అన్వేషించండి

World Literacy Day: అక్షరాస్యతలో భారత స్థానం ఇంకా అక్కడే...

నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం. ఈ సందర్భంగా మన దేశం అక్షరాస్యతలో ఏ స్థానంలో ఉందో, ఏ రాష్ట్రం ముందుందో తెలుసుకుందాం.

ప్రపంచ దేశాల్లో అక్షరాస్యతలో ముందున్న అయిదు దేశాల పేర్లు చెప్పగలరా? అని అడిగితే... మొదట ఎవరైనా అమెరికా, బ్రిటన్ ఇలా చెప్పడం మొదలుపెడతారు. ఎందుకంటే అవే ప్రపంచంలో ధనిక దేశాలుగా, బలమైన రాజ్యాలుగా పేరుపొందాయి. నిజానికి ప్రపంచంలో  ధనిక దేశాలు లేదా అత్యధిక జనాభా కలిగిన దేశాలేవి అక్షరాస్యతలో ముందుస్థానంలో లేవు.  అతి చిన్నదేశాలు అత్యధిక అక్షరాస్యతను సాధించి మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. 

ఫిన్ లాండ్ మొదటి స్థానంలో ఉండగా, నార్వే, ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్ దేశాలు తరువాతి స్థానాలను వరుసగా సాధించాయి. స్విట్టర్లాండ్ ఆరో స్థానాన్ని, అమెరికా ఏడవ స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక ఫ్రాన్స్ 12, బ్రిటన్ 17వ స్థానాల్లో ఉన్నాయి. మనదేశం ఈ దరిదాపుల్లో ఎక్కడా లేదు. అంతెందుకు అతి చిన్న దేశాలైన లక్సమ్ బర్గ్,  అజర్ బైజాన్, అండోరా వంటివి కూడా వందశాతం అక్షరాస్యతను సాధించాయి.  

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. 1947లో మన దేశ అక్షరాస్యతా శాతం కేవలం 12. ఇప్పుడు 74 శాతం. 2001 ఇది 60.47 శాతంగా ఉండేది. వందశాతం సాధించడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. ప్రపంచంలో ప్రతి ముగ్గురు నిరక్ష రాస్యులలో ఒకరు కచ్చితంగా భారతదేశంలో ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 2005 లెక్కల ప్రకారం 127 దేశాల జాబితాలో అక్షరాస్యతలో భారత్ 106 వస్థానంలో నిలిచింది. 2017లో 105వ స్థానానికి వచ్చింది. పన్నెండేళ్ల కాలంలో అక్షరాస్యత శాతంలో పెద్దగా మార్పు రాకపోవడం శోచనీయం.

ముందున్న కేరళ
మనదేశంలో అక్షరాస్యతలో ముందున్న రాష్ట్రం కేరళ. గతేడాది లెక్కల ప్రకారం కేరళ 96.2 శాతం అక్షరాస్యతను సాధించింది. వందశాతం సాధించే దిశగా దూసుకుపోతోంది. 2016-20 మధ్య కాలంలో లక్షమందికి పైగా ప్రజలను అక్షరాస్యులను చేసి రికార్డు సాధించింది. వీరందరూ కూడా అట్టడుగు వర్గాలకు చెందినవారే. మత్స్యకారులు, ఉపాధి కార్మికులు, వారి కుటుంబాలను ఎంపిక చేసుకుని వారందరినీ అక్షరాస్యులుగా చేసింది. 

తెలుగు రాష్ట్రాలెక్కడ?
నేషనల్ శాంపిల్ సర్వే 2017-18 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 66.4 శాతం మంది అక్షరాస్యులు ఉండగా, తెలంగాణాలో 72.8 శాతం మంది ఉన్నట్టు గుర్తించారు. 

అసలేంటీ అక్షరాస్యతా దినోత్సవం?
యునెస్కో సభ్యదేశాల విద్యామంత్రులంతా కలిసి 1965 నవంబర్ లో  ప్రతి ఏడాది అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 1966 నుంచి ప్రతి సెప్టెంబరు8 న అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. 

Also read: సంగీతంతో మానసికోల్లాసం... ఒత్తిడి మాయం

Also read: ఈ బిర్యానీల రుచి అదిరిపోతుంది... ఒక్కసారి తిని చూడండి

Also read: జ్యూయలరీ ప్రకటనలో పెళ్లికూతురిగా ట్రాన్స్ జెండర్... ఇన్ స్టాలో లక్షల వ్యూస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Warm Water with Empty Stomach : ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే ఏమవుతుంది? వారం రోజుల్లో కనిపించే మార్పులు ఇవే
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే ఏమవుతుంది? వారం రోజుల్లో కనిపించే మార్పులు ఇవే
Sara Tendulkar Skincare Routine : సారా టెండూల్కర్ స్కిన్ కేర్ సీక్రెట్స్ ఇవే.. సింపుల్ రొటీన్‌తో గ్లాస్ స్కిన్
సారా టెండూల్కర్ స్కిన్ కేర్ సీక్రెట్స్ ఇవే.. సింపుల్ రొటీన్‌తో గ్లాస్ స్కిన్
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Water Tank Cleaning Tips : ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Embed widget