అన్వేషించండి

World Literacy Day: అక్షరాస్యతలో భారత స్థానం ఇంకా అక్కడే...

నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం. ఈ సందర్భంగా మన దేశం అక్షరాస్యతలో ఏ స్థానంలో ఉందో, ఏ రాష్ట్రం ముందుందో తెలుసుకుందాం.

ప్రపంచ దేశాల్లో అక్షరాస్యతలో ముందున్న అయిదు దేశాల పేర్లు చెప్పగలరా? అని అడిగితే... మొదట ఎవరైనా అమెరికా, బ్రిటన్ ఇలా చెప్పడం మొదలుపెడతారు. ఎందుకంటే అవే ప్రపంచంలో ధనిక దేశాలుగా, బలమైన రాజ్యాలుగా పేరుపొందాయి. నిజానికి ప్రపంచంలో  ధనిక దేశాలు లేదా అత్యధిక జనాభా కలిగిన దేశాలేవి అక్షరాస్యతలో ముందుస్థానంలో లేవు.  అతి చిన్నదేశాలు అత్యధిక అక్షరాస్యతను సాధించి మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. 

ఫిన్ లాండ్ మొదటి స్థానంలో ఉండగా, నార్వే, ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్ దేశాలు తరువాతి స్థానాలను వరుసగా సాధించాయి. స్విట్టర్లాండ్ ఆరో స్థానాన్ని, అమెరికా ఏడవ స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక ఫ్రాన్స్ 12, బ్రిటన్ 17వ స్థానాల్లో ఉన్నాయి. మనదేశం ఈ దరిదాపుల్లో ఎక్కడా లేదు. అంతెందుకు అతి చిన్న దేశాలైన లక్సమ్ బర్గ్,  అజర్ బైజాన్, అండోరా వంటివి కూడా వందశాతం అక్షరాస్యతను సాధించాయి.  

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. 1947లో మన దేశ అక్షరాస్యతా శాతం కేవలం 12. ఇప్పుడు 74 శాతం. 2001 ఇది 60.47 శాతంగా ఉండేది. వందశాతం సాధించడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. ప్రపంచంలో ప్రతి ముగ్గురు నిరక్ష రాస్యులలో ఒకరు కచ్చితంగా భారతదేశంలో ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 2005 లెక్కల ప్రకారం 127 దేశాల జాబితాలో అక్షరాస్యతలో భారత్ 106 వస్థానంలో నిలిచింది. 2017లో 105వ స్థానానికి వచ్చింది. పన్నెండేళ్ల కాలంలో అక్షరాస్యత శాతంలో పెద్దగా మార్పు రాకపోవడం శోచనీయం.

ముందున్న కేరళ
మనదేశంలో అక్షరాస్యతలో ముందున్న రాష్ట్రం కేరళ. గతేడాది లెక్కల ప్రకారం కేరళ 96.2 శాతం అక్షరాస్యతను సాధించింది. వందశాతం సాధించే దిశగా దూసుకుపోతోంది. 2016-20 మధ్య కాలంలో లక్షమందికి పైగా ప్రజలను అక్షరాస్యులను చేసి రికార్డు సాధించింది. వీరందరూ కూడా అట్టడుగు వర్గాలకు చెందినవారే. మత్స్యకారులు, ఉపాధి కార్మికులు, వారి కుటుంబాలను ఎంపిక చేసుకుని వారందరినీ అక్షరాస్యులుగా చేసింది. 

తెలుగు రాష్ట్రాలెక్కడ?
నేషనల్ శాంపిల్ సర్వే 2017-18 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 66.4 శాతం మంది అక్షరాస్యులు ఉండగా, తెలంగాణాలో 72.8 శాతం మంది ఉన్నట్టు గుర్తించారు. 

అసలేంటీ అక్షరాస్యతా దినోత్సవం?
యునెస్కో సభ్యదేశాల విద్యామంత్రులంతా కలిసి 1965 నవంబర్ లో  ప్రతి ఏడాది అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 1966 నుంచి ప్రతి సెప్టెంబరు8 న అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. 

Also read: సంగీతంతో మానసికోల్లాసం... ఒత్తిడి మాయం

Also read: ఈ బిర్యానీల రుచి అదిరిపోతుంది... ఒక్కసారి తిని చూడండి

Also read: జ్యూయలరీ ప్రకటనలో పెళ్లికూతురిగా ట్రాన్స్ జెండర్... ఇన్ స్టాలో లక్షల వ్యూస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Halim Seeds : ఉదయాన్నే హలీమ్ సీడ్స్ తింటే కలిగే లాభాలు.. ఎలా తీసుకోవాలి? ఎవరెవరు జాగ్రత్తపడాలి?
ఉదయాన్నే హలీమ్ సీడ్స్ తింటే కలిగే లాభాలు.. ఎలా తీసుకోవాలి? ఎవరెవరు జాగ్రత్తపడాలి?
Summer Diet : మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
Muscle Strain : మసిల్ స్ట్రెయిన్ అంటే ఏమిటి? కండరాలు బెణికినప్పుడు తీసుకోవాల్సిన పూర్తి జాగ్రత్తలు ఇవే
మసిల్ స్ట్రెయిన్ అంటే ఏమిటి? కండరాలు బెణికినప్పుడు తీసుకోవాల్సిన పూర్తి జాగ్రత్తలు ఇవే
Walnuts for Health : వాల్‌నట్స్ తినే సరైన పద్ధతి..  ఇలా తింటేనే గుండె, మెదడుకు డబుల్ బెనిఫిట్స్
వాల్‌నట్స్ తినే సరైన పద్ధతి..  ఇలా తింటేనే గుండె, మెదడుకు డబుల్ బెనిఫిట్స్

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Embed widget