అన్వేషించండి

Republic Day 2022: మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించేందుకు జనవరి 26వ తేదీనే ఎందుకు ఎంచుకుంది?

ఈరోజు మనదేశం తన 73వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది.

పరాయి పాలనలో మగ్గి... ప్రాణాలకు తెగించి పోరాడి మరీ స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. కానీ మనల్ని మనం పాలించుకోవడానికి ఒక దిశా నిర్దేశం కావాలి. ప్రతి దేశానికి సొంత రాజ్యాంగం ఉన్నట్టే మనకీ అవసరం. ఆ పనిని అంబేద్కర్‌కు అప్పగించారు పెద్దలు. రాజ్యాంగం పూర్తయ్యాక 1949లో నవంబర్ 26న ఆమోదం పొందింది. అయితే దీన్ని అమలులోకి తెచ్చేందుకు ఒక ప్రత్యేకమైన రోజు అవసరమని  భావించారు. అందుకోసం ‘జనవరి 26వ’ తేదీని ఎంచుకున్నారు. అలా 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చి భారతదేశాన్నిసర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్రరాజ్యంగా మార్చారు. 

జనవరి 26 తేదీనే ఎందుకు?
రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించినప్పటికీ వెంటనే అమలు చేయకుండా జనవరి 26వ తేదీ వరకు ఎందుకు ఆగారు? ఆ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు? ఆ తేదీకి స్వాతంత్య్రోద్యమంలో చారిత్రక స్థానం ఉంది. బ్రిటిష్ వారిపై తిరుగుబాటులో భాగంగా 1930, జనవరి 26న జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్‌ని (సంపూర్ణ స్వాతంత్య్రం) ఆరోజే ప్రకటించింది. లాహోర్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. రావి నది ఒడ్డున నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ‘భారతీయులకు స్వేచ్ఛ కావాల్సిందే, మా దేశాన్ని మాకు అప్పగించి మీరు దేశాన్ని వీడాల్సిందే’ అని బ్రిటిషర్లకు తమ  ఉద్యమతీవ్రతను అర్థమయ్యేలా చేశారు. ఏదో సామంత దేశంగా మిగిలిపోవడం మాకు ఇష్టం లేదని, పూర్తిగా మా దేశాన్ని మాకు అప్పగించాల్సిందేనని ఆ రోజే గట్టిగా నినదించారు.  అప్నట్నించి  జనవరి 26ను కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవంగా వ్యవహరించి వేడుకలు నిర్వహించుకునేవారు. అయితే మనకు బ్రిటిష్వారు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం ప్రకటించడంతో జనవరి 26 చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉన్నట్టు గుర్తించారు నెహ్రూ, ఇతర నేతలు. ఆ రోజు చిరస్థాయిగా నిలిచిపోవాలనే కోరికతో గణతంత్ర దినోత్సవంగా చేశారు. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950, జనవరి 26న తుపాకుల వందనంతో జెండా ఎగురవేసి మొదటి గణతంత్రదినోత్సవ వేడుకలను ప్రారంభించారు.  

స్వాతంత్య్ర దినోత్సవంలాగే గణతంత్ర దినోత్సవం కూడా జాతీయ సెలవుదినంగా ప్రకటించారు. దేశరాజధానిలో విశాలమైన గ్రౌండ్ లో వివిధ రాష్ట్రాల శకటాలు పరేడ్ లో పాల్గొంటాయి. సైనిక, వాయు, నౌకా దళాలకు చెందిన మహిళదళాలు రాజ్‌పథ్ కవాతు చేస్తాయి. యుద్ధవిమానాలు కూడా పరేడ్ లో పాల్గొంటాయి. 

Also Read: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..

Also Read: కన్నార్పకుండా చూసేలా గణతంత్ర వేడుకలు.. ఈ సారి ఎన్నెన్ని విశేషాలో తెలుసా..?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget