అన్వేషించండి

World Literacy Day: అక్షరాస్యతలో భారత స్థానం ఇంకా అక్కడే...

నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం. ఈ సందర్భంగా మన దేశం అక్షరాస్యతలో ఏ స్థానంలో ఉందో, ఏ రాష్ట్రం ముందుందో తెలుసుకుందాం.

ప్రపంచ దేశాల్లో అక్షరాస్యతలో ముందున్న అయిదు దేశాల పేర్లు చెప్పగలరా? అని అడిగితే... మొదట ఎవరైనా అమెరికా, బ్రిటన్ ఇలా చెప్పడం మొదలుపెడతారు. ఎందుకంటే అవే ప్రపంచంలో ధనిక దేశాలుగా, బలమైన రాజ్యాలుగా పేరుపొందాయి. నిజానికి ప్రపంచంలో  ధనిక దేశాలు లేదా అత్యధిక జనాభా కలిగిన దేశాలేవి అక్షరాస్యతలో ముందుస్థానంలో లేవు.  అతి చిన్నదేశాలు అత్యధిక అక్షరాస్యతను సాధించి మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. 

ఫిన్ లాండ్ మొదటి స్థానంలో ఉండగా, నార్వే, ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్ దేశాలు తరువాతి స్థానాలను వరుసగా సాధించాయి. స్విట్టర్లాండ్ ఆరో స్థానాన్ని, అమెరికా ఏడవ స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక ఫ్రాన్స్ 12, బ్రిటన్ 17వ స్థానాల్లో ఉన్నాయి. మనదేశం ఈ దరిదాపుల్లో ఎక్కడా లేదు. అంతెందుకు అతి చిన్న దేశాలైన లక్సమ్ బర్గ్,  అజర్ బైజాన్, అండోరా వంటివి కూడా వందశాతం అక్షరాస్యతను సాధించాయి.  

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. 1947లో మన దేశ అక్షరాస్యతా శాతం కేవలం 12. ఇప్పుడు 74 శాతం. 2001 ఇది 60.47 శాతంగా ఉండేది. వందశాతం సాధించడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. ప్రపంచంలో ప్రతి ముగ్గురు నిరక్ష రాస్యులలో ఒకరు కచ్చితంగా భారతదేశంలో ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 2005 లెక్కల ప్రకారం 127 దేశాల జాబితాలో అక్షరాస్యతలో భారత్ 106 వస్థానంలో నిలిచింది. 2017లో 105వ స్థానానికి వచ్చింది. పన్నెండేళ్ల కాలంలో అక్షరాస్యత శాతంలో పెద్దగా మార్పు రాకపోవడం శోచనీయం.

ముందున్న కేరళ
మనదేశంలో అక్షరాస్యతలో ముందున్న రాష్ట్రం కేరళ. గతేడాది లెక్కల ప్రకారం కేరళ 96.2 శాతం అక్షరాస్యతను సాధించింది. వందశాతం సాధించే దిశగా దూసుకుపోతోంది. 2016-20 మధ్య కాలంలో లక్షమందికి పైగా ప్రజలను అక్షరాస్యులను చేసి రికార్డు సాధించింది. వీరందరూ కూడా అట్టడుగు వర్గాలకు చెందినవారే. మత్స్యకారులు, ఉపాధి కార్మికులు, వారి కుటుంబాలను ఎంపిక చేసుకుని వారందరినీ అక్షరాస్యులుగా చేసింది. 

తెలుగు రాష్ట్రాలెక్కడ?
నేషనల్ శాంపిల్ సర్వే 2017-18 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 66.4 శాతం మంది అక్షరాస్యులు ఉండగా, తెలంగాణాలో 72.8 శాతం మంది ఉన్నట్టు గుర్తించారు. 

అసలేంటీ అక్షరాస్యతా దినోత్సవం?
యునెస్కో సభ్యదేశాల విద్యామంత్రులంతా కలిసి 1965 నవంబర్ లో  ప్రతి ఏడాది అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 1966 నుంచి ప్రతి సెప్టెంబరు8 న అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. 

Also read: సంగీతంతో మానసికోల్లాసం... ఒత్తిడి మాయం

Also read: ఈ బిర్యానీల రుచి అదిరిపోతుంది... ఒక్కసారి తిని చూడండి

Also read: జ్యూయలరీ ప్రకటనలో పెళ్లికూతురిగా ట్రాన్స్ జెండర్... ఇన్ స్టాలో లక్షల వ్యూస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jayaketanam : జనసేనకు చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు - విలువల రాజకీయాలు చేస్తున్నారని ప్రశంసలు
జనసేనకు చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు - విలువల రాజకీయాలు చేస్తున్నారని ప్రశంసలు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Janasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP DesamPitapuram Janasena Sabha Decoration NRI Prasanth Kolipora | పిఠాపురం సభలో ఇన్ని ప్రత్యేకతలా.? | ABP DesamAdilabad Adivasila Holi Duradi | మోదుగపూలతో ఆదివాసీలు చేసుకునే హోళీ పండుగను చూశారా.! | ABP DesamVisakha Holika Dahan | ఉత్తరాది హోళికా దహన్ సంప్రదాయం ఇప్పుడు విశాఖలో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jayaketanam : జనసేనకు చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు - విలువల రాజకీయాలు చేస్తున్నారని ప్రశంసలు
జనసేనకు చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు - విలువల రాజకీయాలు చేస్తున్నారని ప్రశంసలు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Aadhi Pinisetty Nikki Galrani: వీకెండ్‌లో చిల్ అవుతున్న ఆది, నిక్కీ కపుల్ - మాల్దీవ్స్ అందాలు ఎంజాయ్ చేస్తున్నారుగా..
వీకెండ్‌లో చిల్ అవుతున్న ఆది, నిక్కీ కపుల్ - మాల్దీవ్స్ అందాలు ఎంజాయ్ చేస్తున్నారుగా..
DC New Captain Axar: ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
Embed widget