇళయరాజాను ఎంపిక చేసి, తమిళుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి బాహుబలి రైటర్, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను నామినేట్ చేసింది. కేరళ నుంచి పరుగుల రాణి పీటీ ఉషను రాజ్యసభకు పంపనుంది మోదీ సర్కార్. ఇక కర్ణాటక నుంచి సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డే రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. ఇలా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారిని ఎగువసభకు పంపుతూ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది కాషాయ పార్టీ. 

ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకునేందుకు..

ఈ ఎంపికల్ని బట్టి చూస్తే, దక్షిణాది రాష్ట్రాల్లో వీలైనంత మేర మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. పైగా ఎంపీ సీట్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సౌత్‌ ఇండియాలో ఏపీలో 25,తెలంగాణలో 17,కేరళలో 20, కర్ణాటకలో 28 ఎంపీ స్థానాలున్నాయి. అత్యధికంగా తమిళనాడులో 39 ఎంపీ సీట్లున్నాయి. అంటే మొత్తంగా కలుపుకుని 129 ఎంపీ స్థానాలున్నాయి. వీటిలో కనీసం 80% స్థానాల్లో మంచి ఫలితాలు రాబట్టగలిగితే దక్షిణాదిలో తమ బలం పెరుగుతుందని భాజపా భావిస్తోంది. అయితే ఈ అన్ని చోట్ల భాజపా అనుసరిస్తున్న వ్యూహం ఒకటి కామన్‌గా కనిపిస్తోంది. అదే జాతీయవాదం. ఎప్పటిలాగే హిందుత్వ కార్డ్‌ని చూపించి, ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. "వన్ నేషన్, వన్ క్యాంపెయిన్‌" వ్యూహంతోనే దక్షిణాదిలోనూ ప్రచారం సాగించాలని కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన భారీ బహిరంగ సభలో భాజపా నేతల ప్రసంగం ద్వారానే "హిందుత్వ కార్డ్‌"ను ఎలా వాడనున్నారో స్పష్టంగా అర్థమైంది. "జైశ్రీరామ్" అంటూ నినాదాలు చేయటమూ ఇందులో భాగమే. 

మూడు రాష్ట్రాల్లో బలం చాటుకుంటున్న భాజపా

కేరళలో క్రిస్టియన్ గ్రూప్‌ను ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తోంది భాజపా. క్రైస్తవులు మళ్లీ హిందూ మతంలో చేరాలనే నినాదంతో "ఘర్ వాపసీ" స్ట్రాటెజీని అమలు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇక తమిళనాడులో ఏఐడీఎమ్‌కేకు మద్దతు తెలుపుతున్నట్టుగా కనిపిస్తున్నా, తమ ప్రత్యేకతను చాటుకోవాలని భావిస్తోంది. కానీ...ఇక్కడ ఓటు శాతం మాత్రం తక్కువగానే ఉంది. 2014లో 5.56%గా ఉన్న భాజపా ఓటు శాతం, 2019 ఎన్నికల్లో 3.66%కి పడిపోయింది. కేరళలో 2.48% పెరగ్గా, కర్ణాటకలోనూ 8%పైగా అధికమైంది. తెలంగాణలో 8.5% ఓటు శాతం పెంచుకోగలిగింది కాషాయ పార్టీ. ఏపీలో మాత్రం 7.5% మేర తగ్గిపోయింది. మొత్తంగా 5 దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు మూడు చోట్ల భాజపా బలంగానే ఉంది. మిగతా రెండు రాష్ట్రాల్లోనూ బలం పెంచుకునేందుకు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
IND vs SL Test Series Updates: లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
BCCI Pension Rules: రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget